News in pics : చిత్రం చెప్పే విశేషాలు (28-04-2024)
నిత్యం మన చుట్టూ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అందులోని కొన్ని ఆసక్తికరమైనవి మీకోసం..
Updated : 28 Apr 2024 03:36 IST
1/6
వరంగల్: ఖానాపురం శివారులో పాకాలవాగుపై నిర్మించిన చెక్డ్యాంలోకి నీరు పుష్కలంగా చేరడంతో మత్తడి పోస్తోంది. మండుతున్న ఎండల్లోనూ చెక్డ్యాం నీటితో కళకళలాడుతోంది. యాసంగి సాగుకు సరిపడా నీరుందని అధికారులు తెలిపారు.
2/6
హైదరాబాద్: విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో మైదానాలు సందడిగా మారుతున్నాయి. క్రీడా శిబిరాలు నిర్వహిస్తుండటంతో చిన్నారులు శిక్షణకు హాజరవుతున్నారు. సరూర్నగర్ స్టేడియంలో తెల్లవారుజామునే పిల్లలు ఇలా సాధన చేస్తూ కనిపించారు.
3/6
విశాఖపట్నం: మండలంలోని వేంపాడు ఉన్నత పాఠశాలలో శనివారం పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. ఇదే పాఠశాలలో 2003-04 సంవత్సరంలో పది చదువుతుకున్న వీరంతా 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆత్మీయసమావేశం ఏర్పాటు చేసుకున్నారు. కుశల ప్రశ్నలతో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి సహకరించాలని నిర్ణయించారు.
4/6
కడప: పట్టణంలో రామేశ్వరం వీధిలో రాజరాజేశ్వరీదేవి సమేత ముక్తిరామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో శనివారం శేషవాహనంపై ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో మేళతాళాల నడుమ గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి కుంకుమార్చనను భక్తులతో చేయించారు.
5/6
కరీంనగర్: గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో తూకాలు వేసిన ధాన్యం బస్తాలు ట్రాక్టర్లలో కేటాయింపు చేసిన మిల్లులకు తరలి వస్తున్నాయి. శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామ శివారు ఓ మిల్లు వద్ద శనివారం ఇలా బారులుదీరి కనిపించాయి.
6/6
హైదరాబాద్: మండుతున్న ఎండలకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ఆనుకుని ఉన్న ముల్లకత్వ చెరువులో నీరింకి కొంతభాగం బీడుగా మారింది. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చెరువులో పూడికతీత మొదలుపెట్టారు. పనులు జోరుగా సాగుతున్నాయి.
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు