భో‘జన ఘోష’!
ఆదర్శ పాఠశాలల్లోని బాలికల వసతి గృహాలకు బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో విద్యార్థులకు భోజనం అందించలేక ప్రిన్సిపాళ్లు చేతులెత్తేసున్నారు. వసతి గృహంలో ఉన్న పిల్లల్ని ఇళ్లకు
ఆదర్శ పాఠశాలల వసతి గృహాల్లో బిల్లుల పెండింగ్
సరకుల సరఫరా నిలిపివేస్తున్న గుత్తేదార్లు
భోజనం అందించలేక ఇబ్బందులు
సొంత డబ్బుతో పెట్టిన ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటు!
వసతి గృహం నుంచి వెళ్లిపోతున్న బాలికలు
ఈనాడు, అమరావతి: ఆదర్శ పాఠశాలల్లోని బాలికల వసతి గృహాలకు బిల్లుల చెల్లింపు నిలిచిపోవడంతో విద్యార్థులకు భోజనం అందించలేక ప్రిన్సిపాళ్లు చేతులెత్తేసున్నారు. వసతి గృహంలో ఉన్న పిల్లల్ని ఇళ్లకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు గుత్తేదార్లకు చెల్లించాల్సిన బిల్లులు పెండింగ్లో ఉండడంతో చాలాచోట్ల సరకుల సరఫరా నిలిపివేశారు. ఈ పరిస్థితుల్లో పిల్లలకు భోజనం అందించడం కష్టంగా ఉందంటూ ఈనెల 3న జిల్లా విద్యాధికారి, ఉన్నతాధికారులకు కడప జిల్లా ఖాజీపేట ప్రిన్సిపాల్ సమాచారం ఇచ్చారు. దీనిపై అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో సోమవారం రాత్రి నుంచి భోజనం అందించలేమని, పిల్లల్ని ఇళ్లకు వెళ్లిపోవాలని సూచించారు. ఆరు నెలలుగా రూ.6 లక్షల వరకు బకాయిలు చెల్లించలేదని, గుత్తేదారు నిత్యావసర సరకులు పంపిణీ చేయలేదని, దీంతో వసతి గృహం మూసివేయాల్సి వచ్చిందని ప్రిన్సిపల్ సురేష్ తెలిపారు. పిల్లల భోజనానికి ఆయన ఇప్పటి వరకు రూ.80వేలు సొంత డబ్బును సైతం ఖర్చు చేశారు.
ఖాజీపేటలోని ఆదర్శ వసతి గృహం
ఈ విషయంపై ‘ఈటీవీ’లో కథనం రావడంతో స్పందించిన అధికారులు మంగళవారం రాత్రి అందుబాటులో ఉన్న 30 మంది విద్యార్థినులకు భోజనం అందించారు. బుధవారం నుంచి మిగిలిన పిల్లలూ వస్తారని చెప్పారు. అందరికీ భోజనం అందించాలని ప్రిన్సిపాల్ను వారు ఆదేశించారు. మరోవైపు వసతి గృహాన్ని మంగళవారం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఖాజీపేట ఎంపీపీ అబుబుకార్ సిద్ధిక్, వైకాపా నాయకులతో కలిసి తనిఖీ చేసి బాలికలతో మాట్లాడారు. ప్రిన్సిపల్పై అనేక ఆరోపణలున్నాయని ఫోన్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే డిమాండు చేశారు. దీంతో ప్రిన్సిపల్ ఎం.సురేష్బాబును సస్పెండ్ చేస్తూ మంగళవారం ఆర్జేడీ ఎం.వెంకటకృష్ణారెడ్డి ఉత్తర్వులిచ్చారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై చట్టబద్ధమైన చర్యల్లో భాగంగా సస్పెండు చేసినట్లు చెప్పారు. విద్యార్థులకు భోజన వసతి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, మెనూ ప్రకారం భోజనాలు అందించకపోవడం, నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో సస్పెండు చేసినట్లు ఆర్జేడీ తెలిపారు. ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా అదే పాఠశాలలో పనిచేస్తున్న ఎకనమిక్స్ అధ్యాపకురాలు డి.విజయభారతిని నియమించారు. సొంతంగా ఖర్చు పెట్టి, ఇక భరించలేక పిల్లలకు భోజనం పెట్టలేనని ఇళ్లకు పంపిస్తే ఆ ప్రిన్సిపాల్ను సస్పెండు చేయడం ఏమిటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతూ మరోపక్క మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెట్టలేదని సస్పెండు చేయడం ఎంతవరకు సబబు అన్న ప్రశ్న వినిపిస్తోంది.
బాలికలతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
ఇదీ పరిస్థితి..
రాష్ట్ర వ్యాప్తంగా 164 ఆదర్శ పాఠశాలలుండగా.. వీటికి అనుబంధంగా 145 బాలికల వసతి గృహాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 10వేల మంది విద్యార్థినులు ఉంటున్నారు. 9 నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదివేవారు ఇక్కడ వసతి పొందుతున్నారు. ఒక్కో విద్యార్థినికి మెస్ ఛార్జీల కింద నెలకు రూ.1,500 చొప్పున చెల్లిస్తారు. గత విద్యా సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెల బిల్లును ప్రభుత్వం చెల్లించలేదు. ఇది పెండింగ్లో ఉండగానే సెప్టెంబరు నుంచి మళ్లీ వసతి గృహాలను పునఃప్రారంభించారు. ఒక పక్క ధరలు పెరగడం, మరోపక్క బిల్లులు పెండింగ్లో ఉండడంతో పెట్టుబడి పెట్టలేక గుత్తేదారులు సరకుల సరఫరా నిలిపివేస్తున్నారు. కొన్నిచోట్ల అరకొరగా సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రిన్సిపాళ్లు సొంత డబ్బులతోనో..అప్పులు చేసో పిల్లలకు మెనూ ప్రకారం భోజనం పెట్టాల్సి వస్తోంది. ఈ అప్పుల బాధలు భరించలేక కడప జిల్లా వల్లూరు ఆదర్శ పాఠశాలలో వసతి గృహాన్ని ఇప్పటి వరకు తెరవలేదు. పిల్లల భోజనాల కోసం ఈ ప్రిన్సిపల్ గత ఏడాది సుమారు రూ.2.40లక్షలు ఖర్చు చేశారు. ఈ బిల్లుల డబ్బు గుత్తేదారు ఖాతాలో పడగా.. ఆయన ప్రిన్సిపాల్కు ఇవ్వలేదు.
నిర్వహణ ఖర్చులు లేవు..
వసతి గృహాల్లో మరుగుదొడ్లు, గదుల శుభ్రత, తాగునీటి బోర్ల మరమ్మతులు, ఇతరాత్ర ఖర్చులకు ప్రభుత్వం ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. నిర్వహణకు నిధులు ఇవ్వాలని ప్రిన్సిపాళ్లు ఇటీవల ఉన్నతాధికారులను కోరినా దీన్ని వారు పట్టించుకోలేదు. దీంతో నిర్వహణ కోసమూ ప్రిన్సిపాళ్లు జేబుల నుంచే డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది.
గుత్తేదారుకు బిల్లులు చెల్లించక.. బాలింతలకు ఆకలి చింత
ఆదోని ఆసుపత్రిలో భోజనం సరఫరా నిలిపివేత
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలు
ఆదోని పురపాలికం, న్యూస్టుడే: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో భోజనం సరఫరాను మంగళవారం నిలిపివేశారు. నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశారు. సుమారు రూ.10 లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. భోజనం పెట్టరని ముందుగా తెలియక బాలింతలు ఎంతో ఇబ్బందిపడ్డారు. 50 మంది వరకు హోటళ్ల నుంచి తెప్పించుకొని తిన్నారు. మూడు పూటలా భోజనాలకు ఒక్కొక్కరికీ రూ.300 ఖర్చయిందని, దూర ప్రాంతాల నుంచి వచ్చామని, తమను ఎవరూ పట్టించుకోలేదని ఉరుకుంద గ్రామానికి చెందిన ఉష వాపోయారు. సమస్యను ఆసుపత్రి పర్యవేక్షకురాలు మాధవీలత దృష్టికి తీసుకెళ్లగా భోజనం సరఫరా నిలిపివేస్తున్నట్లు గుత్తేదారు ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఆదోని ఆసుపత్రిలో 50 పడకలున్నాయి. నిత్యం 10 నుంచి 15 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. ఇక్కడే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల కేంద్రమూ ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?