AP PRC: విరమణ తర్వాతే ఐఆర్!
ఉద్యోగుల నుంచి ఐఆర్ రికవరీ ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించింది. ఆ కారణం వల్ల దాదాపు రూ.6,000 కోట్లు డీఏ బకాయిల రూపంలో చెల్లించాల్సి వస్తుందని, ఇది అదనపు భారమేనని చెబుతోంది.
‘రూ.6 వేల కోట్ల భారం’ వాయిదా
ఈనాడు, అమరావతి: ఉద్యోగుల నుంచి ఐఆర్ రికవరీ ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించింది. ఆ కారణం వల్ల దాదాపు రూ.6,000 కోట్లు డీఏ బకాయిల రూపంలో చెల్లించాల్సి వస్తుందని, ఇది అదనపు భారమేనని చెబుతోంది. అయితే, ఆ రూ.6 వేల కోట్లు ఇచ్చేది ఇప్పుడు కాదని, డీఏ బకాయిలన్నీ పదవీ విరమణ చేసిన తర్వాతేనని పెట్టిన మెలికపై ఉద్యోగులు నిట్టూర్పు విడుస్తున్నారు. పదవీ విరమణ వయసు ఇటీవలే 62 ఏళ్లకు పెంచారు. రానున్న రెండేళ్లలో ఎవరూ రిటైర్ అయ్యే అవకాశం లేదు. అంటే, దాదాపు ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలంలోగా రూ.6 వేల కోట్లు అందవన్న మాట! ఈ సమీకరణం అర్థం చేసుకున్న వారు విస్తుపోతున్నారు. మంత్రుల కమిటీ నిర్ణయాలపై జీవోలు వస్తే తప్ప పూర్తి స్పష్టత రాదు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఉద్యోగుల్లో ముసురుకొన్న సందేహాలివి.
* డీఏ బకాయిలు ఉద్యోగ విరమణ తర్వాత ఇస్తామని చెప్పినా వీటికి విధివిధానాలు తెలియదు. జనవరి 17న ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం బకాయిలు నాలుగు సమాన వాయిదాల్లో జీపీఎఫ్ ఖాతాలకు జమ చేయాలి. మారిన పరిస్థితుల దృష్ట్యా జీపీఎఫ్ ఖాతాలకు జమ చేయడం లేదు.
* జీపీఎఫ్ ఖాతాలకు జమ చేస్తే కనీసం 8శాతం వడ్డీ అయినా వచ్చేదని, అలా కాకుండా పదవీ విరమణ తర్వాత అంటే.. ఈ మొత్తం విలువ ఆ నాటికి ఎంత అవుతుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా 20 ఏళ్లకో, పాతికేళ్లకో పదవీ విరమణ చేసే వారూ ఉన్నారని, ఇప్పుడే అందాల్సిన రూ.50 వేలో.. రూ.60 వేలో సొమ్ము అప్పటికి ఏపాటి విలువ చేస్తుందన్నది వారి ప్రశ్న.
* సీపీఎస్ ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు లేవు. మిగిలిన ఉద్యోగులకు జీపీఎఫ్కు జమ చేయాలని ఒకవేళ నిర్ణయించినా ఈ అవకాశం సీపీఎస్ ఉద్యోగులకు వర్తించదు.
* ధరల పెరుగుదల వల్ల ఉద్యోగులపై పడే భారాన్ని సర్దుబాటు చేసేందుకు ఇచ్చేదే డీఏ. ఇప్పటి ధరల భారాన్ని తగ్గించాల్సిన కరవు భత్యం ఎప్పుడో పదవీ విరమణ తర్వాత ఇవ్వడమేంటన్నది మౌలిక ప్రశ్న.
ఇంకా రిక‘వర్రీ’యే!
మధ్యంతర భృతి 9 నెలల పాటు రికవరీ చేయబోమని మంత్రుల కమిటీ శనివారం రాత్రి ప్రకటించింది. ఇంటి అద్దె భత్యానికి సంబంధించి తాజాగా ప్రకటించిన శ్లాబులు 2022 జనవరి నుంచి మాత్రమే అమలవుతాయని వెల్లడించారు. అంటే 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ 31 వరకు కొత్త జీవో 1లోని మార్చిన ఇంటి అద్దె భత్యం మాత్రమే లెక్కలోకి తీసుకుంటారని తెలుస్తోంది. అంటే మోనిటరీ ప్రయోజనం లెక్కించిన 21 నెలల కాలానికి కనిష్ఠంగా 4శాతం, గరిష్ఠంగా 14శాతం మేర హెచ్ఆర్ఏ రికవరీ చేస్తున్నట్లేనా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. మోనిటరీ ప్రయోజనం సమయంలో ఫిట్మెంట్ 23శాతంగా నిర్ణయించారు. దీనిలో ఎలాంటి మార్పు లేదు. అక్కడా 4శాతం ఐఆర్ రూపంలో నష్టపోతున్నట్లు కొందరు ఉద్యోగులు విశ్లేషిస్తున్నారు. అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ విషయంలోనూ ఇదే సమస్య ఎదురు కానుంది. పాత విధానానికి, శనివారం నాటి మంత్రుల కమిటీ నిర్ణయానికి మధ్య 8శాతం పెన్షన్ వ్యత్యాసం ఉంది. ఆ మేరకు 21 నెలలు తాము 8శాతం చొప్పున రివకరీలో కోల్పోతున్నట్లే కదా అని పెన్షనర్లు ప్రశ్నిస్తున్నారు.
ఆరోగ్య కార్డులపై ఆందోళన
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య భద్రత కార్డులకు విలువ ఉందని, ఇతర రాష్ట్రాల్లోనూ కొన్నిచోట్ల వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మన రాష్ట్ర ఆరోగ్య కార్డులకు నగదు రహిత వైద్యం ఎక్కడా అందడం లేదని, ప్రధాన ఆస్పత్రుల్లో వాటిని అనుమతించడం లేదని చెబుతున్నారు. ఈ తరుణంలో అదనపు క్వాంటమ్ పెన్షన్ తగ్గించడం ఎంతవరకు సబబు అని పెన్షనర్లు ప్రశ్నిస్తున్నారు. తమ ఆరోగ్య సమస్యలు, వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం అదనపు పరిమాణంలో పెన్షన్ మంజూరు చేస్తుందని గుర్తుచేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!