కిట్లు కొన్నారు.. కోట్లు తిన్నారు!
విద్యా కానుక కిట్ల కొనుగోళ్లలో అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే బ్యాగ్లు, బూట్ల నాణ్యత సరిగా లేదని విజిలెన్స్, ఎన్ఫోర్సుమెంట్ తనిఖీల్లో బయటపడగా.. ఇప్పుడు కొనుగోళ్లలోనూ లోపాలు వెలుగు చూస్తున్నాయి.
విద్యాకానుకలో రూ.162 కోట్లు వృథా!
విద్యార్థుల సంఖ్య కంటే అధికంగా కొనుగోళ్లు
రెండేళ్లల్లో నిరుపయోగంగా 8.50 లక్షల కిట్లు
ఇప్పుడున్న విద్యార్థులు 40 లక్షలు
వచ్చే ఏడాదికి 43 లక్షల కొనుగోళ్లు
ఈనాడు, అమరావతి: విద్యా కానుక కిట్ల కొనుగోళ్లలో అనేక అవకతవకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే బ్యాగ్లు, బూట్ల నాణ్యత సరిగా లేదని విజిలెన్స్, ఎన్ఫోర్సుమెంట్ తనిఖీల్లో బయటపడగా.. ఇప్పుడు కొనుగోళ్లలోనూ లోపాలు వెలుగు చూస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఏటా ఎక్కువ మొత్తం కొని వాటిని మూలనపడేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతుందంటూ ఐదు శాతం అధికంగా కిట్లు కొనుగోలు చేస్తుండగా.. మరోపక్క ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోతోంది. దీంతో కిట్లు భారీగా మిగిలిపోతున్నాయి. విద్యార్థులకు సరఫరా చేసిన తర్వాత కనీసం ఎన్ని కిట్లు మిగిలాయి? వాటిని వచ్చే ఏడాది పిల్లలకు ఇవ్వాలా? లేదంటే గుత్తేదారుకు వెనక్కి ఇచ్చేయాలా? అనేదాన్ని పట్టించుకోవడం లేదు. గుత్తేదార్లు సరఫరా చేసినట్లు ధ్రువపత్రాలు ఇవ్వగానే బిల్లులు చెలించేస్తున్నారే తప్ప మిగిలిపోయిన వాటి గురించి ఆలోచించడం లేదు. గుత్తేదార్ల నుంచి మామూళ్ల కోసమే కొందరు అధికారులు ఇలా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సమగ్ర శిక్ష అభియాన్లో విద్యాకానుక టెండర్లు, సరఫరా అంటేనే కాసులు కురిపించే విభాగంగా మారిపోయింది. గతేడాది కొన్న కిట్లు జిల్లాల్లో ఏడు లక్షలకు పైగా ఉండగా.. ఇప్పుడు మళ్లీ మూడు లక్షలు ఎక్కువ కొనడానికి టెండర్లు నిర్వహిస్తున్నారు.
విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనే అంచనాతో కొంటున్న అధికారులు.. మిగిలిన వాటిని ఆ తర్వాత ఏడాది వినియోగిస్తే ప్రజాధనం ఆదా అవుతుంది. కానీ, మళ్లీ కొత్త అంచనాలతో కొనేస్తున్నారు. గత రెండేళ్లల్లో ఇలా 8.50 లక్షల కిట్లు మిగిలిపోయాయి. ఈ ఏడాది మరో మూడు లక్షలు పెంచి కొనడానికి టెండర్లు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బూట్లు, బెల్టుల టెండర్లు పూర్తికాగా.. యూనిఫామ్, బ్యాగ్ల టెండర్లు ప్రాసెస్లో ఉన్నాయి. గతేడాది ఒక్కో కిట్కు రూ. 1,726 వ్యయం చేయగా.. ఈ ఏడాది కిట్కు రూ. 1,960 ఖర్చు చేశారు. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా మిగిలిపోయిన కిట్ల విలువ రూ. 162 కోట్లకు పైగా ఉంది. ఈ ఏడాది 47.40 లక్షల కిట్లు కొనుగోలు చేయగా.. ప్రభుత్వ బడుల్లో అనూహ్యంగా 3.98 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. జిల్లాల్లో మిగిలిపోయిన వాటిని రాష్ట్ర స్థాయిలో పరిగణనలోకి తీసుకోవడం లేదు. పాఠశాలల పునఃప్రారంభ సమయంలో పంపిణీపై ఉన్నతాధికారులు హడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత వస్తువులు మిగిలిపోయినా.. చెడిపోయినట్లు ఫిర్యాదు చేసినా స్పందన ఉండడం లేదు. గుత్తేదార్లకు బిల్లులు చెల్లించడం, ఆ తర్వాత ఏడాది కొనుగోలుకు టెండర్లు నిర్వహణ ప్రక్రియపైనే దృష్టిపెడుతున్నారు.
ఏం చేయాలి?
ఈ ఏడాది అందించిన బ్యాగ్లు నాణ్యత లోపంతో ఉన్నాయి. పిల్లలకు ఇచ్చిన 15 రోజులకే చినిగిపోయాయి. బ్యాగ్ల సైజులు చిన్నగా ఉన్నాయి. మరోపక్క బూట్లు పాడైపోతున్నాయి. చాలాచోట్ల చినిగిపోయిన బ్యాగ్లు, బూట్లను పిల్లలకు వెనక్కి ఇచ్చారు. వీటి స్థానంలో కొత్తవి ఇవ్వలేదు. మూడు జతల కింద విద్యార్థులకు ఇచ్చిన యూనిఫామ్ వస్త్రం కుట్టించుకుంటే రెండు జతలకే సరిపోయింది. వస్త్రం తక్కువగా ఇచ్చారు. డిసెంబరు 30న విజిలెన్స్, ఎన్ఫోర్సుమెంట్ విభాగం తనిఖీల్లోనూ ఇవి బహిర్గతమయ్యాయి. వచ్చే ఏడాది సిలబస్ను మారుస్తున్నందున పాత పాఠ్యపుస్తకాలు వినియోగించుకోలేని దుస్థితి. ఇలాంటి కిట్లు 7.09 లక్షలు మిగిలాయి. కనీసం వీటిని ఏం చేయాలనే దానిపైనా అధికారులకు స్పష్టత లేకుండాపోయింది. ఏడాది పాటు మూలనపడేసి, వచ్చే సంవత్సరం పిల్లలకు ఇస్తే బ్యాగ్లు, బూట్లు మరింత తొందరగా చినిగిపోయే అవకాశం ఉంటుంది. 2021లో ఇచ్చిన వాటిల్లో 1.41 లక్షల కిట్లు వృథాగా ఉన్నాయి. రెండేళ్ల తర్వాత వీటిని పంపిణీ చేస్తే ఉపయోగపడతాయా? అనేదానిపైనా అనుమానాలున్నాయి.
కిట్లో ఇచ్చే వస్తువులు
జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్ క్లాత్, పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్లు, ఆంగ్ల నిఘంటువు..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ నేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!