AP News: దెబ్బతిన్న పంటలకు రబీలోగా పరిహారం
ప్రస్తుతం కురుస్తున్న భారీవర్షాల కారణంగా రైతులు ఎంత నష్టపోయారో గుర్తించి... రబీ ముగిసేలోగానే నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడి
గులాబ్ తుపాను బాధిత రైతులకు పెట్టుబడి రాయితీ విడుదల
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పెట్టుబడి రాయితీ చెక్కును విడుదల చేస్తున్న
సీఎం జగన్, చిత్రంలో మంత్రి కన్నబాబు తదితరులు
ఈనాడు, అమరావతి: ప్రస్తుతం కురుస్తున్న భారీవర్షాల కారణంగా రైతులు ఎంత నష్టపోయారో గుర్తించి... రబీ ముగిసేలోగానే నష్టపరిహారం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో... 2021 ఖరీఫ్లో గులాబ్ తుపాను కారణంగా పంటలు నష్టపోయిన 34,586 మంది రైతుల ఖాతాల్లోకి రూ.22 కోట్ల పెట్టుబడి సాయాన్ని సీఎం జగన్ జమ చేశారు. ‘18 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి 13.96 లక్షల మంది రైతులకు ఈ రెండున్నరేళ్లలో రూ.1,071 కోట్లను పెట్టుబడి రాయితీగా అందించాం. ఏ సీజన్లో పంట దెబ్బతింటే అదే పంటకాలంలో సొమ్ము జమ చేస్తున్నాం. పారదర్శకత కోసం గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ చేసి.. జాబితాలను ప్రదర్శిస్తున్నాం. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం’అని పేర్కొన్నారు.
‘వైఎస్సార్ రైతు భరోసా కింద రూ.18,777 కోట్లను నేరుగా రైతుల చేతుల్లో పెట్టాం. సున్నా వడ్డీ కింద రూ.1,674 కోట్లు ఇచ్చాం. ఉచిత పంటల బీమా కింద రూ.3,788 కోట్లు ఇచ్చాం. పగటిపూట నాణ్యమైన విద్యుత్తు కోసం రూ.18 వేల కోట్లు, ఆక్వా రైతులకు విద్యుత్తు రాయితీగా రూ.1,520 కోట్లు ఇచ్చాం. పొలాలకు 9 గంటల ఉచిత విద్యుత్తును ఇవ్వడానికి ఫీడర్ల ఏర్పాటుకు రూ.1,700 కోట్లు పైగా ఖర్చు చేశాం’ అని సీఎం వివరించారు.
రూ.35 వేల కోట్లతో ధాన్యం సేకరణ
‘ధాన్యం సేకరణకు రూ.35వేల కోట్లు, పత్తి కొనుగోలుకు రూ.1,800 కోట్లు, ఇతర పంటల కొనుగోలుకు రూ.6,430 కోట్లను వెచ్చించాం. రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో రూ.2వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని, రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం’ అని తెలిపారు. ‘రైతుకు సమీపంలో... అదే గ్రామంలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా 10,778 ఆర్బీకేలు ఉన్నాయి. ‘ఆర్బీకే స్థాయి నుంచి వ్యవసాయ సలహామండళ్లను ప్రారంభించాం. ప్రతినెలా మొదటి శుక్రవారం ఆర్బీకే, రెండో శుక్రవారం మండల, మూడో శుక్రవారం జిల్లాస్థాయిలో కలెక్టర్ల వద్ద వీటి సమావేశాలు జరగాలి. ఈ సందర్భంగా ప్రస్తావించే రైతు సమస్యలను కలెక్టర్లు పరిష్కరించాలి. రాష్ట్రస్థాయిలో చేయాల్సిన వాటిని విభాగాధిపతులు, వ్యవసాయశాఖ కార్యదర్శికి సమాచారం ఇవ్వాలి’ అని నిర్దేశించారు.
50 రోజుల్లోనే పరిహారం
‘సెప్టెంబరులో గులాబ్ తుపాను వచ్చి పంటనష్టం జరిగితే... 50 రోజుల్లోపే పరిహారం అందించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, మంగళవారమే డబ్బు జమ అవుతుందని రైతులు కూడా ఊహించి ఉండరు’ అని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. అండగా ఉంటామని రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా.. సంస్కరణల ద్వారా వ్యవసాయరంగ పురోగతికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని ప్రశంసించారు.
ధాన్యం బస్తా రూ.1,450 చొప్పున కొంటున్నారు
ఈ సందర్భంగా పలువురు రైతులు సీఎం జగన్మోహన్రెడ్డితో మాట్లాడారు. తనకు రూ.14వేల పెట్టుబడి రాయితీ అందిందని తాడేపల్లిగూడెం మండలం మాధవరం రైతు ధన్రాజ్ పేర్కొన్నారు. ప్రభుత్వం బస్తా రూ.1,450 చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తోందన్నారు. కౌలు రైతునైన తనకు రూ.10,500 పెట్టుబడి రాయితీ అందిందని, డీసీసీ బ్యాంకులో అయిదుగురు సభ్యుల సంఘానికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున రుణం ఇస్తామన్నారని అనకాపల్లికి చెందిన కౌలు రైతు మహాలక్ష్మీనాయుడు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?