ప్రగతి పథంలో... ప్రజా రథం
దుర్గమమైన మార్గాల్లో మైళ్లకు మైళ్ల దూరం కాలినడక.. కాస్త స్థితిమంతులైతే అశ్వాలు, మనుషులు మోసే పల్లకీలలో సవారీ.. కొన్నాళ్లకు మట్టి బాటలపై ఎడ్లబళ్లు.. గుర్రపు బళ్లు.. మనుషులు లాగే రిక్షాలు.. ఇలా సాగిన భారతీయుల
ఆధునికీకరణ దిశలో రోడ్డు, రైలు మార్గాలు
అవకాశాలు సృష్టిస్తున్న విమానయానం
ఆశలు రేపుతున్న నౌకా రవాణా
వేగంగా విస్తరిస్తున్న రవాణా రంగం
దుర్గమమైన మార్గాల్లో మైళ్లకు మైళ్ల దూరం కాలినడక.. కాస్త స్థితిమంతులైతే అశ్వాలు, మనుషులు మోసే పల్లకీలలో సవారీ.. కొన్నాళ్లకు మట్టి బాటలపై ఎడ్లబళ్లు.. గుర్రపు బళ్లు.. మనుషులు లాగే రిక్షాలు.. ఇలా సాగిన భారతీయుల ప్రయాణం ఆధునిక కాలంలో అనేక విధాలుగా రూపాంతరం చెందింది. బస్సులు, రైళ్లు, ఆటోలు, ట్యాక్సీలు అందుబాటులోకి వచ్చాయి. స్వాతంత్య్రం వచ్చాక కూడా దశాబ్దాలపాటు ఇరుకు మార్గాలు, గతుకుల రహదారులపై పడుతూ లేస్తూ కొనసాగిన మన పయనం.. ఇప్పుడు విశాలమైన, నున్నని రోడ్లపై వేగంగా పరుగులు తీస్తోంది.
బ్రిటిష్ పాలకులు వారి వ్యాపార, పరిపాలన, వినోద అవసరాల మేరకు మాత్రమే రవాణా వసతుల్ని అభివృద్ధి చేశారు. స్వాతంత్య్రం వచ్చాక కూడా... కొన్నేళ్లపాటు చాలా గ్రామాలకు మెరుగైన రవాణా వ్యవస్థ లేదు. క్రమంగా ఈ పరిస్థితి మారింది. ఆర్థిక సరళీకరణ, ప్రభుత్వ నియంత్రణల సడలింపు, ప్రైవేటు భాగస్వామ్యంతో రవాణా వసతులు వేగంగా మెరుగుపడ్డాయి. జాతీయ రహదారుల్లో చాలా వరకు నాలుగు, ఆరు, ఎనిమిది వరుసలుగా రూపుదిద్దుకున్నాయి. ఎక్స్ప్రెస్ హైవేలు వచ్చాయి. రైలు మార్గాల ఆధునికీకరణ సాధ్యమైంది. రైళ్ల సంఖ్య, వేగం పెరిగాయి. ప్రైవేటు రంగంలో విమానాశ్రయాలు ఏర్పడ్డాయి. మెట్రో రైళ్లు వచ్చాయి. ఇలా 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎంతో సాధించాం. ప్రగతిశీల ప్రపంచంలో మనం ఇంకా సాధించాల్సిన లక్ష్యాలేమిటి? అందుకు మన ముందున్న సానుకూలతలు ఏమిటి?
మెరుగైన రహదారులే దన్ను
దేశంలో 65% సరకు రవాణా, 80% ప్రజా రవాణా రోడ్డు మార్గాల్లోనే జరుగుతోంది. గత మూడు దశాబ్దాల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త రహదారుల నిర్మాణం, పాతవాటి ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. దేశంలోని ప్రధాన నగరాలను, రాష్ట్రాల రాజధానులను, పారిశ్రామిక ప్రాంతాలను, నౌకాశ్రయాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన రహదారులతో సరకు, ప్రజా రవాణా సులభతరమైంది. వాజ్పేయీ ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్మాణానికి ప్రైవేటు పెట్టుబడుల్ని ప్రోత్సహించడం ప్రారంభించాక వాటి స్వరూపం మారింది.
* జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎన్హెచ్డీపీ), స్వర్ణ చతుర్భుజి, భారత్మాల పరియోజన ప్రాజెక్టుల కింద పెద్ద ఎత్తున రహదారుల అభివృద్ధి, విస్తరణ కార్యక్రమాలు చేపట్టారు. ఇలా 2020 డిసెంబరు నాటికి మొత్తం 43,174 కి.మీ. రహదారుల నిర్మాణం, విస్తరణ సాకారమైంది.
* భారత్మాల పరియోజన మొదటి దశ కింద రూ.1.63 లక్షల కోట్లతో 2,485 కి.మీ. పొడవైన కొత్త ఎక్స్ప్రెస్వేల నిర్మాణం, రూ.1.97 లక్షల కోట్లతో 5,924 కి.మీ. పొడవైన గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్వేల నిర్మాణం మొదలైంది.
భారతీయ రైల్వే... ప్రగతికి మార్గం
ఇప్పటికీ సామాన్యులకు అందుబాటులో, తక్కువ ధరలో రవాణా సదుపాయం కల్పిస్తున్నది భారతీయ రైల్వేనే.
* 2021 మార్చి నాటికి దేశంలో 7,337 రైల్వే స్టేషన్లున్నాయి. భారతీయ రైల్వే ఏటా 810 కోట్ల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేరుస్తోంది.
* దేశంలో మొదటి రైల్వే లైన్ల నిర్మాణం ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రారంభించింది. 1853 ఏప్రిల్ 16న తొలి ప్రయాణికుల రైలు బొంబాయిలోని బోరిబందర్ నుంచి ఠాణె వరకు 34 కి.మీ. నడిచింది. భారతీయ రైల్వే చట్టాన్ని 1890లో అమల్లోకి తెచ్చారు. కాలక్రమంలో కంప్యూటర్ రిజర్వేషన్ విధానం, తత్కాల్ వంటివి ప్రారంభమయ్యాయి.
పౌర విమానయాన రంగానికి రెక్కలు
కేంద్రం ప్రవేశపెట్టిన ఉడాన్ వంటి కార్యక్రమాలు విమానయాన రంగం వృద్ధికి కొంత దోహదం చేస్తున్నాయి.
* దేశ జీడీపీలో వియానయాన రంగం వాటా 5%. ఈ రంగం 40 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.
ఉత్తరాల రవాణాతో మొదలు
* భారత్లో మొదటి వాణిజ్య విమానం 1911 ఫిబ్రవరి 18న అలహాబాద్లోని ఒక పోలో గ్రౌండ్ నుంచి ఉత్తరాలు తీసుకుని యమునా నదిని దాటి 9.7 కి.మీ.లు ప్రయాణించి నైనిలో వాలింది. ప్రపంచంలో మొదటి అధికారిక ఎయిర్ మెయిల్ సర్వీస్గా ఆ ప్రయాణం రికార్డులకెక్కింది.
* భారత్లో మొదట విమానాశ్రయాల నిర్మాణం 1924లో మొదలైంది. 1953 మార్చిలో భారత పార్లమెంట్ ఎయిర్ కార్పొరేషన్స్ చట్టాన్ని తీసుకొచ్చింది. విమానయాన పరిశ్రమను జాతీయీకరించింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశీయ విమానయాన సర్వీసుల కోసం ఇండియన్ ఎయిర్లైన్స్, అంతర్జాతీయ సర్వీసుల కోసం ఎయిర్ ఇండియాలను ఏర్పాటు చేసింది.
దేశంలో మనుగడలో ఉన్న మొత్తం విమానాశ్రయాలు: 137
వాటిలో అంతర్జాతీయ విమానాశ్రయాలు: 24
దేశీయ విమానాశ్రయాలు: 103
కస్టమ్స్ విమానాశ్రయాలు: 10
వాణిజ్యానికి ఊతగర్ర.. ఓడరేవులు
క్రీస్తు పూర్వం నుంచీ భారతదేశ వాణిజ్యానికి జీవగర్రగా నిలిచింది నౌకాయానమే. దేశానికి 7,500 కి.మీ. సుదీర్ఘ సముద్రతీరం ఉండటం నౌకా వాణిజ్య విస్తృతికి దోహదం చేసింది. భారతీయ నౌకాశ్రయాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చెందాయి.
ప్రస్తుతం దేశంలో 13 పెద్ద ఓడరేవులు, సుమారు 200 చిన్న ఓడరేవులు ఉన్నాయి. భారతదేశ విదేశీ వాణిజ్యం అత్యధికంగా సముద్రమార్గంలోనే జరుగుతోంది. 2021 డిసెంబరు నాటికి దేశంలో 1,463 నౌకలు ఉన్నాయి. భారతదేశంలో ఉపరితల జలరవాణా అభివృద్ధికి అనుకూలమైన జలమార్గాలు 14,500 కి.మీ. మేర ఉన్నాయి.
ఆకాశంలో రైలు
ప్రధాన నగరాల్లో రద్దీని తట్టుకునేందుకు రోడ్డుకు అంతెత్తున పరుగెత్తే మెట్రో రైళ్లు ప్రజా రవాణాను సులభతరం చేస్తున్నాయి. దిల్లీ వంటి చోట్ల భూగర్భంలోనూ మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.
* 1984లో కలకత్తా మెట్రో... దేశంలోని తొలి ర్యాపిడ్ ట్రాన్సిట్ లైన్గా పేరుగాంచింది. ఆ ఏడాది తొలి మెట్రో రైలు నడిచింది. ప్రస్తుతం 15 నగరాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. 2024 లోపు మరో ఆరు నగరాల్లో వీటిని అందుబాటులోకి తీసుకొచ్చేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
చేయాల్సింది చాలా ఉంది
* రోడ్డు రవాణా రంగంలో అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడేందుకు భారత్ చేయాల్సింది చాలా ఉంది. జాతీయ రహదారుల విస్తరణ మరింత వేగం అందుకోవాలి. నాలుగు వరుసల రహదారుల్ని ఆరు, అంతకంటే ఎక్కువ వరుసల ఎక్స్ప్రెస్ వేలుగా విస్తరించాలి. అన్ని గ్రామాలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించాలి.
* 2024 నాటికి 26 గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేల నిర్మాణం పూర్తవుతుందని కేంద్రం ఇటీవల ప్రకటించింది. అవి పూర్తయితే... దిల్లీ నుంచి దేెహ్రాదూన్కు 2 గంటల్లో, హరిద్వార్ 2 గంటల్లో, జైపుర్ 2 గంటల్లో, చండీగఢ్ 2.5 గంటల్లో, అమృత్సర్ 4 గంటల్లో, శ్రీనగర్ 8 గంటల్లో, ముంబయి 12 గంటల్లో, చెన్నై నుంచి బెంగళూరుకు 2 గంటల్లో చేరుకోవచ్చు. ఇలాంటి అభివృద్ధి ప్రాజెక్టులు మరికొన్ని ప్రధాన నగరాలకూ అందుబాటులోకి తేవాలి.
* హైస్పీడ్ రైళ్ల పెంపుపై దృష్టి పెట్టాలి.
* దేశంలో సరకు రవాణాకు ప్రత్యేక ఫ్రైట్ రైలు కారిడార్ల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఇలాంటివి రెండు మాత్రమే ఉన్నాయి. కొత్తగా ప్రతిపాదించిన వాటిని వేగంగా పూర్తి చేయాలి.
హైస్పీడ్ రైల్ కారిడార్లు కావాలి
ముంబయి-అహ్మదాబాద్ల మధ్య 508 కి.మీ. హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు జరుగుతున్నాయి. దాన్ని 2028కి పూర్తిచేసి, బుల్లెట్ రైలు నడపాలని కేంద్రం భావిస్తోంది. నేషనల్ రైల్ ప్లాన్ కింద దిల్లీ-వారణాసి, నాగ్పుర్-ముంబయి, దిల్లీ-అహ్మదాబాద్, దిల్లీ-అమృత్సర్, హైదరాబాద్-ముంబయి, వారణాసి-హౌరా, చెన్నై-మైసూర్ హైస్పీడ్ కారిడార్ల ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇటీవలే కొత్తగా హైదరాబాద్-బెంగళూరు, నాగ్పూర్-వారణాసి, అమృత్సర్-జమ్ము, పట్నా-గౌహతి మధ్య కూడా హైస్పీడ్ రైల్ కారిడార్లు ప్రతిపాదించారు. వీటన్నిటినీ వీలైనంత వేగంగా పట్టాలెక్కించాలి.
* ఉడాన్ పథకం ప్రారంభించాక కొత్తగా 68 విమానాశ్రయాలు ఏర్పాటయ్యాయి. వీటి సంఖ్యను 100కి పెంచాలన్న లక్ష్యం నెరవేరితే మరికొన్ని వేల మందికి విమాన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
* దేశంలోని 31 ప్రధాన నగరాల్లో 2047 నాటికి రెండేసి విమానాశ్రయాలు ఉండాలన్న లక్ష్యమూ ఘనమైనదే.
* కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సాగర్మాల ప్రాజెక్టు దేశంలోని ఓడరేవుల ఆధునికీకరణ, కొత్త ఓడరేవుల నిర్మాణం, పోర్టులో అనుసంధానత పెంచడం, పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణకు దోహదం చేస్తోంది. 2035 నాటికి రూ.5.54 లక్షల కోట్లతో 802 ప్రాజెక్టులు చేపట్టడం లక్ష్యం. రూ.94,712 కోట్ల విలువైన 181 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2047 నాటికి మరికొన్ని కొత్త లక్ష్యాలతో పురోగమించాలి.
* ప్రస్తుతం దేశంలో ఉన్న పోర్టులు అవసరానికి సరిపడా లేవు. ఉన్నవి కూడా ఇరుకుగా మారిపోయాయి. కొత్త ఓడరేవుల నిర్మాణం వేగవంతం కావాలి.
‘‘మా దేశానికి అందుబాటులో ఉన్న సంపదతో మేం మెరుగైన రహదారులను నిర్మించుకోలేదు. అంత మంచి రహదారులు ఉండటం వల్లే సంపద సృష్టించగలిగాం’’
- అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్.ఎఫ్. కెన్నడీ
...ఒక దేశ ఆర్థిక ప్రగతికి రహదారులెంత ప్రధానమో తెలిపే వ్యాఖ్య ఇది.
2
ప్రపంచంలో అత్యంత పొడవైన రోడ్డు నెట్వర్క్ కలిగిన అమెరికా తర్వాత స్థానం మనదే
3
అతిపెద్ద దేశీయ పౌరవిమానయాన మార్కెట్లలో ప్రపంచంలో భారత్ స్థానం
4
అతిపెద్ద దేశీయ పౌరవిమానయాన మార్కెట్లలో ప్రపంచంలో భారత్ ర్యాంకు
- ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!