వినియోగదారులకు మరో షాక్
విద్యుత్ వినియోగదారులపై మరో ఇంధన సర్దుబాటు (ట్రూఅప్) పిడుగు పడింది. యూనిట్కు 40 పైసల వంతున మే నెల బిల్లుతో కలిపి డిస్కంలు వసూలు చేస్తున్నాయి.
ఏప్రిల్లో విద్యుత్ కొనుగోలు ఖర్చుల సర్దుపోటు
ప్రతి యూనిట్కు 40 పైసల వంతున భారం
మే బిల్లులో కలిపి వసూలు చేస్తున్న డిస్కంలు
ఈనాడు, అమరావతి: విద్యుత్ వినియోగదారులపై మరో ఇంధన సర్దుబాటు (ట్రూఅప్) పిడుగు పడింది. యూనిట్కు 40 పైసల వంతున మే నెల బిల్లుతో కలిపి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. దీంతో బిల్లు పట్టుకుంటేనే వినియోగదారులకు షాక్ తగిలే పరిస్థితి ఏర్పడుతుంది. ఏప్రిల్లో బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనడానికి చేసిన ఖర్చును ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద డిస్కంలు వసూలు చేస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రతి నెలా ఈ ఛార్జీలను వసూలు చేసుకునే వెసులుబాటును రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) డిస్కంలకు కల్పించింది. ఏపీఈఆర్సీ అనుమతి లేకుండా గరిష్ఠంగా యూనిట్కు 40 పైసలు వసూలు చేసే అధికారం డిస్కంలకు ఉంది. ఇలా వసూలు చేసిన మొత్తాన్ని ఏడాది చివరలో సర్దుబాటు చేస్తాయి. ఇప్పటికే ప్రతి నెలా వచ్చే బిల్లులో రూ.2,910.74 కోట్లు, రూ.3,082.99 కోట్లకు సంబంధించిన ట్రూఅప్ మొత్తాన్ని డిస్కంలు కలిపి వసూలు చేస్తున్నాయి. దీనికి తోడు మూడో ట్రూఅప్ మొత్తం ప్రజలకు మరింత భారం కానుంది. ఎంత మొత్తం భారం పడుతుందన్న లెక్కలను మాత్రం అధికారులు బయటపెట్టడం లేదు.
ఏ నెల విద్యుత్ కొన్నా సర్దుపోటే ...!?
ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు గడిచింది కేవలం 2 నెలలు మాత్రమే. ఈ రెండు నెలల్లో చేసిన విద్యుత్ కొనుగోళ్లతో డిస్కంలకు తట్టుకోలేని నష్టాలు వచ్చాయని లెక్కలు తేల్చాయి. వేసవిలో డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి బహిరంగ మార్కెట్ నుంచి కొనడానికి డిస్కంలు రూ.కోట్లు ఖర్చు చేశాయి. ఏపీఈఆర్సీ నిర్దేశించిన టారిఫ్ ప్రకారం వినియోగదారుని నుంచి బిల్లులు వసూలు చేసినా.. అధిక ధరకు మార్కెట్లో కొన్న విద్యుత్ వల్ల ఇంకా యూనిట్కు రూ.1.20 వంతున నష్టం వస్తుందని డిస్కంలు లెక్క తేల్చాయి. ఈ నష్టాన్ని భర్తీ చేసుకోడానికి ట్రూఅప్ కింద యూనిట్కు 40 పైసల వంతున మే నెల బిల్లులో వసూలు చేసి.. మిగిలిన నష్టాలకు సంబంధించి ఏడాది చివరలో ఏపీఈఆర్సీకి లెక్కలు చూపి వసూలు చేసుకోడానికి వీలుగా అనుమతి తీసుకోవాల్సి ఉంది. అంటే.. యూనిట్కు 40 పైసలతో ఏప్రిల్కు సంబంధించిన ట్రూఅప్ భారం వదిలిపోయిందని వినియోగదారులు ఊపిరి పీల్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే డిస్కంలు చూపుతున్న లెక్కల ప్రకారం ఇంకా యూనిట్కు 80 పైసల వంతున ట్రూఅప్ ప్రతిపాదనలను ఏడాది చివర్లో డిస్కంలు దాఖలు చేస్తాయి. వాటిని పరిశీలించి.. ఎంత మొత్తాన్ని వసూలుకు అనుమతించాలనే దానిపై ఏపీఈఆర్సీ నిర్ణయిస్తుంది. మే నెల బిల్లులో డిస్కంలు వసూలు చేసిన మొత్తానికి మరో రెండు రెట్ల భారాన్ని ఏడాది చివరలో భరించడానికి వినియోగదారులు ఇప్పటి నుంచే మానసికంగా సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితిని డిస్కంలు కల్పిస్తున్నాయి. ఇప్పటికే మేలో కూడా భారీ మొత్తం ఖర్చు చేసి డిస్కంలు విద్యుత్ కొన్నాయి. నిబంధన ప్రకారం వచ్చే నెల కూడా యూనిట్కు మరో 40 పైసలు వడ్డించడానికి డిస్కంలు సిద్ధంగా ఉన్నాయి. ఏ నెలకు ఆ నెల విద్యుత్ కొనుగోలు చేస్తే దానికనుగుణంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఆ మేరకు బాదుడు బాధ భరించడం వినియోగదారులకు తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!