AP EAPCET: మే 13 నుంచి ఈఏపీసెట్‌.. ఏపీలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఏపీలో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదలైంది.

Updated : 14 Feb 2024 15:31 IST

అమరావతి: ఏపీలో రాబోయే విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌ సహా ఇతర కోర్సులు అభ్యసించేందుకు ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది. ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష AP EAPCETను మే 13 నుంచి 19వరకు నిర్వహించాలని నిర్ణయించింది.  ఈ మేరకు ఏపీ ఈసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌ సహా మరో ఎనిమిది ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేసింది. 2024- 25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షల తేదీలు.. నిర్వహించే యూనివర్సిటీల వివరాలివే..

  • ఏపీ ఈఏపీసెట్‌ - మే 13 నుంచి 19 వరకు - జేఎన్టీయూ కాకినాడ
  • ఈసెట్‌ - మే 8 - జేఎన్టీయూ, అనంతపురం
  • ఐసెట్‌ - మే 6- శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, అనంతపురం
  • పీజీఈసెట్‌ - మే 29 నుంచి 31 వరకు - శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి
  • ఎడ్‌సెట్‌ - జూన్‌ 8 - ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం
  • లాసెట్‌ - జూన్‌ 9 - ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు
  • పీఈసెట్‌ - తేదీ ఇంకా ప్రకటించాల్సి ఉంది- ఆచార్య నాగార్జున యూనివర్సిటీ
  • పీజీసెట్‌ - జూన్‌ 3 నుంచి 7 వరకు - ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖ
  • ఏడీసెట్‌ (ఆర్ట్‌ అండ్‌డిజైన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ -BFA/B.Design etc) - జూన్‌ 13 - డా. వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్‌ యూనివర్సిటీ, కడప

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని