ఇంటర్‌ పరీక్షల షెడ్యూలులో మార్పు

ఇంటర్‌ అర్ధసంవత్సర పరీక్షల షెడ్యూలును ఇంటర్‌ విద్యామండలి మార్చింది. ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులకు సిలబస్‌ పూర్తి కానందున వాయిదా వేయాలని....

Updated : 08 Dec 2021 05:18 IST

ఈనాడు, అమరావతి: ఇంటర్‌ అర్ధసంవత్సర పరీక్షల షెడ్యూలును ఇంటర్‌ విద్యామండలి మార్చింది. ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులకు సిలబస్‌ పూర్తి కానందున వాయిదా వేయాలని ప్రిన్సిపాళ్లు, లెక్చరర్ల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కార్యదర్శి శేషగిరిబాబు పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు జనవరి ఐదు వరకు కొనసాగనున్నాయి. ఈ ఏడాది అర్ధ సంవత్సరం పరీక్షలను కామన్‌ ప్రశ్నపత్రంతో నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా పబ్లిక్‌ పరీక్షలను నిర్వహించలేకపోతే వీటినే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని