ఇద్దరు ఎస్పీలపై వేటు ఖాయం!
ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలో రాజకీయ హత్యలు, హింస చెలరేగడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది.
పరమేశ్వరరెడ్డి, రవిశంకరరెడ్డిలపై త్వరలో చర్యలు
రాజకీయ హత్య, హింస చెలరేగడాన్ని తీవ్రంగా పరిగణించిన ఈసీ
మరికొందరు ఐఏఎస్, ఐపీఎస్లకు బదిలీలు!
ఒకటి, రెండు రోజుల్లో ఆదేశాలు!
ఈనాడు, అమరావతి: ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలో రాజకీయ హత్యలు, హింస చెలరేగడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. వీటికి బాధ్యులైన ప్రకాశం, పల్నాడు జిల్లాల ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, రవిశంకరరెడ్డిలపై వేటు వేయనుంది. వీరితో పాటు అధికార పార్టీతో అంటకాగుతున్నారనే ఫిర్యాదులున్న మరికొంత మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైనా చర్యలు తీసుకోనుంది. ఈ జాబితాలో కొన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఉండే అవకాశముంది. ఒకటి, రెండు రోజుల్లో ఈ మేరకు ఆదేశాలు వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే... ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో తెదేపా నాయకుడు మునయ్యను చంపేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెదేపా సానుభూతిపరుడు ఇమాం హుస్సేన్ను అంతమొందించారు. పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా కార్యకర్త ఇర్ల సురేష్ కారును దహనం చేశారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రకాశం, పల్నాడు, నంద్యాల జిల్లాల ఎస్పీలు పరమేశ్వరరెడ్డి, రవిశంకరరెడ్డి, రఘువీరారెడ్డి.. ఇటీవల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా ఎదుట వ్యక్తిగతంగా హాజరయ్యారు. రాజకీయ హత్యలు, హింసాత్మక ఘటనలపై వివరణ ఇచ్చి, పూర్తిస్థాయి నివేదికలు సమర్పించారు. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న సీఈవో.... అక్కడ ఏం జరిగింది? ఎవరి బాధ్యతారాహిత్యం వల్ల ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి? అనే అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్(సీఈసీ)కు నివేదిక పంపారు. ఈ నేపథ్యంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటూ ఒకటి, రెండు రోజుల్లో సీఈసీ ఆదేశాలిచ్చే అవకాశముంది. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు కొన్ని జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు అధికార వైకాపాకు అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులందాయి. వాటిపైనా విచారణ జరిపిన ఎన్నికల సంఘం... కొందరు అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. వారందర్నీ ఒకటి, రెండు రోజుల్లో ఆయా స్థానాల నుంచి బదిలీ చేయనున్నట్లు సమాచారం.
మోదీ సభలో భద్రతా వైఫల్యంపై సీఈసీకి నివేదిక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ‘ప్రజాగళం’ సభలో భద్రతా వైఫల్యంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం నివేదిక పంపించారు. ఆ రోజు సభలో భద్రత పరంగా ఏ లోపాలు చోటుచేసుకున్నాయి? వాటికి కారకులు ఎవరు? విధి నిర్వహణలో ఎవరెవరు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? తదితర అంశాలను ఆ నివేదికలో పొందుపరిచారు. ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలకు డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు, గుంటూరు ఐజీ పాలరాజు, పల్నాడు ఎస్పీ రవిశంకరరెడ్డిలే కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ నెల 18న భాజపా, తెదేపా, జనసేన నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్కు ఫిర్యాదు చేశారు. విధులు సరిగ్గా నిర్వహించక పోవటం, సహాయ నిరాకరణ వల్లే ఇబ్బందులు తలెత్తాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాని సభకు తగిన భద్రత కల్పించలేదని... రద్దీ నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణలను గాలి కొదిలేశారని పొందుపరిచారు. ఈ అంశాలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం... తక్షణమే సమగ్ర విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనాను ఇటీవల ఆదేశించింది. తదనుగుణంగా ఆయన విచారణ చేయించి నివేదిక పంపించారు. దాని ఆధారంగా కొంతమంది ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?