స్వాధీనం చేసుకున్న వాటిని తిరిగిచ్చేలా ఆదేశించండి
ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్, ఇతర రికార్డులను కాపీ చేసుకోకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు బ్రహ్మయ్య అండ్ కొ విజ్ఞప్తి చేసింది.
చట్టవిరుద్ధమైన సోదా ఉత్తర్వులను రద్దు చేయండి
సంబంధం లేని సమాచారాన్ని తీసుకెళ్లారు
తెలంగాణ హైకోర్టులో బ్రహ్మయ్య అండ్ కొ అనుబంధ పిటిషన్
ఈనాడు, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్, ఇతర రికార్డులను కాపీ చేసుకోకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీచేయాలంటూ తెలంగాణ హైకోర్టుకు బ్రహ్మయ్య అండ్ కొ విజ్ఞప్తి చేసింది. తమ కార్యాలయంలో సోదాల నిమిత్తం ఇచ్చిన నోటీసులను రద్దుచేయాలని కోరింది. ఈ మేరకు బ్రహ్మయ్య అండ్ కొ తెలంగాణ హైకోర్టులో శుక్రవారం అనుబంధ పిటిషన్ దాఖలుచేసింది. వివరాలిలా ఉన్నాయి.. ‘గత వారం అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేసినప్పుడు పూర్తి సమాచారం అందుబాటులో లేదు. మార్చి 28 మధ్యాహ్నం 2.30 నుంచి 29న 5 గంటల వరకూ భాగస్వామి కోటేశ్వరరావును సీఐడీ అధికారులు తమ నియంత్రణలో ఉంచుకోవడంతో సమాచారం లేకపోయింది. కార్యాలయంలో సోదాల నిమిత్తం 30-35 మంది వచ్చినా, ఇద్దరే యూనిఫాం వేసుకుని, మిగిలినవారు మఫ్టీలో వచ్చారు. స్థానిక పోలీసులు ఎవరూ లేకుండా ప్రవేశించి బలవంతంగా ఇంటర్నెట్, సీసీటీవీ కనెక్షన్లను కట్ చేశారు. ఏపీ పోలీసులకు ఇక్కడ సోదా చేసే పరిధి లేదని అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోకుండా కార్యాలయంలో ఉన్నవారందరి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మార్గదర్శి సమాచారాన్ని ఇస్తామని చెబుతున్నా పట్టించుకోకుండా కంప్యూటర్లలోని సమాచారాన్ని కాపీ చేసుకుని, రికార్డులను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. సీఐడీ జారీచేసిన సోదా ఉత్తర్వులు ఏపీ పోలీసులు నమోదు చేసిన కేసుకు సంబధించినవే తప్ప, మార్గదర్శి చట్టబద్ధ ఆడిటర్ పాత్రకు చెందినవి కావు. కంపెనీ చట్టం కింద మార్గదర్శికి చెందిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్ను రూపొందించడమే మా బాధ్యత. చిట్ఫండ్ కింద ఎలాంటి ఆడిట్ నిర్వహించట్లేదు’ అని తెలిపింది.
సమాచారం తీసుకెళ్లిన వ్యక్తి అరెస్టు
మార్గదర్శి సమాచారాన్ని సమర్పించాలంటూ సీఐడీ అదనపు ఎస్పీ మార్చి 18న నోటీసు జారీచేశారని, అయితే ఆర్థిక సంవత్సరాంతం కావడంతో మూడు వారాల గడువు కావాలని కోరినట్లు బ్రహ్మయ్య అండ్ కొ తెలిపింది. దీనికి వారు నిరాకరించడంతో 28న ఉదయం 10 గంటలకు కె.శ్రావణ్ ల్యాప్టాప్తో విజయవాడ సీఐడీ కార్యాలయానికి వెళ్లగా ఆయనతో పాటు వెళ్లిన రజత్ను నిర్బంధించి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారంది. 29న శ్రావణ్ను అరెస్టుచేసి రిమాండుకు తరలించారని తెలిపింది. సమాచారం ఇచ్చినా హైదరాబాద్ కార్యాలయంలో బలవంతంగా సోదాలు ప్రారంభించారంది. ముగ్గురు భాగస్వాములు, 18 మంది ఉద్యోగులను నిర్బంధించి ఫోన్లను జప్తు చేశారని, మహిళా ఉద్యోగులను సాయంత్రం 5 గంటలకు, మధుమేహం ఉన్న ఒక భాగస్వామిని సాయంత్రం, మరొకరిని రాత్రి వదిలిపెట్టారన్నారు. 80 ఏళ్ల పి.కోటేశ్వరరావు ఆరోగ్యాన్నీ పట్టించుకోకుండా సోదాలు పూర్తయ్యేదాకా వారితోనే ఉంచుకున్నారని తెలిపింది. మార్గదర్శివే కాకుండా, ఖాతాదారులందరికీ చెందిన 12 ల్యాప్టాప్లు, 2 డేటా బ్యాకప్స్, 7 డెస్క్టాప్లలోని సమాచారాన్ని కాపీ చేసుకున్నారంది. మార్గదర్శితో సంబంధంలేని డాల్ఫిన్ హోటల్స్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఉషోదయ పబ్లికేషన్స్, ఈటీవీ, మార్గదర్శి ఇన్వెస్ట్మెంట్ అండ్ లీజింగ్ కంపెనీ లిమిటెడ్, ఎల్.చిమన్లాల్ ఇండస్ట్రీస్లకు చెందిన సమాచారాన్ని తీసుకెళ్లారంది.
పంచనామాలో తప్పులు
సోదాల తర్వాత రూపొందించిన పంచనామాలో తప్పులుండటంతో అందులో సంతకం చేయడానికి కోటేశ్వరరావు నిరాకరించారంది. అయితే పంచనామా కాపీని ఇవ్వడం గానీ, వదిలిపెట్టి వెళ్లడం గానీ చేయలేదని తెలిపింది. సీఆర్పీసీ సెక్షన్ 165, 166లకు విరుద్ధంగా సోదాలు జరిగాయంది. చట్టప్రకారం కేసుతో సంబంధం ఉన్న వివరాలను తీసుకెళ్లాలని, దానికి విరుద్ధంగా సంబంధం లేని వాటిని, ఇతర ఖాతాదారుల సమాచారాన్ని తీసుకెళ్లారని సంస్థ తెలిపింది. అందువల్ల ప్రధాన పిటిషన్లోని అభ్యర్థనను సవరించడానికి అనుమతించాలని, తీసుకెళ్లిన సమాచారాన్ని కాపీ చేసుకోకుండా తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని కోరింది. లేనిపక్షంలో తమకు తీవ్రనష్టం వాటిల్లుతుందని పేర్కొంది. సోదా నోటీసులను రద్దుచేయాలని కోరింది. దీనిపై ఏపీ తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేస్తూ కౌంటరు దాఖలు చేస్తామనడంతో న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి అనుమతిస్తూ విచారణను ఈ నెల 13కు వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!