నాడు అంగీకరించి.. నేడు ఆందోళనా?: మంత్రి సురేష్
ఇటీవల ముఖ్యమంత్రి జగన్తో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీని అంగీకరించారని.. నేడు వారే ఆందోళన చేయడం సరికాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడి వద్దనున్న విజ్ఞాన్ డీమ్డ్
పొన్నూరు, న్యూస్టుడే: ఇటీవల ముఖ్యమంత్రి జగన్తో జరిగిన సమావేశంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీని అంగీకరించారని.. నేడు వారే ఆందోళన చేయడం సరికాదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడి వద్దనున్న విజ్ఞాన్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీలో గురువారం విలేకర్లతో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు ఇబ్బందులుంటే ప్రభుత్వంతో మాట్లాడవచ్చని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నా.. తీవ్రత అంతగా లేదని అభిప్రాయపడ్డారు. పాఠశాలలకు సెలవులిచ్చే ఆలోచన లేదని స్పష్టంచేశారు. విద్యార్థులకు కరోనా వస్తే సదరు పాఠశాల వరకు మూసేసి శానిటైజ్ చేశాక పునఃప్రారంభిస్తామన్నారు. కొన్ని విశ్వవిద్యాలయాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని, న్యాయస్థానం కూడా ఇందుకు అనుమతించిందని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్