
తాజా వార్తలు
రోహిత్ అందుకే వెళ్లలేదు: షా
సిడ్నీ: ఓపెనర్ రోహిత్శర్మ ఫిట్నెస్పై బీసీసీఐ సరైన స్పష్టత ఇవ్వకపోవడంపై తాజాగా భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో బోర్డు స్పందించింది. తండ్రికి అనారోగ్యంగా ఉండడం వల్లే రోహిత్.. ఆస్ట్రేలియా వెళ్లలేకపోయాడని కార్యదర్శి జై షా స్పష్టం చేశాడు. గాయంపై అంచనా వేయడానికి వచ్చే నెల 11న రోహిత్కు మళ్లీ ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తామని అతను తెలిపాడు. ‘‘యూఏఈలో ఐపీఎల్ ముగిసిన తర్వాత అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసేందుకు రోహిత్ ముంబయి చేరుకున్నాడు. తండ్రి పరిస్థితి మెరుగవుతుండడంతో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి పునరావాసం కోసం వచ్చాడు. రోహిత్కు డిసెంబర్ 11న మళ్లీ ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తాం. పేసర్ ఇషాంత్శర్మ పక్కటెముకల గాయం నుంచి కోలుకున్నాడు. కానీ మ్యాచ్ ఫిట్నెస్ సాధించడానికి అతనికింకా సమయం పడుతుంది. అందుకే ఆసీస్తో టెస్టు సిరీస్కు పూర్తిగా దూరమయ్యాడు’’ షా పేర్కొన్నాడు.