భారత్లో కూకా ఎస్3యూ ప్రో టీవీ ధర రూ.14,999
చైనా స్మార్ట్ టీవీ బ్రాండ్ కూకా మన దేశంలోకి అడుగుపెట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ వ్యవస్థ కూలిటా ఓఎస్తో పనిచేసే ఎస్3యూ ప్రో టీవీని దేశీయ....
దిల్లీ: చైనా స్మార్ట్ టీవీ బ్రాండ్ కూకా మన దేశంలోకి అడుగుపెట్టింది. కొత్తగా అభివృద్ధి చేసిన స్మార్ట్ టీవీ ఆపరేటింగ్ వ్యవస్థ కూలిటా ఓఎస్తో పనిచేసే ఎస్3యూ ప్రో టీవీని దేశీయ విపణిలోకి సంస్థ విడుదల చేసింది. ఈ టీవీ ధరను రూ.14,999గా నిర్ణయించారు. ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్పై ఇది లభిస్తుంది. ఈ నెల 4-6 తేదీల్లో ప్రత్యేక విక్రయాల సందర్భంగా రూ.12,999కే లభిస్తుందని కూకా తెలిపింది. ఎస్3యూపై ఏడాది సర్వీస్ వారెంటీ అందిస్తున్నామని, దేశవ్యాప్తంగా 50కు పైగా సేవా కేంద్రాల్లో సర్వీస్ పొందొచ్చని వివరించింది. కొత్త ఓఎస్ స్మార్ట్ టీవీ అనుభూతిని మారుస్తుందని కంపెనీ వెల్లడించింది. 2006లో ఏర్పాటైన కూకా సంస్థ ఐరోపా, ఆగ్నేయాసియాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి