‘మార్గదర్శి’ కేసులో మేనేజర్లకు బెయిల్
మార్గదర్శి శాఖలకు చెందిన విజయవాడ, ఒంగోలు, చీరాల మేనేజర్లకు సోమవారం బెయిల్ మంజూరైంది.
ఈనాడు, అమరావతి: మార్గదర్శి శాఖలకు చెందిన విజయవాడ, ఒంగోలు, చీరాల మేనేజర్లకు సోమవారం బెయిల్ మంజూరైంది. రాజమహేంద్రవరం, విశాఖలో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. విజయవాడ లబ్బీపేట మార్గదర్శి బ్రాంచి మేనేజర్ బండారు శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేస్తూ విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి (ఎంఎస్జే) న్యాయస్థానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అభియోగపత్రం దాఖలు చేసేంత వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 లోపు ఏదో ఒక సమయంలో ఎస్హెచ్వో ముందు ప్రతిరోజు హాజరు కావాలని షరతు విధించింది. న్యాయాధికారి ఆంజనేయమూర్తి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. మేనేజరు తరఫున న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ‘ప్రాథమిక ఆధారాలు లేకపోయినా తప్పుడు కేసు నమోదు చేసి సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. మార్గదర్శి సొమ్ము చెల్లించలేదని ఏ ఒక్క సబ్స్క్రైబర్ నుంచి ఫిర్యాదు లేదు. ఈ నేపథ్యంలో చిట్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చెల్లదు. మార్గదర్శిపై బలవంతపు చర్యలు వద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు ఉల్లంఘించారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి(ఐవో) ఇప్పటికే రిజిస్ట్రర్లు, దస్త్రాలను సీజ్ చేశారు. పిటిషనర్ను రిమాండ్లో ఉంచాల్సిన అవసరం లేదు. బెయిలు మంజూరు చేయాలి...’ అని కోరారు.
సాక్ష్యాలు తారుమారు ప్రశ్నే ఉత్పన్నం కాదు: న్యాయాధికారి ఆంజనేయమూర్తి
సీడీ ఫైల్ను పరిశీలిస్తే ఐవో.. దస్త్రాలను సీజ్ చేసినట్లు స్పష్టమవుతోందని, మేనేజరు స్టేట్మెంట్ను ఐవో రికార్డు చేశారని న్యాయాధికారి ఆంజనేయమూర్తి పేర్కొన్నారు. మార్గదర్శి బ్యాంకు ఖాతాల పరిశీలనకు ఐజీ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ.. ఇప్పటికే ఛార్టర్డ్ అకౌంటెంట్ను నియమించిందని గుర్తు చేశారు. ‘దస్త్రాలను దర్యాప్తు సంస్థ సీజ్ చేసింది. బెయిలు మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్షులను ప్రభావితం చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎందుకంటే సాక్ష్యాధారాలన్నీ దస్త్రాల రూపంలో చిట్ రిజిస్ట్రార్ వద్ద ఉన్నాయి...’ అని పేర్కొన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని బెయిలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. విజయవాడ అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 12న సీఐడీ పోలీసులు బ్రాంచి మేనేజరు శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఒంగోలు, చీరాలలో మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు
మార్గదర్శి కేసులో ఒంగోలు బ్రాంచి మేనేజర్ కరణం నాగేశ్వరరావు, పేయబుల్ మేనేజర్ అరెకొండ సాంబ శ్రీను, చీరాల బ్రాంచి మేనేజరు జి.సురేంద్ర, అకౌంటెంట్లు మద్దినేని కోటేశ్వరరావు, బుడితి శ్రీనివాసులుకు మధ్యంతర ముందస్తు బెయిల్ను ఒంగోలు ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎ.భారతి సోమవారం మంజూరు చేశారు. పిటిషనర్లను అరెస్ట్ చేయవద్దని సీఐడీని నిర్దేశించారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించడంతో పాటు విచారణకు పిలిచినప్పుడు హాజరు కావాలని, లేనిపక్షంలో బెయిల్ రద్దవుతుందని పేర్కొన్నారు. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసు నమోదు చేస్తే సీఆర్పీసీ 41ఎ నోటీసు ఇచ్చి చట్టప్రకారం వ్యవహరించాలని తీర్పులో పేర్కొన్నారు.
విచారణ నేటికి వాయిదా
విశాఖపట్నంలోని మార్గదర్శి సీతంపేట శాఖ మేనేజర్ కె.రామకృష్ణ పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై సోమవారం విశాఖ మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయస్థానంలో ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు ముగిశాయి. సీఐడీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్.రామమూర్తినాయుడు వాదిస్తూ విచారణ ఇంకా పూర్తి కాలేదని, ఈ పరిస్థితుల్లో బెయిల్ ఇస్తే తదుపరి విచారణకు విఘాతం కలుగుతుందన్నారు. రామకృష్ణ తరఫున న్యాయవాదులు ఎం.రవి, టి.సత్యశ్రీకాంత్ వాదనలు వినిపిస్తూ నిరాధార ఆరోపణలపై కేసు నమోదు చేసిన సీఐడీ కేవలం రాజకీయ కక్షతోనే మార్గదర్శి శాఖల్లో సోదాలు ప్రారంభించిందని, అన్ని దర్యాప్తులు ముగిసినా ఇంకా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఎం.తిరుమలరావు బెయిల్ పిటిషన్పై తదుపరి ఆదేశాల కోసం కేసును మంగళవారానికి వాయిదా వేశారు.
* తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని మార్గదర్శి కార్యాలయం మేనేజర్ రవిశంకర్ బెయిల్ పిటిషన్పై విచారణను జిల్లా ఇన్ఛార్జి ప్రధాన న్యాయమూర్తి సునీత మంగళవారానికి వాయిదా వేశారు. దీనిపై సోమవారం వాదనలు విన్నారు. అలాగే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న మార్గదర్శి మేనేజర్ను కస్టడీకి కోరుతూ సీఐడీ అధికారులు పిటిషన్ వేయగా ఈ విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది. -
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
అధికార పార్టీ నేతల ఫొటోలు, హోర్డింగులు తొలగించడంలో చర్యలు తీసుకోని అధికారులు.. నిరుపేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్కు మాత్రం నిబంధనలు వర్తిస్తాయంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
తెదేపా, జనసేన, భాజపా కూటమి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి పల్నాడు జిల్లా బొప్పూడిలో జరిగిన ప్రజాగళం సభలో తోపులాటలు చోటుచేసుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి అంతరాయం ఏర్పడిన ఘటనపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. -
రోజంతా ఆసుపత్రి గదిలో చిక్కుకుపోయిన 5 ఏళ్ల బాలుడు
మాటలు రాని, వినపడని ఓ అయిదేళ్ల చిన్నారి అనుకోని పరిస్థితుల్లో ఆసుపత్రి గదిలో ఒక రోజంతా బందీ అయిపోయిన ఘటన కర్నూలు జిల్లా సర్వజన ఆసుపత్రిలో జరిగింది. -
బోరు వేసుకుంటారా.. రూ. 10 వేలు కట్టండి
తిరుపతిలోని అధికార పార్టీ కార్పొరేటర్ల అసలు రంగును బయటపెడుతూ సోమవారం ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
ఐదేళ్లూ షాక్.. ఎన్నికలని బ్రేక్!
పాదయాత్ర పేరిట ఊరూవాడా తిరిగిన జగన్... విద్యుత్ ఛార్జీలపై అలవోకగా అబద్ధాలు వల్లెవేశారు. మాటల గారడీతో ప్రజలను బురిడీ కొట్టించారు. -
వైకాపా సైన్యం బరితెగింపు
ఎన్నికల సంఘం నిఘా పరిధిలో ఉన్నామన్న బెరుకు లేదు.. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తున్నామన్న అదురూ లేదు. -
వేతనాల చెల్లింపులపై నేడు ‘చివరి గ్రీవెన్స్ డే’
వేతనాల చెల్లింపులకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా జిల్లా కేంద్రాలలో మంగళవారం నిర్వహించే చివరి ‘గ్రీవెన్స్ డే’(వినతుల స్వీకరణ)లో పరిష్కరించుకోవాలని ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె.నివాస్ సూచించారు. -
జగన్పై పోస్టులో అభ్యంతరకర భాగాన్ని తొలగించండి
వైకాపా అధ్యక్షుడు జగన్పై తెదేపా ఎక్స్ ఖాతాలో ఉంచిన పోస్టులో అభ్యంతరకరమైన ఓ భాగాన్ని తొలగించాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి సోమవారం లేఖ రాసింది. -
కక్షిదారులకు వెంటనే న్యాయం అందించాలి
న్యాయస్థానాల్లో కక్షిదారులకు వేగంగా న్యాయం జరిగేలా న్యాయవాదులు చొరవ తీసుకోవాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అన్నారు. -
ఓఎంఆర్ షీట్లో గల్లంతైన విద్యార్థిని పేరు
విద్యాశాఖ అధికారుల తీరుతో పదో తరగతి విద్యార్థిని అరగంటపాటు తల్లడిల్లాల్సి వచ్చింది. తిరుపతి నగరంలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె.వర్షిణి తనకు కేటాయించిన బైపాస్లోని రత్నం పరీక్షా కేంద్రం వద్దకు అరగంట ముందుగానే చేరుకుంది. -
కోడ్ కూసే ముందు.. అయినవారికే నిధులు
ఇప్పటికే పలు దఫాలు సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న డోన్ పరిధిలో రహదారుల పనులు చేసిన గుత్తేదార్లకు మాత్రమే చెల్లింపులు చేశారంటూ ఇతర ప్రాంతాలకు చెందిన కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. -
కాసులివ్వని కపట ప్రేమ!
పేరుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డబ్బులు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తారు.. రైతులకు మాత్రం సున్నా వడ్డీ లేదు. పెట్టుబడి సాయమూ లేదు. -
గ్రహణం వీడితేనే గట్టెక్కేది!
చుట్టూ నీళ్లలో నిరుపయోగంగా ఉన్న ఈ నిర్మాణాలు టిడ్కో ఇళ్లు. ఒంగోలు నగరం సమీపంలోని చింతల వద్ద తెదేపా హయాంలో నిర్మించారు. -
ఈఏపీసెట్ పరీక్ష తేదీల్లో మార్పు
ఎన్నికల నేపథ్యంలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్ష షెడ్యూల్ మారనుంది. -
ఉత్తుత్తి సంక్షేమం
‘గడప గడపకు సంక్షేమం’ పేరుతో వైకాపా ప్రభుత్వం పేదలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోంది. -
కోడ్ ఉల్లంఘన విచారణలో జాప్యం: కలెక్టర్ ఆగ్రహం
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వాలంటీర్ల వివరాల సేకరణలో జాప్యం జరగడంతో గుంటూరు జిల్లా కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఇదేం సామాజిక న్యాయం జగన్?
వైకాపా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో సామాజిక న్యాయం నేతి బీర చందంగా ఉంది. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉమ్మడి నెల్లూరు జిల్లాను కలిపి వైకాపా టికెట్ల కేటాయింపు పరిశీలిస్తే.. జగన్ మార్క్ న్యాయం ఏమిటన్నది స్పష్టమవుతోంది. -
సీపీఎస్ ఉద్యోగుల డబ్బులు రూ.2,800 కోట్లు హాంఫట్
జగన్ సర్కార్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) ఉద్యోగులపై కక్షకట్టినట్లు వ్యవహరిస్తోంది. -
ఆగని సలహాదారు నియామకాల జోరు
ప్రభుత్వశాఖలకు సలహాదారుల నియామకంపై హైకోర్టు అభ్యంతరం చెప్పినా జగన్ ప్రభుత్వ తీరు మారడంలేదు.
తాజా వార్తలు (Latest News)
-
వంట త్వరగా చేయలేదని భార్యను హతమార్చి.. ఆపై ఆత్మహత్య
-
TDP: ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ!.. నారా భువనేశ్వరిపై పాట ఆవిష్కరణ
-
అన్నక్యాంటీన్ సేవలు ఆపాల్సిందే!.. ఎన్నికల కోడ్ అంటూ అధికారుల అభ్యంతరం
-
ఉపరాష్ట్రపతి కావొచ్చనే ఉద్దేశంతో తమిళిసై రాజీనామా: మంత్రి అనితా రాధాకృష్ణన్
-
ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు
-
AP News: తెలుగు రాద్దామనుకుంటే.. హిందీ ప్రశ్నపత్రం వచ్చింది