జలవనరుల శాఖలో ఇంకా బది‘లీల’లే!
ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ఇంజినీరింగు అధికారుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మే నెలాఖరుకల్లా పూర్తిచేసి, ఎవరు ఎక్కడ చేరాలో జాబితా ఇవ్వాల్సి ఉన్నా జూన్ 3 రాత్రికి కూడా ఆ జాబితాలు సిద్ధం కాలేదు.
గడువు దాటినా పూర్తికాని ప్రక్రియ
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జలవనరులశాఖ ఇంజినీరింగు అధికారుల బదిలీల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. మే నెలాఖరుకల్లా పూర్తిచేసి, ఎవరు ఎక్కడ చేరాలో జాబితా ఇవ్వాల్సి ఉన్నా జూన్ 3 రాత్రికి కూడా ఆ జాబితాలు సిద్ధం కాలేదు. బదిలీలు చేసినట్లు ప్రొసీడింగు ఉత్తర్వులు ఇచ్చారు. ఎవరు ఎక్కడ చేరాలో ఇప్పటికీ జాబితా ఖరారు కాలేదు. బదిలీల నిర్ణయం తీసుకునే కీలక స్థానాల్లో ఉన్నవారిలో ఒకరిద్దరు, వారి సహాయకుల్లో ఒకరిద్దరు ఇప్పటికీ లీలలు కొనసాగిస్తున్నారని ఇంజినీరింగు వర్గాలు లబోదిబోమంటున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన బదిలీ మార్గదర్శకాలనూ వారు పట్టించుకోవట్లేదు. కొన్ని ఇంజినీరింగు శాఖల్లో పాలనా సౌలభ్యంతో ఇచ్చుకున్న వెసులుబాట్లను జలవనరుల శాఖలోనూ అమలుచేయాలని కోరినా ఇక్కడ ఉన్నతస్థాయిలో అందుకు సముఖంగా లేరు. అయిదేళ్లు పూర్తిచేసిన ప్రతి ఉద్యోగినీ బదిలీచేయాలని, పాలనా సౌలభ్యంలో భాగంగా వెసులుబాటు కల్పించుకోవచ్చని జీవోలో పేర్కొన్నారు. జలవనరుల శాఖలోని నాణ్యత నియంత్రణ విభాగంలో మూడేళ్లు దాటినవారినీ బదిలీ చేయాలని నిర్ణయించుకుని జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల్లో మూడేళ్ల నిబంధన లేదని ఆ విభాగం వారెవరూ దరఖాస్తు చేసుకోలేదు. బదిలీ కోసం ఎంచుకోవాల్సిన మూడు ప్రాంతాలను దరఖాస్తులో చూపాలి. తాము ఎటూ బదిలీల పరిధిలోకి రామనే ఉద్దేశంతో ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. అలాంటిది ఇప్పుడు మూడేళ్లు దాటితే బదిలీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
కొన్ని ప్రాజెక్టుల్లో అవసరాల రీత్యా, ప్రతిభ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని కొందరిని బదిలీ చేయాలనే డిమాండు వచ్చినా, అసలు ప్రాజెక్టుల పనులే చేయట్లేదు కదా.. ఇక ఎవరు ఎక్కడుంటే ఏంటని ఉన్నత స్థాయిలోనే ప్రశ్నిస్తున్నారు! ప్రాజెక్టుల నిర్వహణ, సాగునీటి కాలువల నిర్వహణ, వరద నియంత్రణ తదితరాల్లో అనుభవం ఉన్నవారిని ఒకచోట నుంచి మరో చోటకు అదే అనుభవం ఉపయోగించుకునేలా బదిలీలు చేస్తే ఒక ఎత్తు. కీలకమైన నిర్వహణ ఉండాల్సిన చోట ఏ మాత్రం అనుభవం లేనివారిని బదిలీ చేయడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గతంలో ఇలాగే గోదావరి వరదల సమయంలో ఎక్కడో దూరంగా పని చేస్తున్న ఒక అధికారిని తిరిగి ఆయన అనుభవం కోసం ప్రత్యేకాధికారిగా నియమించుకోవాల్సి వచ్చింది. కేంద్ర ఆకృతుల సంస్థలో ఎన్నాళ్ల నుంచో డిజైన్లలో అనుభవం ఉన్నవారిని కొందరిని మార్చవద్దని ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఉన్నతాధికారులు ఒకరిద్దరు విన్నవించినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రాజెక్టుల్లో డిజైన్లకు మూడు, నాలుగు నెలల సమయం పడుతోందని, ఆ అనుభవం ఉన్నవారిని మారిస్తే తర్వాత డిజైన్లకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పినా ఆ మాట వినిపించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. బదిలీలు ఉద్యోగుల సౌలభ్యంతో పాటు పనికి ఇబ్బందులు రాని విధంగా చూసుకోవాలే తప్ప బదిలీ ప్రక్రియ నిర్వహిస్తున్న వారు తమ స్వలాభాన్నే చూసుకుంటే ఎలా అన్న విమర్శలు వస్తున్నాయి. కొన్ని బదిలీలకు సంబంధించి ఉన్నతస్థాయిలో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాల వల్ల కూడా సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
సంక్షిప్తవార్తలు (6)
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!