Indian Railway: రాష్ట్ర వాటాతో ముడి.. రైలు ప్రాజెక్టు కదలదండి!
రైల్వే బడ్జెట్లో మన రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగింది. కొత్త లైన్లకు నిధుల కేటాయింపులో కేంద్రం మొండిచేయి చూపింది. ఇప్పటికే తమ వాటా చాలా వెచ్చించామని, ఇప్పుడు...
22 ఏళ్లుగా కొనసాగుతున్న కోటిపల్లి-నర్సాపురం కొత్త లైన్
కడప-బెంగళూరు కొత్త లైన్లో 14 ఏళ్లలో 21 కి.మీ. పూర్తి
ఏడు కొత్త లైన్లు ఇంకా మొదలే కాలేదు
భూసేకరణ, రాష్ట్ర వాటా ఇవ్వడంలో నిర్లక్ష్యం
ఈనాడు, అమరావతి: రైల్వే బడ్జెట్లో మన రాష్ట్రానికి మరోసారి అన్యాయం జరిగింది. కొత్త లైన్లకు నిధుల కేటాయింపులో కేంద్రం మొండిచేయి చూపింది. ఇప్పటికే తమ వాటా చాలా వెచ్చించామని, ఇప్పుడు రాష్ట్ర వాటా కింద వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిధులిస్తేనే పనులు చేస్తామని చెప్పకనే చెప్పింది. కొన్నేళ్లుగా వివిధ రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రం రూపాయి ఇవ్వడం లేదు. దీంతో ఆయా కొత్త లైన్లలో ఈసారి పనులు జరిగే దాఖలాలు లేవు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించి మూడేళ్లవుతోంది. దీనికి రూ.273 కోట్లు అవసరమని అధికారులు డీపీఆర్ సిద్ధం చేసి రైల్వే బోర్డుకు పంపారు. ఈ నిధుల మంజూరుతోపాటు ఫలానా తేదీ నుంచి కొత్త జోన్ అమల్లోకి వస్తుందని ప్రకటించాల్సి ఉంది. అయితే డీపీఆర్ రైల్వే బోర్డు పరిశీలనలోనే ఉందని అధికారులు చెబుతున్నారు. గత బడ్జెట్లో రూ.40 లక్షలు, ఈసారి కూడా రూ.40 లక్షలు మాత్రమే దీనికి కేటాయించారు.
భూసేకరణ చేయరు.. నిధులివ్వరు
* కోటిపల్లి-నర్సాపురం కొత్త లైన్ ప్రాజెక్టులో 25శాతం వాటా వెచ్చించడంతోపాటు 206 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. ఈ పనులు కాకపోవడంతో రెండు దశాబ్దాల కిందట మొదలైన లైను పూర్తయ్యేందుకు ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందనేది ప్రశ్నార్థకమే.
* నడికుడి-శ్రీకాళహస్తి ప్రాజెక్టులో 50శాతం వాటాతోపాటు 991 హెక్టార్ల రెవెన్యూ భూమి, 119 హెక్టార్ల అటవీ భూమి సేకరించి రైల్వేశాఖకు అప్పగించడంలో జాప్యం వల్ల పనులు ఆగిపోయాయి. ఇలాగైతే ఈ లైన్ పూర్తయ్యేందుకు మరో దశాబ్దంపట్టినా ఆశ్చర్యపోవాల్సింది లేదు.
* కడప-బెంగళూరు కొత్త లైన్ ప్రాజెక్టులోని 50 శాతం నిధులు, 1,084 హెక్టార్ల రెవెన్యూ భూమి, 56 హెక్టార్ల అటవీ భూమి సేకరించి ఇవ్వకపోవడంతో పనులు నిలిపేశారు. కడప-పెండ్లిమర్రి మధ్య 21కి.మీ.జరిగిన పనులు తర్వాత అడుగు ముందుకు పడలేదు. నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉన్నందున ఈ ప్రాజెక్టు బదులు ముద్దనూరు నుంచి ముదిగుబ్బ వరకు కొత్త లైన్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
* అనంతపురం జిల్లా రాయదుర్గంనుంచి కళ్యాణదుర్గం మీదుగా కర్ణాటకలోని తుముకూరు వరకు 207 కి.మీ. కొత్త లైన్లో రాయదుర్గంనుంచి కదిరి దేవరపల్లి వరకు 63 కి.మీ.పూర్తయింది. ఇందులో మన రాష్ట్ర పరిధిలోని ఇంకా 34 హెక్టార్ల భూసేకరణ, రూ.39 కోట్లు వాటా ఇవ్వకపోవడంతో పనులు జరగడం లేదు. కర్ణాటకలో కూడా భూసేకరణలో జాప్యం వల్ల లైన్ పూర్తయ్యేందుకు చాలాకాలం పట్టే అవకాశాలున్నాయి.
* పైన పేర్కొన్న నాలుగు ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా వెచ్చించే పరిస్థితి లేదని, నిధులన్నీ రైల్వేశాఖ భరించాలని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది లేఖ రాసినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇప్పటివరకు రైల్వేశాఖ నుంచి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.
ఈ పనులు సాగుతున్నాయ్..
* విజయవాడ-గుడివాడ-భీమవరం-నర్సాపురం, గుడివాడ-మచిలీపట్నం, భీమవరం-నిడదవోలు రెండో లైను, విద్యుదీకరణ వ్యయంలో 50శాతం రాష్ట్రవాటాగా ఇవ్వాల్సి ఉంది. అయితే రైల్వేశాఖ మాత్రం ప్రాధాన్య ప్రాజెక్టుల కింద ఈ పనులు వేగంగా చేస్తోంది. ఇప్పటికే 144 కి.మీ.పనులు పూర్తయ్యాయి.
కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడయ్యేనో..?
ఎనిమిదేళ్ల కిందట కిందట రైల్వేశాఖ సహాయమంత్రిగా కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి ఉన్నప్పుడు కర్నూలుకు వ్యాగన్ల మరమ్మతు పరిశ్రమ మంజూరైంది. అది పూర్తి కాలేదు. పరిశ్రమకు అనుసంధానించేలా రైల్వేట్రాక్ పనులు చేస్తున్నారు. దీని మొత్తం అంచనా వ్యయం రూ.560 కోట్లుకాగా.. గతేడాది మార్చి చివరినాటికి రూ.106 కోట్లు వెచ్చించారు. ఈసారి బడ్జెట్లో రూ.58 కోట్లు కేటాయించారు. పరిశ్రమ సిద్ధమయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!