పెన్నా పొర్లుకట్టకు రూ. 100 కోట్లు
‘నెల్లూరు బ్యారేజీ దిగువ ప్రాంతాలు ముంపునకు గురికాకుండా.. పెన్నా పొర్లుకట్ట నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నాను. పండగల తర్వాత నేనే వచ్చి శంకుస్థాపన చేస్తా.
నెల్లూరు పర్యటనలో ముఖ్యమంత్రి జగన్
వరద బాధితులను ఆదుకుంటామని హామీ
తిరుపతిలోనూ పలు ప్రాంతాల్లో పర్యటన
నెల్లూరు జిల్లా పెనుబల్లిలో వరద బాధితుల సమస్యలు వింటున్న సీఎం జగన్
ఈనాడు డిజిటల్, నెల్లూరు: ‘నెల్లూరు బ్యారేజీ దిగువ ప్రాంతాలు ముంపునకు గురికాకుండా.. పెన్నా పొర్లుకట్ట నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నాను. పండగల తర్వాత నేనే వచ్చి శంకుస్థాపన చేస్తా. దీంతోపాటు నెల్లూరు, సంగం బ్యారేజీలను ప్రారంభిస్తాను’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. నెల్లూరు భగత్సింగ్ కాలనీలో మాట్లాడారు. వరద బాధితులకు ఇంటికి రూ.2వేలతో పాటు రేషన్ కూడా ఇచ్చామని, రాని వాళ్లు ఈ నెల అయిదో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పెన్నా వరద నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దెబ్బతిన్న సోమశిల జలాశయ యాప్రాన్ నిర్మాణానికి రూ.120 కోట్లు మంజూరుచేసినట్లు తెలిపారు. వరద బాధితులను ఆదుకోవడంలో కలెక్టర్ చక్రధర్బాబు, నగర కమిషనర్ దినేష్కుమార్ పనితీరును ప్రశంసించారు. మధ్యాహ్నం 1.30కు నెల్లూరు పోలీసు కవాతు మైదానానికి చేరుకున్న సీఎం.. అక్కడి నుంచి నెల్లూరు గ్రామీణ మండలం దేవరపాళేనికి వెళ్లారు. వరదలతో దెబ్బతిన్న రహదారులు, పంటలు, కోతకు గురైన కరకట్టను పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం తెలుసుకుని.. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పెనుబల్లిలో దెబ్బతిన్న రోడ్లు, పాఠశాల, పంట పొలాలను సందర్శించారు. భగత్సింగ్నగర్ కాలనీలో కోతకు గురైన పెన్నా నదిని పరిశీలించి.. బాధితులను పరామర్శించారు.
నెల్లూరు జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్రావు సీఎం సహాయనిధికి రూ.కోటిని అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి హెలికాప్టర్లో రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
మహిళను పలకరిస్తున్న సీఎం
రోడ్లు మంచిగా వేస్తాం
తిరుపతిలో వరద ప్రభావిత ప్రాంతాలైన శ్రీకృష్ణనగర్, సరస్వతినగర్, గాయత్రినగర్లలో ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. సరస్వతినగర్లో నగరపాలకసంస్థ ఏర్పాటుచేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. స్థానికులు కొందరు ‘రోడ్లు వేయండి సర్’ అని కోరారు. ఈ మాటలను విన్న సీఎం.. మంచిగా రోడ్లు వేస్తామంటూ హామీ ఇచ్చారు. అనంతరం తిరుచానూరు వద్ద పాడిపేట మార్గంలో కొట్టుకుపోయిన స్వర్ణముఖి నది వంతెనను పరిశీలించారు. ఇక్కడ వరదల నుంచి పలువురిని కాపాడిన ఐదుగురు వ్యక్తులను సన్మానించారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్రెడ్డి ఉన్నారు.
నర్సు ఇంటికి వెళ్లి పరామర్శ
హెడ్ నర్సు విజయకుమారిని ఆమె ఇంటికి వెళ్లి పరామర్శిస్తున్న సీఎం జగన్
తిరుపతి శ్రీకృష్ణనగర్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రికి.. ప్రమాదంలో గాయపడి ఇంటికే పరిమితమైన స్విమ్స్ హెడ్నర్సు విజయకుమారి గురించి ఆమె కుమార్తె విన్నవించారు. దాంతో ఆయన అదే ప్రాంతంలో ఉన్న వారి ఇంట్లోకి వెళ్లి బాధితురాలిని పరామర్శించారు. అక్కడకు సమీపంలోనే అనారోగ్యంతో బాధపడుతున్న మరో మహిళ రహదారి పక్కన కుర్చీలో కూర్చొని ఉండగా.. గమనించిన సీఎం ఆమె వద్దకు వెళ్లి మోకాళ్లపై కూర్చొని ఆమెతో మాట్లాడారు.
మెడపట్టి తోసేస్తున్న పోలీసులు
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం పెనుబల్లిలో పర్యటించిన సీఎం జగన్ను కలిసి తన గోడు విన్నవించేందుకు వేళాంగిణి అనే మహిళ పడిన కష్టం అందరినీ అయ్యో అనిపించేలా చేసింది. సీఎంను కలవాలని ఆమె వేడుకున్నా.. పోలీసులు మెడపట్టి నెట్టేశారు. ముఖ్యమంత్రి సమీపిస్తున్న సమయంలో ‘అయ్యా.. ముఖ్యమంత్రి గారూ’ అంటూ గట్టిగా అరవడంతో అక్కడికి చేరుకొన్న ఆయన.. ఆమె సమస్యను విన్నారు. తన భర్త రైల్వేల్లో పనిచేసి మరణించారని, తన కుమారుడికి ఆ ఉద్యోగం ఇప్పించాలని ఆమె కోరారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంలో ఏమైనా అవకాశం ఉంటే చూద్దామని ఆమెను అనునయించిన సీఎం.. వెంటనే ఆ విషయం చూడాలని నెల్లూరు కలెక్టర్ను ఆదేశించారు. ‘అధైర్యపడకు.. నేనున్నా’ అని ఆమెను అనునయించారు.
నేనున్నానంటూ భరోసా ఇస్తున్న సీఎం
- ఈనాడు, నెల్లూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం