Agnipath Protest: ఇప్పుడు కాకపోతే.. మరెప్పుడూ జవాన్లు కాలేరని!
‘‘కరోనా కారణంగా రెండేళ్లుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేదు. ఒకవేళ ‘అగ్నిపథ్’ పరీక్షలో ఫెయిలైతే వయసుపరిమితి దాటిపోయి మరోసారి రాసేందుకు
రెచ్చగొట్టిన డిఫెన్స్ అకాడమీల ప్రతినిధులు
బిహార్, రాజస్థాన్లోలా రైళ్లను దహనం చేద్దామనుకున్నారు
సికింద్రాబాద్ స్టేషన్లో విధ్వంసం సృష్టించిన యువకుల ప్రణాళిక
ఏ1గా కామారెడ్డి జిల్లాకు చెందిన మధుసూదన్
ఈనాడు-హైదరాబాద్, న్యూస్టుడే-రెజిమెంటల్ బజార్, గాంధీఆసుపత్రి: ‘‘కరోనా కారణంగా రెండేళ్లుగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం నిర్వహించలేదు. ఒకవేళ ‘అగ్నిపథ్’ పరీక్షలో ఫెయిలైతే వయసుపరిమితి దాటిపోయి మరోసారి రాసేందుకు అవకాశం ఉండదు. ఇప్పుడు కాకపోతే.. మరెప్పుడూ జవాన్లు కాలేం. అందుకే బిహార్, రాజస్థాన్లలో చేసినట్టు రైళ్లను దహనం చేద్దామని అనుకున్నాం’’ అని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం సృష్టించిన నిందితుల్లో కొందరు రైల్వే పోలీసులతో చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము దాకా కస్టడీలో ఉన్న నిందితులను పోలీసులు ప్రశ్నించారు. వీరు తెలిపిన వివరాలను రిమాండ్ రిపోర్టులో పోలీసులు పొందుపరిచి న్యాయస్థానంలో సమర్పించారు.
ఎక్కువ మంది 20 ఏళ్లు దాటినవారే..
రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో మొత్తం 56 మంది నిందితులు ఉండగా.. వీరిలో 51 మంది 20 ఏళ్లు దాటినవారే. కేసులో ఏ2గా ఉన్న పృథ్వీరాజ్ వయస్సు 23 సంవత్సరాలు. ప్రవేశ పరీక్షకు అర్హత సాధించిన 2వేల మందిలో 20 ఏళ్లు దాటినవారంతా అగ్నిపథ్ను అడ్డుకోవాలనుకున్నారు. వీరికి కొన్ని డిఫెన్స్ అకాడమీలు సహకరించడంతో పాటు విధ్వంసం సృష్టించేలా రెచ్చగొట్టాయని రైల్వే పోలీసులు తెలిపారు. ఇందుకు ఎనిమిది వాట్సప్ గ్రూప్లను ఏర్పాటు చేశాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అకాడమీల కార్యాచరణ
వరంగల్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఉన్న డిఫెన్స్ అకాడమీల ప్రతినిధులు క్రియాశీలకంగా వ్యవహరించారు. బుధవారం రాత్రి కార్యాచరణ మొదలుపెట్టారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల వారు ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ జిల్లాలకు చెందినవారికి హైదరాబాద్కు రావాలంటూ వాట్సప్ సందేశాలు పంపించారు. ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల వారు మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో ఉంటున్నవారిని హైదరాబాద్కు తరలించారు. సికింద్రాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు రైల్వేస్టేషన్లలో విధ్వంసం సృష్టించాలని.. నాలుగైదు రోజులపాటు బయటే ఉండేలా ఏర్పాట్లు చేసుకుని రావాలని చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల వారి బాగోగులను ఇద్దరు డిఫెన్స్ అకాడమీ ప్రతినిధులు చూసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,500 మంది యువకులకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో వసతి కల్పించారు.
రైల్వే పోలీసుల అదుపులో గాంధీ క్షతగాత్రులు
పోలీసు కాల్పులు, ఘర్షణలో గాయపడిన తొమ్మిది మంది నిందితులు మల్లికార్జున్, రంజిత్, శ్రీకాంత్, పరశురాం, కుమార్, మోహన్, భరత్కుమార్, విద్యాసాగర్, లక్ష్మణ్రెడ్డిలను రైల్వే పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారిని గాంధీ ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్ఛార్జి చేయడంతో నేరుగా రైల్వే పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. మంగళవారం రైల్వే జడ్జి ఎదుట హాజరుపరిచే అవకాశాలున్నాయి. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నవారిని పీటీ వారెంట్ ద్వారా విచారించనున్నారు. రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసు హైదరాబాద్ పోలీసులకు ఇంకా బదిలీ కాలేదు. మరోవైపు బస్సులపై రాళ్లు వేసి అద్దాలు పగులగొట్టిన కేసులో గోపాలపురం పోలీసులు 19 మందిపై కేసు నమోదు చేశారు.
నిందితుల్లో కానిస్టేబుల్ శిక్షణ అభ్యర్థులు..
విధ్వంసం కేసులో కామారెడ్డి జిల్లాకు చెందిన మధుసూదన్ ప్రధాన నిందితుడని(ఏ1) కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్డులో రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ఇతడు క్రీడల్లో శిక్షణ పొందుతున్నాడని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా సోనాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ పృథ్వీరాజ్ను ఏ-2గా పేర్కొన్నారు. 56 మంది నిందితుల్లో మహబూబ్నగర్, జగిత్యాల జిల్లాలకు చెందిన ఇద్దరు హైదరాబాద్లో కానిస్టేబుల్ పరీక్షకు శిక్షణ పొందుతున్నారు. మరో ఇద్దరు బీటెక్ చివరి సంవత్సరం చదువుతుండగా, ముగ్గురు రైతు కూలీలుగా పనిచేస్తున్నారు. ఒక యువకుడు ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. మిగిలినవారు కళాశాలల విద్యార్థులు.
ఆవుల సుబ్బారావు పాత్రపై ఆరా
ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తున్న ఆవుల సుబ్బారావు పాత్రపై రైల్వే పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. విధ్వంసం గురించి అతను ఎవరితోనైనా మాట్లాడాడా? అన్న కోణంలో పరిశోధిస్తున్నారు. జూన్ 16న 1,500 మంది యువకులు మల్కాజిగిరి, నేరేడ్మెట్, ఏఎస్రావునగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారని సెల్ఫోన్ సిగ్నళ్ల ద్వారా ఆధారాలు లభించాయి. వీరికి వసతి, భోజనం తదితర సౌకర్యాలు సుబ్బారావే కల్పించాడని పోలీస్ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారు.
సాయి డిఫెన్స్ అకాడమీలో ఐటీ సోదాలు
ఈనాడు-అమరావతి: నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీలో సోమవారం ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాజాగా సుబ్బారావు ఇల్లు, కోచింగ్ సెంటర్, పల్నాడు రోడ్లో ఆయనకు చెందిన ఓ లాడ్జీలో ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు జరిపారు. ఆ సమయంలో సుబ్బారావు అధికారులకు అందుబాటులోనే ఉన్నారని తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM