Service Sector: తిరోగమనంలో సేవల రంగం
ఆంధ్రప్రదేశ్లో సేవల రంగం వృద్ధిరేటు భారీగా పడిపోయింది. గత మూడేళ్లుగా ఇది తిరోగమనంలో సాగుతోంది. 2018-19లో 8.24%, 2019-20లో 6.20%గా నమోదైన ఈ రంగం వార్షిక వృద్ధిరేటు 2020-21లో మైనస్ 6.71%కి పడిపోయినట్లు సోమవారం కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే వెల్లడించింది.
విశాఖ పోర్టు నుంచి సరకు రవాణాకు దేశంలోనే అత్యధిక సమయం
కుటుంబాల్లో తగ్గుతున్న పారిశుద్ధ్య వాతావరణం
ఆర్థిక సర్వేలో వెల్లడి
ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్లో సేవల రంగం వృద్ధిరేటు భారీగా పడిపోయింది. గత మూడేళ్లుగా ఇది తిరోగమనంలో సాగుతోంది. 2018-19లో 8.24%, 2019-20లో 6.20%గా నమోదైన ఈ రంగం వార్షిక వృద్ధిరేటు 2020-21లో మైనస్ 6.71%కి పడిపోయినట్లు సోమవారం కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్థికసర్వే వెల్లడించింది. రాష్ట్ర స్థూల అదనపు విలువలో ఈ రంగం వాటా 2018-19లో 42.25% ఉండగా, 2019-20లో అది 41.86%, 2020-21లో 41.64%కి పడిపోయింది. తెలంగాణలోనూ సేవల రంగం వృద్ధిరేటు మూడేళ్లుగా క్రమంగా తగ్గుతోంది. 2018-19లో 7.91% ఉన్న ఈ వృద్ధిరేటు 2019-20లో 5.69 శాతానికి చేరింది. 2020-21లో అది ఏకంగా మైనస్ 3.94 శాతానికి పడిపోయింది.
* ఆంధ్రప్రదేశ్లో మెరుగైన పారిశుద్ధ్య వాతావరణంలో జీవించే వారి సంఖ్య తగ్గిపోయింది. చక్కటి పారిశుద్ధ్య వసతులున్న ఇళ్లలో నివసించే జనసంఖ్య 2015-16 ఆరోగ్య సర్వే-4 ప్రకారం 77.3% ఉండగా 2019-21 ఆరోగ్య సర్వే-5 నాటికి 54.4%కి పడిపోయింది. వంట కోసం శుద్ధ ఇంధనం వాడే కుటుంబాల సంఖ్య ఇదివరకు 83.6% ఉండగా, తాజాగా 62%కి పడిపోయింది.
* ఏపీలో శిశుమరణాలు 34.9 నుంచి 30.3కి తగ్గిపోయాయి. అయిదేళ్లలోపు పిల్లల మరణాలు ఇదే సమయంలో 40.8 నుంచి 35.2కి తగ్గాయి. పొత్తిళ్లలోని పిల్లల (1 నుంచి 28 రోజుల్లోపు వయస్సున్న పిల్లలు) మరణాలు మాత్రం 19.9 నుంచి 23.6కి పెరిగాయి.
* ఆరోగ్య సర్వే 4-5ల మధ్యకాలంలో ఏపీలో సంతానసాఫల్య రేటు (ప్రతి మహిళకు జన్మించే పిల్లల సంఖ్య) 1.8 నుంచి 1.7కి తగ్గిపోయింది. లింగనిష్పత్తి 914 నుంచి 934కి పెరిగింది.
* విశాఖ పోర్టులో సరకు రవాణాకు వెచ్చించే రోజులు దేశంలోనే అత్యధికంగా ఉంది. ఇక్కడ ఒక్కో నౌక టర్న్ అరౌండ్ (సరకు లోడింగ్, అన్లోడింగ్)కు సగటున 3.15 రోజులు పడుతోంది. కోల్కతా, మర్మగోవా, వైజాగ్ పోర్టులు తప్ప దేశంలోని మిగిలిన అన్ని పోర్టుల్లో అత్యధిక సరకు రవాణా ట్రాఫిక్ నమోదైంది.
* 2022-25 మధ్యకాలంలో విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలను ప్రైవేటీకరణ(మానిటైజ్) చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.
* లక్ష హెక్టార్లలో ప్రకృతి సేద్యంతో ఆంధ్రప్రదేశ్ దేశంలో తొలిస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కేరళ, ఒడిశా, హిమాచల్ప్రదేశ్, ఝార్ఖండ్, తమిళనాడు ఉన్నాయి.
* నీతిఆయోగ్ విడుదల చేసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచి 2020-21లో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో నిలిచింది. దేశంలోని కోస్తా రాష్ట్రాలపరంగా చూస్తే ఒడిశా తర్వాతి స్థానాన్ని ఏపీ దక్కించుకొంది.
* ఆంధ్రప్రదేశ్, బిహార్లలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు డిమాండ్ కొన్ని నెలలుగా కొవిడ్ ముందుకాలం నాటి కంటే తగ్గిపోయింది. బయటి ప్రాంతాల నుంచి సొంత రాష్ట్రాలకు కార్మికులు వలస వచ్చినచోట పెరిగితే, సొంతరాష్ట్రాల నుంచి బయటి రాష్ట్రాలకు కార్మికులు వలస వెళ్లినచోట డిమాండ్ తగ్గింది.
* కేంద్రం ప్రారంభించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద 2020-21లో దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఏపీకి అత్యధికంగా రూ.17 కోట్లు విడుదలయ్యాయి. 2019-20లో కేవలం రూ.6 కోట్లు రాగా... 2020-21లో అది 183% పెరిగింది. రాష్ట్రఃలో రూ.13 కోట్లతో నేషనల్ అడాప్టేషన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద వివిధ ప్రాజెక్టులు అమలవుతున్నాయి.
* ఆంధ్రప్రదేశ్లో పొగాకు రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే ప్రయత్నం జరుగుతోంది.
* కేంద్రం 2019-20 నుంచి ప్రజాపంపిణీ వ్యవస్థ కింద పంపిణీ చేసే బియ్యం ఫోర్టిఫికేషన్ పైలెట్ స్కీంను దేశంలోని ఏపీతో సహా 15 రాష్ట్రాల్లోని ఒక్కో జిల్లాలో ప్రారంభించింది.
* వామపక్ష తీవ్రవాదానికి తీవ్రంగా ప్రభావితమైన ఆంధ్రప్రదేశ్తో సహా 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో రహదారి అనుసంధానత మెరుగుపరిచారు.
* అటల్ పెన్షన్ యోజన కింద ఆంధ్రప్రదేశ్లో 20.5 లక్షల ఖాతాలు ఉన్నాయి.
* టమోటా రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో అత్యధిక వర్షాలు కురవడమే.
* జీఎస్టీ కింద ఆంధ్రప్రదేశ్కు 2021 నవంబరు వరకు రూ.21,015 కోట్లు వచ్చాయి.
మైనస్లో నికర ఉత్పత్తి వృద్ధిరేటు
ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగిన తొలి ఆరేళ్లలో ఆంధ్రప్రదేశ్ రెండంకెల మేర నమోదైన రాష్ట్ర నికర ఉత్పత్తి వృద్ధిరేటు 2020-21లో ఏకంగా 1.6%కి పడిపోయింది. 2011-22 సిరీస్ను అనుసరించి తాజా ధరల ప్రకారం ఏపీ నికర ఉత్పత్తి వృద్ధిరేటు... 2014-15లో 14%, 2015-16లో 15.7%, 2016-17లో 12.4%, 2017-18లో 15.3%, 2018-19లో 10.8%, 2019-20లో 11.3% నమోదుకాగా 2020-21లో మాత్రం 1.6%కి పడిపోయింది. రాష్ట్ర నికర ఉత్పత్తి విలువ 2019-20లో రూ.8,70,064 కోట్లుగా నమోదుకాగా, 2020-21లో రూ.8,84,199 కోట్లకు, తలసరి నికర ఉత్పత్తి విలువ రూ.1,68,480 నుంచి రూ.1,70,215కి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!