Andhra News: కోర్టులో చోరీ కేసు దర్యాప్తుపై సందేహాలెన్నో!
వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నిందితుడిగా ఉన్న కేసులో ఆధారాలు నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురయ్యాయన్న ఫిర్యాదుపై నమోదైన కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అన్నీ సమాధానాలు దొరకని ప్రశ్నలే
స్వతంత్ర దర్యాప్తుతోనే వెలుగులోకి నిజాలు
ఈనాడు, అమరావతి: వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నిందితుడిగా ఉన్న కేసులో ఆధారాలు నెల్లూరు కోర్టు నుంచి చోరీకి గురయ్యాయన్న ఫిర్యాదుపై నమోదైన కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు అవి కోర్టు ఆధీనంలో లేవని, నెల్లూరు రెండో పట్టణ పోలీసుస్టేషన్ ఆధీనంలో ఉన్నాయంటూ నెల్లూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) డాక్టర్ సి.యామిని హైకోర్టుకు సమర్పించిన నివేదికలో స్పష్టం చేయడంతో.. పోలీసుదర్యాప్తులోని లోపాలు చర్చనీయాంశమయ్యాయి. కోర్టులో చోరీ విషయం ఈ నెల 14న బయట పడినప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన పరిణామాలన్నీ విశ్లేషిస్తే సమాధానం లేని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయిస్తేనే పూర్తినిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది. దర్యాప్తులో నిగ్గు తేలాల్సిన అంశాలు ఇవీ...
గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు?
కేసులో ఆధారాలు కోర్టు నుంచి చోరీకి గురైనట్లు బెంచ్ క్లర్క్ నాగేశ్వరరావు కట్టుకథ సృష్టించారని నెల్లూరు పీడీజే తన నివేదికలో పేర్కొన్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులతో ఆయన కుమ్మక్కై కోర్టును తప్పుదారి పట్టించారని ఆమె తెలిపారు. వారు ఎవరు?
ఆ వస్తువులు ఎవరివి.. ఎక్కడివి?
కోర్టు సమీపంలోని మురుగు కాలవలో లభ్యమైన వస్తువులు, పత్రాలు కోర్టుకు సంబంధించినవి కాకపోతే.. అవి ఎవరికి సంబంధించినవి? ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు?
ఆ రోజు ఎందుకు సరిగ్గా రక్షణ కల్పించలేదు?
నెల్లూరు కోర్టు ప్రాంగణానికి 24 గంటల పాటు 3 ప్లస్ 1 పోలీసులతో భద్రత ఉంటుంది. చోరీ ఘటన జరిగిన ఈ నెల 13న మాత్రం సరిగ్గా రక్షణ కల్పించలేదని నెల్లూరు పీడీజే హైకోర్టుకు నివేదించారు. సరిగ్గా ఆ రోజే పోలీసులు ఎందుకు తగిన రక్షణ ఇవ్వలేదు? ఆ సమయంలో సిబ్బంది ఎక్కడ ఉన్నారు? వారు చోరీ విషయాన్ని ఎందుకు గమనించలేదు?
సెలవు రోజు వెళ్లాల్సినంత పని ఉందా?
* ఈ నెల 14న అంబేద్కర్ జయంతి. ఆ రోజు పబ్లిక్ హాలిడే. అయినా సరే తాను కొన్ని పెండింగ్ పనులు చేసుకోవడానికి కోర్టుకు వెళ్లానని నాగేశ్వరరావు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు? సెలవు రోజు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనేదానిపై లోతుగా విచారించారా?
* ఈ నెల 12, 13, 14, 15, 16 తేదీల్లో నాగేశ్వరరావు సెల్ఫోన్ కాల్ రికార్డులను పరిశీలించారా?
* కాకాణి నిందితుడిగా ఉన్న కేసు ప్రాపర్టీ మొత్తం తాను సొంతంగా వినియోగించే బీరువాలో ఓ బ్యాగులో పెట్టానని పోలీసులకు నాగేశ్వరరావు చెప్పారు. అత్యంత కీలకమైన కేసు ప్రాపర్టీని ఆయన వ్యక్తిగతంగా వినియోగించే బీరువాలో ఎలా పెట్టుకుంటారు? చోరీ జరిగిన రోజున ఆ బీరువాకు ఆయన ఎందుకు తాళం వేయలేదు?
మరికొన్ని సందేహాలు..
* చోరీ ఘటనకు సంబంధించి దర్యాప్తులో వేలిముద్రలు, పాదముద్రల్ని పూర్తిస్థాయిలో విశ్లేషించారా?
* డాగ్ స్క్వాడ్ను ఘటనా స్థలానికి తీసుకొచ్చారా?
* పోలీసులు అరెస్టు చేసిన నిందితులకు నిజంగా ఆ చోరీ ఘటనతో సంబంధం ఉందా?
పోలీసులు పరిశీలించారా?
* మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి నిందితుడిగా ఉన్న కేసులో ఆధారాలే చోరీకి గురైనట్లు బెంచ్ క్లర్క్ బి.నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాని ఆధారంగా వారు కేసు నమోదుచేశారు. చోరీలో పోయిందని చెబుతున్న ప్రాపర్టీ నిజంగానే కోర్టు ఆధీనంలోనే ఉందా? కోర్టు రికార్డుల్లో ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎప్పడెప్పుడు ఏయే వివరాలు నమోదయ్యాయనే వివరాల్ని దర్యాప్తులో పోలీసులు పరిశీలించారా?
* బెంచ్ క్లర్క్ నాగేశ్వరరావు తప్పుడు ఫిర్యాదు ఇచ్చారని నెల్లూరు పీడీజే హైకోర్టుకు నివేదించారు. మరి ఆ కోణంలో పోలీసులు ఎందుకు దర్యాప్తు చేయలేదు?
* చోరీలో పోయిందని చెబుతున్న ప్రాపర్టీ పోలీసుస్టేషన్ ఆధీనంలో ఉందని నెల్లూరు పీడీజే హైకోర్టుకు నివేదించారు. ఆ విషయం అంతకుముందు పోలీసులకు తెలియదా?
* కోర్టులో జరిగిన చోరీ కేసులో ట్యాబ్, ల్యాప్టాప్, నాలుగు సెల్ఫోన్లు, ఏడు సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నామని ఈ నెల 17న నెల్లూరు ఎస్పీ విజయరావు తెలిపారు. ఆ నాలుగు సెల్ఫోన్లలో రెండు పనిచేయట్లేదని, ఒకదాంట్లో సర్వీసు మెసేజ్లే ఉన్నాయని, మరొక ఫోన్ లాక్ అయిపోయిందని, స్వాధీనం చేసుకున్న ల్యాప్టాప్లో కాకాణి కేసు సమాచారం ఏమీ లేదని నెల్లూరు పీడీజే తన నివేదికలో పొందుపరిచారు. ఆ వస్తువులన్నీ మూడున్నర రోజుల పాటు పోలీసుల ఆధీనంలోనే ఉన్నాయని వివరించారు. స్వాధీనం చేసుకున్న పరికరాల్లోని డేటా ఏమైంది?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!