Vaccine: విదేశీ టీకాలకు మరిన్ని మినహాయింపులు
భారతీయ నియంత్రణ సంస్థ అనుమతులు లేకుండానే విదేశీ టీకాల వినియోగానికి అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాటి వినియోగ అనంతరం క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, బ్యాచ్లవారీగా కేంద్ర ఔషధ ప్రయోగశాలలో చేపట్టాల్సిన అధీకృత తనిఖీల నుంచి కూడా మినహాయింపునిచ్చింది.
ఫైజర్, మోడెర్నాలకు మార్గం సుగమం చేయడానికేనన్న అభిప్రాయాలు
ఈనాడు, దిల్లీ: భారతీయ నియంత్రణ సంస్థ అనుమతులు లేకుండానే విదేశీ టీకాల వినియోగానికి అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాటి వినియోగ అనంతరం క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, బ్యాచ్లవారీగా కేంద్ర ఔషధ ప్రయోగశాలలో చేపట్టాల్సిన అధీకృత తనిఖీల నుంచి కూడా మినహాయింపునిచ్చింది. ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ సోమాని బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ‘‘దేశీయంగా కొవిడ్-19 వ్యాక్సిన్ల ఉత్పత్తిని గరిష్ఠస్థాయికి పెంచుతున్నప్పటికీ జాతీయ అవసరాలు తీర్చడానికి విదేశాలనుంచి వ్యాక్సిన్లు దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇదివరకు నిపుణుల కమిటీ సిఫార్సులమేరకు యూఎస్ఎఫ్డీఏ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ, యూకే మెడికల్ అండ్ హెల్త్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ, జపాన్ ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ ఏజెన్సీలు అనుమతిచ్చిన, డబ్ల్యుహెచ్ఓ అత్యవసర వినియోగ విభాగ జాబితాలో ఉన్న వ్యాక్సిన్లను భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతి లేకుండానే నేరుగా ఉపయోగించడానికి అనుమతి ఇచ్చాం. అవన్నీ సుస్థిరమైన నిబంధనల ప్రకారం రూపొందిన టీకాలు కావడంతోపాటు, అప్పటికే వాటిని కోట్లమంది ప్రజలకు అందించిన నేపథ్యంలో పోస్ట్ అప్రూవల్ బ్రిడ్జింగ్ క్లినికల్ ట్రయల్స్తోపాటు, విదేశాల నుంచి వచ్చే టీకాల ప్రతి బ్యాచ్నూ కసౌలీలోని కేంద్ర ఔషధ ప్రయోగశాలలో పరీక్షించాలన్న నిబంధన నుంచి మినహాయింపునిస్తున్నాం. టీకా తయారైన దేశంలోని ప్రయోగశాలలో ఆ వ్యాక్సిన్ బ్యాచ్, లాట్లను పరీక్షించి, విడుదల చేయడానికి అనుమతి ఇచ్చి ఉంటే భారత్లో పరీక్షించాల్సిన అవసరం లేదు’’ అని వీజీ సోమాని ఈ నోటీసులో పేర్కొన్నారు.
ఫైజర్, మోడెర్నాల కోసమేనా?
అమెరికాకు చెందిన ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లకు మార్గం సుగమం చేయడానికే డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసిందన్న ప్రచారం జరుగుతోంది. భారత్కు వ్యాక్సిన్లు అందించాలంటే తమకు ఇండెమ్నిటీ (ఏదైనా ప్రతికూల ప్రభావం ఏర్పడితే నష్టపరిహారం కోరడం), అనుమతుల అనంతరం బ్రిడ్జింగ్ ట్రయల్స్ నిర్వహించాలన్న నిబంధన నుంచి మినహాయింపునివ్వాలని ఆ సంస్థలు గతంలో ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై ఇప్పటివరకూ భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రస్తుతం నిబంధనల మినహాయింపు ఇచ్చిన తీరును బట్టి ఆ దిశగా అడుగులేస్తోందన్న అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?