ఎన్టీఆర్‌ చిత్రంతో రూ.వంద వెండి నాణెం

దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆయన చిత్రంతో వంద రూపాయల వెండి నాణెం విడుదలకు రిజర్వు బ్యాంకు ఆమోదం తెలిపింది.

Updated : 16 Feb 2023 07:41 IST

రెండు నెలల్లో అందుబాటులోకి

ఈనాడు, హైదరాబాద్‌: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు ఎన్టీఆర్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఆయన చిత్రంతో వంద రూపాయల వెండి నాణెం విడుదలకు రిజర్వు బ్యాంకు ఆమోదం తెలిపింది. మరో 2 నెలల్లో ఇది మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ నాణెం కొనుగోలుకు.. రిజర్వు బ్యాంకు కౌంటర్‌ లేదా ఏదైనా బ్యాంకులో రూ.4,160 చెల్లించాలి. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం చొప్పున జింకు, నికెల్‌ కలిపి ఈ నాణెం తయారు చేయనున్నారు. ప్రముఖ వ్యక్తుల చిత్రాలతో అరుదుగా ఇలాంటి నాణేలను రిజర్వు బ్యాంకు విడుదల చేస్తుంది. గతంలో ఎం.ఎస్‌.సుబ్బులక్ష్మి చిత్రంతో ఇలా నాణెం విడుదల చేసింది. ఎన్టీఆర్‌పై నాణెం విడుదల చేయాలని ఆయన కుమార్తె పురందేశ్వరి గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విన్నవించారు. ఈ క్రమంలో రిజర్వుబ్యాంకు ఈ చర్యలు తీసుకుంది. ఎన్టీఆర్‌ చిత్రంతో నాణెంతో పాటు ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలను చిన్న పుస్తకంలా 4 పేజీల్లో ముద్రించి కొనుగోలుదారులకు అందజేస్తారు. ఈ అంశంపై ఆర్‌బీఐ అధికారులు బుధవారం పురందేశ్వరిని కలిసి వివరాలు సేకరించారు. తన తండ్రి ఆశీర్వాదంతోనే ఇది సాధ్యమైందని, దీన్ని తమ అదృష్టంగా భావిస్తున్నామని పురందేశ్వరి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని