ఎన్ని‘కుల’ జగన్నాటకం
ప్రజల కులం, ఆస్తులు, ఆర్థిక స్థితి తదితర వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి ఉంటే తప్ప.. ప్రభుత్వం దగ్గర మినహా మరెక్కడా ఉండటానికి వీల్లేదు.
ప్రజల వ్యక్తిగత సమాచారం అధికార పార్టీ చేతికి!
36 రోజులు సర్వే చేసినా.. బయటపెట్టని సర్కారు
జగన్ ఎన్నికల ఎత్తుగడలో భాగమే కులగణన
ఈనాడు, అమరావతి: ప్రజల కులం, ఆస్తులు, ఆర్థిక స్థితి తదితర వ్యక్తిగత సమాచారాన్ని వారి అనుమతి ఉంటే తప్ప.. ప్రభుత్వం దగ్గర మినహా మరెక్కడా ఉండటానికి వీల్లేదు. అలా ఇతరచోట్లకు మళ్లించడం ప్రజల గోప్యత హక్కుకు భంగం కలిగించడమే. ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్ ఇదే పని చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కులగణన పేరుతో ఇటీవల ఇంటింటికీ వాలంటీర్లను పంపి సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వం ప్రకటించకుండానే, వైకాపా చేతికి చేరినట్టు అధికార వర్గాల్లో చర్చ సాగుతోంది. వాటి ఆధారంగానే ఈ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థుల ఎంపిక మొదలు.. ఏ సామాజికవర్గం ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంది..? వారిని ఆకట్టుకునేందుకు ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయాలన్న లెెక్కలు వేసుకుని చక్కబెట్టుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే కులగణన వివరాలు బహిర్గతం చేయలేదన్న చర్చ నడుస్తోంది. సంబంధిత శాఖల అధికారులు మాత్రం సర్వే పూర్తి కాలేదని, ఇంకా 10 శాతం కుటుంబాల వివరాలు సేకరించాల్సి ఉందని చెబుతున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిన కారణంగా సర్వేను నిలిపివేసినట్లు పేర్కొంటున్నారు.
ఇన్ని రోజుల సమయమా?
దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కులగణన చేపడుతున్నామని, దాని ఆధారంగా ఆయా సామాజికవర్గాల తలరాతల్ని మార్చేస్తామంటూ జగన్ మొదలు, ఆయన వందిమాగధులు డబ్బా కొట్టారు. మొదట గతేడాది నవంబరులో సర్వే చేయాలని నిర్ణయించారు. అప్పుడు చేస్తే తాము అనుకున్న లాభం ఉండదనుకున్నారేమో గానీ వాయిదా వేశారు. తిరిగి ఎన్నికలు సమీపిస్తున్నాయనగా, జనవరి 19న ప్రారంభించారు. కులాలను లెక్కిస్తామని చెప్పి.. ప్రజల ఆస్తులు, విద్యార్హతలు తదితర 20 అంశాలతో కుటుంబాల సమస్త సమచారాన్ని సేకరించారు. తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేను కేవలం ఒక్క రోజులోనే పూర్తి చేసింది. రాష్ట్రంలో మాత్రం 36 రోజుల సుదీర్ఘ సమయం తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి రెండు వేల కుటుంబాలకు ఒక గ్రామ, వార్డు సచివాలయం ఉంది. 50 కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్లు ఉన్నారు. ప్రభుత్వం అడిగిన వివరాలు సేకరించడం వారికి అంత కష్టం కాదు. వైకాపా ప్రభుత్వం మొదట కులగణన పూర్తికి ఇచ్చిన గడువు వారం రోజులే. కానీ ప్రభుత్వం జనవరి 19 నుంచి ఫిబ్రవరి 26 వరకు కొనసాగించింది. ఇంకా 10 శాతం మేర పూర్తి కాలేదని చెప్పడమంటే బుకాయించడమే. మొదట్లో కులగణనపై హడావుడి చేసిన సర్కారు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే తేదీ దగ్గర పడుతున్నా సర్వే వివరాలు ప్రకటించలేదంటే దాని వెనుక వైకాపా పెద్దలు రచించిన వ్యూహం ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.
అత్యధిక జనాభా ఉన్న నియోజకవర్గం భీమిలి
ప్రభుత్వం చేపట్టిన సర్వే ప్రకారం.. 22.76 లక్షల మందితో రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న జిల్లాగా కర్నూలు నిలిచింది. అధిక జనాభా కలిగిన అర్బన్ లోకల్ బాడీగా విశాఖపట్నం(16.27 లక్షలు), నియోజకవర్గ పరంగా భీమిలి(3.82 లక్షలు), మండలాల్లో రాజమహేంద్రవరం(1.66 లక్షలు) మొదటి స్థానాల్లో ఉన్నాయి. 13,225 మంది జనాభాతో కృష్ణా జిల్లాలోని కానూరు-5 సచివాలయం మొదటి స్థానంలో ఉంది. ఈ వివరాలేవీ బహిర్గతం చేయకుండా గోప్యంగా ఉంచారు.
సొంతవారికి సీట్లు తగ్గించాల్సి వస్తుందనే!
కాపా తరఫున ఎమ్మెల్యే అభ్యర్థుల కేటాయింపులో ఎన్నడూ లేనివిధంగా సామాజిక న్యాయాన్ని పాటించినట్లు జగన్ చెబుతున్నారు. నిజంగా ఆయా సామాజికవర్గాలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలన్న చిత్తశుద్ధి ఉంటే కులగణన సర్వే వివరాలను బయటపెట్టేవారే. కానీ కులాలను అడ్డుపెట్టుకుని ఆయన చేసేదంతా నటనే. సర్వే వివరాలు బహిర్గతం చేస్తే నియోజకవర్గాల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అసలు లెక్క తేలుతుంది. అప్పుడు ఆయన పప్పులు ఉడికే అవకాశం ఉండదు. చాలా నియోజకవర్గాల్లో తన సామాజికవర్గం వారికి సీట్లు దక్కే పరిస్థితి ఉండదు. ఇది జగన్కు ఇష్టముండదు కదా.. అందుకే సర్వేను బయటపెట్టలేదని రాజకీయ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానలతో చల్లబడిన వాతావరణం
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని రోజుల క్రితం వరకు ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన రాష్ట్రం చల్లబడింది. -
పశువైద్య సేవలకూ..వినియోగ రుసుములు?
పశు సంవర్ధక శాఖలో వినియోగ రుసుముల బాదుడుకు సర్కారు రంగం ‘సిద్ధం’ చేస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దీనిపై కార్యాచరణ రూపొందించి అమలు చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. -
ఏం చెప్పినా.. తందానతాన!
కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర కీలక స్థానాల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని ఏరికోరి నియమించిందీ ఆయనే..! కొన్ని జిల్లాల్లో వివాదాస్పద అధికారులున్నారని, వారు ఎన్నికల వేళ అధికార పార్టీతో అంటకాగుతున్నారన్న విపక్షాల ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా చోద్యం చూసిందీ ఆయనే..! తీరా ఎన్నికల సంఘం కన్నెర్ర చేస్తే.. -
పల్నాడు కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీ లఠ్కర్
రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను, ఒక జిల్లాకు కలెక్టర్ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ బాలాజీరావు లఠ్కర్, ఎస్పీగా మలికా గార్గ్, అనంతపురం ఎస్పీగా గౌతమి శాలి, తిరుపతి ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజును నియమించింది. -
ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాష్టీకం
జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్నందుకు ఏపీ పోలీసులు కక్షగట్టి తనను కొట్టడంతోపాటు అమానుషంగా ప్రవర్తించారని అమెరికా పౌరుడైన గుంటూరు జిల్లా వెంకటాపురానికి చెందిన డాక్టర్ ఉయ్యూరు లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలంగాణ ఎప్సెట్లో ఏపీ విద్యార్థుల విజయదుందుభి
తెలంగాణ ఎప్సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఎప్సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల ర్యాంకులను శనివారం ఆ రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి తదితరులు విడుదల చేశారు. -
రాజేంద్రనాథరెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు!
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున, ఆ తర్వాత చెలరేగిన హింసాకాండకు పూర్వ డీజీపీ, ప్రస్తుత ఏసీబీ డీజీ కేవీ రాజేంద్రనాథరెడ్డి నియమించిన అధికారులే కారణమని ఓ వైపు విమర్శలు వ్యక్తమవుతుంటే.. మళ్లీ ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందినే సిట్లో నియమించడమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు