పాలకులే ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతుంటే..!
అభివృద్ధి చేయాల్సిన పాలకులే.. రోడ్డెక్కి సీమలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని పౌరసంఘాల నేతలు విరుచుకుపడ్డారు.
సీమకు గర్జనలు కాదు... అభివృద్ధి కావాలి
‘ఈటీవీ ప్రతిధ్వని’ చర్చలో వక్తలు
ఈటీవీ, అమరావతి: అభివృద్ధి చేయాల్సిన పాలకులే.. రోడ్డెక్కి సీమలో ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తున్నారని పౌరసంఘాల నేతలు విరుచుకుపడ్డారు. అధికారంలోకి వస్తే మూతపడిన పరిశ్రమలకు పూర్వవైభవం కల్పిస్తామని హామీ ఇచ్చిన నేతలు.. దానిని నెరవేర్చకపోగా, ఉన్నవాటినీ తరిమేస్తున్నారని విమర్శించారు. రాయలసీమకు ఒక్కటైనా ప్రాజెక్టు తెచ్చామని గుండెల మీద చేయివేసుకుని చెప్పండి అని నిలదీశారు. పులివెందులలో బస్టాండ్ను కూడా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలు కోరుకునేది గర్జనలు కాదు... అభివృద్ధిని ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు. రాయలసీమలో పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టులు, ఉపాధి అవకాశాల కల్పనపై ‘సీమకు గర్జన కాదు, అభివృద్ధి కావాలి’ అనే అంశంపై ‘ఈటీవీ - ప్రతిధ్వని’ బుధవారం నిర్వహించిన చర్చలో పలువురు వక్తలు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
సీమ యువత కంట కన్నీరు
- నవీన్కుమార్ రెడ్డి, కన్వీనర్, రాయలసీమ పోరాట సమితి, తిరుపతి
రాయలసీమ గర్జన అనేది ఓ నాటకం. అత్యంత వెనకబడిన చిత్తూరు జిల్లాలో కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా.. ఉన్న పరిశ్రమలను ఎంపీలు, ఎమ్మెల్యేలు పోటీ పడి మరీ తరిమేస్తున్నారు. అవి తమిళనాడు, తెలంగాణకు వెళ్లిపోతుంటే ఆ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువత కంట కన్నీరు కారుస్తోంది. చిత్తూరు జిల్లా మన్నవరం దగ్గర భెల్ ఫ్యాక్టరీకీ శంకుస్థాపన చేసినా ఎందుకు తీసుకు రాలేకపోయారు. ఈ ప్రాంతంపై ప్రేమతో పరిశ్రమ ఏర్పాటు చేసిన అమరరాజా యజమానులు ఇప్పుడు మరో రాష్ట్రంలో పరిశ్రమ పెడుతున్నారు. రూ.9,300 కోట్లతో ఇక్కడ పెట్టాల్సిన పరిశ్రమకు తెలంగాణలో భూమి పూజ చేస్తుంటే మా కడుపు తరుక్కుపోయింది. హంద్రీనీవా గాలేరు నగరి ప్రాజెక్టుకు తట్టెడు మట్టి వేయలేదు.
చేతగానితనాన్ని కప్పిపుచ్చునేందుకే రెచ్చగొట్టే ధోరణి
- ఐ పుల్లారెడ్డి, పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ, కర్నూలు
చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. రాయలసీమకు అన్యాయం జరిగి ఉంటే అభివృద్ధి చేయాలి. పక్కదారి పట్టించడమంటే ప్రజలకు అన్యాయం చేయడమే. ఓర్వకల్లు సమీపంలో 32 వేల ఎకరాల భూములు సేకరించారు. ఇదిగో అదిగో అని చెప్పడమే తప్ప అక్కడ ఎలాంటి పరిశ్రమను ఏర్పాటు చేయలేదు. జిల్లాలో టమాటా రైతులు పంటను రోడ్లపై పారబోస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టేందుకూ చర్యలు తీసుకోవడం లేదు. కర్నూలు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులకు గంపెడు మట్టి వేయలేదు. లక్షల మంది వలసలు వెళ్తున్నారు. కర్నూలు జిల్లాలోనే రైతులు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి.
కడపలో కేటాయింపులే.. నిధుల్లేవు
- జీ ఓబులేశు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కడప
మూడున్నరేళ్లలో కడప జిల్లాకు రూ.13 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు ప్రకటించిన సీఎం... ఇప్పటికీ రూ.1,000 నుంచి రూ.1,500 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. గాలేరు నగరి రెండో దశ పనుల్లో ఏ ఒక్క దానికీ నిధులు వ్యయం చేయలేదు. ఇసుక తవ్వకాలతో అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోయింది. బాధితులకూ న్యాయం చేయలేదు. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ, మెగా టెక్స్ టైల్ హబ్ అతీ గతీ లేదు. మూడు వేల మందికి ఉపాధి కోసం రూ.12వేల కోట్లతో ప్రతిపాదించిన డిక్షన్ కంపెనీ క్లస్టర్ యూనిట్లోనూ అంతా శూన్యమే. కడప పట్టణంలో భూగర్భ డ్రైనేజీ స్కీం నత్తనడకన సాగుతోంది. కడప ఉక్కు.... రాయలసీమ హక్కు అన్నా... ఏమీ చేయలేదు. రాయలసీమలో పారిశ్రామిక, వ్యవసాయ, చేనేత రంగాలను అభివృద్ధి చేయాలి.
సాగునీరు వృథా, పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు
- డా. ఏ.చంద్రశేఖర్, మానవహక్కుల వేదిక, అనంతపురం
కియా లాంటి అంతర్జాతీయ సంస్థ ఏర్పాటైనా అనుబంధ పరిశ్రమలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. బెదిరింపులు, కమీషన్లతో పరిశ్రమలన్నీ వెళ్లి పోయే పరిస్థితి వస్తోంది. రాప్తాడులో జాకీ పరిశ్రమ కోసం 2018లో భూములు కేటాయించి ప్రారంభ కార్యక్రమాలు చేసినా.. ఉన్నట్టుండి అది వెళ్లిపోయింది. లేపాక్షి హబ్ కోసం 9 వేల ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నా ఒక్క పరిశ్రమ రాకపోవడంతో అవి బీడుపడ్డాయి. హెచ్ఎల్సీ కెనాల్కు లైనింగ్ చేయక ఎన్నో ఏళ్లుగా గండి పడి వచ్చిన నీరంతా వృథా అవుతోంది. హైకోర్టును అమరావతి నుంచి మార్చే ఉద్దేశం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో చెప్పినా... రాయలసీమలో హైకోర్టు అంటూ గర్జనలు చేయడమేంటి? మరో మారు రాయలసీమను మోసం చేసే ప్రయత్నం జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!