Peddireddy: ‘అంబటిలా మాట్లాడను’: మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు వైరల్‌

రాష్ట్ర అటవీ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.

Updated : 08 Oct 2023 07:09 IST

ఈనాడు, తిరుపతి: రాష్ట్ర అటవీ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత గత నెలలో తిరుపతిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు పలు సమాధానాలు ఇచ్చారు. ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ‘ఒక రాజకీయ నాయకుడిగా కొంతమంది కొన్ని విలువలు పాటిస్తారు. ఆ విలువలకు లోబడే నేను మాట్లాడగలుగుతా. మా అంబటి రాంబాబు మాదిరిగా మాట్లాడను’ అన్నారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తన సహచర మంత్రి గురించే ఈ తరహాలో మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని