రైతులది ఏం తప్పుందని.. కన్నెర్ర చేస్తారు?
‘పాదయాత్రను అడ్డుకోవడం 5 నిమిషాల పని అని, కన్నెర్ర చేస్తామని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి హెచ్చరిస్తున్నారు. రైతులది ఏం తప్పుందని మీరు కన్నెర్ర చేస్తారు? రూ.10 వేల కోట్లు ఉంటే చాలు విశాఖను అభివృద్ధి చేస్తాం అని
పదవులు కాపాడుకునేందుకే మంత్రుల రెచ్చగొట్టే వ్యాఖ్యలు
అమరావతి ఐకాస నేతల ధ్వజం
ఈనాడు డిజిటల్, ఏలూరు: ‘పాదయాత్రను అడ్డుకోవడం 5 నిమిషాల పని అని, కన్నెర్ర చేస్తామని ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి హెచ్చరిస్తున్నారు. రైతులది ఏం తప్పుందని మీరు కన్నెర్ర చేస్తారు? రూ.10 వేల కోట్లు ఉంటే చాలు విశాఖను అభివృద్ధి చేస్తాం అని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చిన ప్రభుత్వం ఈ మూడేళ్లలో ఆ పని ఎందుకు చేయలేదు?’ అని అమరావతి ఐకాస నేతలు ధ్వజమెత్తారు. ఏలూరు జిల్లాలో రెండోరోజు పాదయాత్ర సందర్భంగా బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. ‘అమరావతి రైతుల మహా పాదయాత్రను చూసి మంత్రులు ఓర్వలేకపోతున్నారు. అందుకే ఒకరు శవయాత్ర అంటే మరొకరు ఒళ్లుబలిసిన వారి యాత్ర అంటున్నారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారు’ అని అమరావతి ఐకాస కన్వీనర్ శివారెడ్డి ధ్వజమెత్తారు. పాదయాత్ర ఉత్తరాంధ్ర వస్తే ప్రజలు తిరగబడతారని మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, రైతులకు వ్యతిరేకంగా గ్రామాల్లో ఫ్లెక్సీలు పెట్టి వివాదాలు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా మంత్రులతో అమరావతిపై విషం చిమ్మిస్తుండటం దుర్మార్గమన్నారు. పాదయాత్రపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆవాకులు చవాకులు పేలుతున్నా... ప్రజలు నీరాజనాలు పడుతున్నారని చెప్పారు. ‘మొదటి విడత పాదయాత్రలో రాయలసీమ వెళితే మాపై రాళ్లు పడతాయని బెదిరించారు. కానీ అక్కడి ప్రజలు పూలవర్షం కురిపించారు. మంత్రి బొత్స సత్యనారాయణ బయటకు వచ్చి ప్రస్తుతం సాగుతున్న యాత్రను ఒకసారి చూడాలి’ అని శివారెడ్డి అన్నారు.
జగన్ ఒళ్లు బలిసే పాదయాత్ర చేశారా?
రైతులు ఒళ్లు బలిసి యాత్ర చేస్తున్నారు అని మంత్రులు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్, షర్మిల కూడా ఒళ్లు బలిసే పాదయాత్రలు చేశారా? రైతులు రాష్ట్ర భవిష్యత్తు కోసం యాత్ర చేస్తున్నారు. పాదయాత్రలో పాల్గొంటున్న మహిళలపై పేటీఎం కూలీలు సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్నారు. మీ ఇంట్లో మహిళలతోనూ ఇలాగే ప్రవర్తిస్తారా? పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. కచ్చితంగా అమరావతే రాజధానిగా కొనసాగుతుంది.
- తిరుపతిరావు, జేఏసీ కోకన్వీనర్
మూడు రూపాయలైనా ఖర్చు చేశారా?
రాష్ట్రం కోసం భూములిచ్చి కష్టాలు పడుతుంటే మాపై విషం చిమ్ముతున్నారు. రాష్ట్రం కోసం మహిళా రైతులు పాదయాత్ర చేస్తుంటే.. కిరాయి కుక్కలు వారిపై అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నాయి. మూడేళ్లుగా మూడు రాజధానులు అంటున్నారు... ఈ మూడు ప్రాంతాల్లో మూడు రూపాయలైనా ఖర్చు చేశారా? మంత్రులే ఒళ్లు బలిసి న్యాయస్థానాల గురించి, న్యాయమూర్తుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు.
- రాయపాటి శైలజ, మహిళా ఐకాస నాయకురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?