మెరుగుపడిన ఏపీ గవర్నర్‌ ఆరోగ్యం

కొవిడ్‌ అనంతరం తలెత్తిన సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యం మెరుగుపడినట్లు మంగళవారం....

Updated : 08 Dec 2021 05:18 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ అనంతరం తలెత్తిన సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వ భూషణ్‌ హరిచందన్‌ ఆరోగ్యం మెరుగుపడినట్లు మంగళవారం రాత్రి ఏఐజీ ఆస్పత్రి ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన క్రమంగా కోలుకుంటున్నట్లు వెల్లడించింది. శ్వాస తీసుకోవడంలోని ఇబ్బందులు, ఇతరత్రా సమస్యలన్నీ సాధారణ స్థితికి వచ్చాయని పేర్కొంది. డాక్టర్‌.డి.నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్‌ ఆరోగ్యాన్ని నిరంతరం పరీక్షిస్తున్నామని, డిశ్చార్జిపై ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని