AP Electrical: పల్లెల్లో కాళరాత్రులు
రాష్ట్రంలో విద్యుత్ కోతలతో గ్రామాలు గాఢాంధకారంలోకి జారిపోతున్నాయి. రాత్రివేళ గంటల తరబడి కరెంటు తీసేయడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇంట్లో ఉక్కపోత, బయట దోమలమోత వెరసి కాళరాత్రుల్లో జాగారం చేస్తున్నామని వాపోతున్నారు.
వేళాపాళా లేకుండా కరెంటు కోతలు
కొన్ని గ్రామాల్లో 14 గంటలు నిలిపివేత
వేసవి వేళ ఉక్కపోత.. దోమల మోత
ముందస్తు ప్రణాళిక లేకే కొరత
ఏపీ బిడ్లకు ఎక్స్ఛేంజీలో దొరకని విద్యుత్
ఈనాడు - అమరావతి
రాష్ట్రంలో విద్యుత్ కోతలతో గ్రామాలు గాఢాంధకారంలోకి జారిపోతున్నాయి. రాత్రివేళ గంటల తరబడి కరెంటు తీసేయడంతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇంట్లో ఉక్కపోత, బయట దోమలమోత వెరసి కాళరాత్రుల్లో జాగారం చేస్తున్నామని వాపోతున్నారు. పసిపిల్లల తల్లులు రాత్రంతా విసనకర్రతో గాలి విసురుతూ కూర్చోవాల్సి వస్తోంది. పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంత నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారు. కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్లు అందుబాటులో లేక రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కుటీర పరిశ్రమలపై పెను ప్రభావం పడుతోంది. 2015 నుంచి విద్యుత్ కోతలు లేకపోవటంతో పూర్తి వెలుగుల మధ్య గడుపుతున్న ప్రజలకు.. ఏడేళ్ల తర్వాత ఈ అనుభవం ఎదురవుతోంది. రాత్రివేళ పల్లెల్లో వీధులు నిశీధులుగా మారటం ఆందోళనకు గురిచేస్తోంది. కొన్ని గ్రామాల్లో దశలవారీగా రోజుకు 14 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది.
ఫిర్యాదు కేంద్రాలకు ఫోన్ చేస్తున్నవారు పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందని అడగటం మానేసి, కనీసం కోతలు విధించే షెడ్యూల్ ప్రకటించాలని వేడుకుంటున్నారు.
ప్రణాళికా లోపమే కారణం
వేసవిలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ను సమకూర్చుకోవడంపై డిస్కంలు దృష్టి పెట్టలేదు. రాష్ట్ర విద్యుత్ డిమాండ్లో సుమారు 20 శాతం బహిరంగ మార్కెట్ నుంచి కొంటున్నారు. వేసవిలో డిమాండ్ 240-250 మిలియన్ యూనిట్ల (ఎంయూ) మధ్య ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. డిస్కంలు కుదుర్చుకున్న పీపీఏల ప్రకారం సుమారు 190 ఎంయూల విద్యుత్ వస్తుంది. కనీసం 50 ఎంయూల మేర అదనంగా అవసరమని ముందే తెలుసు. ఎక్ఛేంజీల నుంచి రోజూ ఇంత కొనడం కష్టం. వేసవి అవసరాల దృష్ట్యా అదనపు విద్యుత్కు స్వల్పకాలిక పీపీఏలు కుదుర్చుకొని ఉండాల్సిందని ఓ అధికారి పేర్కొన్నారు. జెన్కో థర్మల్ కేంద్రాల దగ్గర బొగ్గు నిల్వలు సరిపడా అందుబాటులో ఉంచలేదు. కృష్ణపట్నం కేంద్రానికి విదేశీ బొగ్గును తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇప్పటికే ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న 800 మెగావాట్ల సామర్థ్యమున్న మూడో యూనిట్తో పీపీఏ కుదుర్చుకోవడానికి డిస్కంలు ఆసక్తి చూపలేదు. ఈ కారణాలన్నీ కోతలకు దారితీసినట్లు ఆ అధికారి విశ్లేషించారు.
జెన్కోతో పాటు హిందుజా నుంచి వచ్చే థర్మల్ విద్యుత్తో కలిపి 90.79 ఎంయూలు అందుబాటులో ఉంది. జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి 9.5 ఎంయూలు, పవన, సౌర విద్యుత్ కలిపి 26 ఎంయూలు, కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థ ఎన్టీపీసీ నుంచి సుమారు 40 ఎంయూల వచ్చినా రాష్ట్ర డిమాండ్ మేరకు ఇంకా 50 ఎంయూలు డిస్కంలు కొనాలి. ఇందుకు రోజూ కనీసం రూ.35 కోట్లు అవసరం. విద్యుత్ ఎక్ఛేంజీల్లో డిమాండ్ పెరడగడంతో కొన్ని టైం బ్లాక్ (ఒక్కో బ్లాక్ 15 నిమిషాలు)లలో యూనిట్ రూ.15-20 చొప్పున కొనాల్సి వస్తోంది. ఏపీ డిస్కంలు దాఖలు చేసిన బిడ్కు ఇక్కడ విద్యుత్ దొరకటం లేదు. దీంతోపాటు అన్షెడ్యూల్ ఇంటర్ఛేంజ్ (యూఐ) కింద జాతీయ గ్రిడ్ నుంచి రోజూ 3-4 ఎంయూల విద్యుత్ను అదనంగా డిస్కంలు తీసుకున్నా 15-20 ఎంయూల లోటు నమోదవుతోంది.
* డిస్కంలులోటు విద్యుత్గా చూపుతున్న మొత్తాన్ని సర్దుబాటు చేయటానికి అత్యవసర లోడ్ రిలీఫ్ పేరిట గ్రామాల్లో అడ్డగోలుగా కోతలు విధిస్తున్నాయి. రాష్ట్ర డిమాండ్ 235 ఎంయూలలో అధికారికంగా డిస్కంలు చూపుతున్న ఈఎల్ఆర్ 5-10% మాత్రమే. అయినా రోజుకు 10-14 గంటలపాటు కరెంటు తీసేస్తున్నారు. డిస్కంలు చూపుతున్న లోటు ప్రకారమైతే రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో రోజుకు ఇన్నేసి గంటలపాటు కోత పెట్టాల్సిన అవసరం రాదని, వాస్తవ విద్యుత్ లోటును డిస్కంలు బయట పెట్టడం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో?
* గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఒంటి గంట నుంచి 45 నిమిషాల పాటు కరెంటు లేదు. బుధవారం ఉదయం 7 నుంచి 8 గంటల వరకు మళ్లీ కోత విధించారు.
* ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని గ్రామాల్లో మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి వేకువజాము 3 గంటల వరకు సరఫరా నిలిచింది. బుధవారం మధ్యాహ్నం 2 నుంచి రాత్రి వరకూ రాలేదు. మద్దిపాడులో మంగళవారం రాత్రి 11 నుంచి ఒంటి గంట వరకు, మళ్లీ బుధవారం ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కోత విధించారు.
* కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం లంపకలోవలో మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నుంచి గంటన్నర పాటు, మళ్లీ బుధవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30వరకు విద్యుత్ సరఫరా లేదు.
* కడప జిల్లా ముద్దనూరు మండలంలో రోజులో 6-8 గంటలు కోతలను ప్రజలు భరించాల్సి వస్తోంది.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలంలో మంగళవారం అర్ధరాత్రి 12.40 నుంచి వేకువజాము 5.10 వరకు చీకట్లు అలముకున్నాయి. బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 వరకు విద్యుత్ లేదు. తిరువూరు పట్టణంలో రోజంతా 6 సార్లు కోతలు విధించారు.
విజయనగరం జిల్లా రామభద్రాపురంలో మంగళవారం అర్ధరాత్రి 12 నుంచి వేకువజాము 5 వరకూ సరఫరా నిలిచింది. బుధవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 4 దాకా కరెంటు లేదు.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో మంగళవారం అర్ధరాత్రి తర్వాత 12.30 నుంచి వేకువజామున 3 గంటల వరకు కరెంటు లేదు. బుధవారం తెల్లవారుజామున 4 నుంచి ఉదయం 6.30 వరకు, ఉదయం 9.20 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 3 నుంచి 4.30 వరకు, సాయంత్రం 6.30 నుంచి 7 వరకు పలు దఫాలుగా కోతలు విధించారు.
సౌర విద్యుత్ మొత్తం సామర్థ్యంలో 20 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతుంది.
రాష్ట్రంలో మంగళవారం విద్యుదుత్పత్తి సామర్థ్యం, వాస్తవ ఉత్పత్తి (మెగా వాట్లలో)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!