‘WFH అనుమతిస్తున్న కంపెనీల ఆదాయాలే వేగంగా పెరుగుతున్నాయ్’
WFH: ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ సౌకర్యాన్ని ఇస్తున్న కంపెనీల ఆదాయాల్లో మెరుగైన వృద్ధి నమోదవుతున్నట్లు ఓ ప్రముఖ సర్వే తేల్చింది.
ఇంటర్నెట్ డెస్క్: కరోనా కష్టకాలంలో ‘వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH)’ విధానాన్ని అమలు చేసిన కంపెనీలు క్రమంగా దాన్ని ఉపసంహరించుకుంటున్నాయి. ఉద్యోగులంతా తిరిగి ఆఫీసులకు రావాలని ఆదేశిస్తున్నాయి. సుదీర్ఘకాలం ఇంటి నుంచి పని చేస్తుండడం వల్ల ఉత్పాదకత దెబ్బతింటోందని.. ఫలితంగా అది కంపెనీ ఆర్థిక ఫలితాలపై ప్రభావం చూపుతోందనేది సంస్థల వాదన. ఈ తరుణంలో ఓ ప్రముఖ సర్వే ఆసక్తికర విషయాన్ని బహిర్గతం చేసింది. రిమోట్ వర్కింగ్ (Remote Working)కు అనుమతి ఇచ్చిన కంపెనీల ఆదాయాల్లోనే గణనీయ వృద్ధి నమోదవుతోందనేది సర్వే సారాంశం.
ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ ‘బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్’, ఫ్లెక్స్ వర్క్ అడ్వైజర్ ‘స్కూప్ టెక్నాలజీస్’ కలిసి ఈ సర్వేను నిర్వహించాయి. టెక్నాలజీ నుంచి బీమా వరకు దాదాపు 20 రంగాల్లో విస్తరించి ఉన్న కంపెనీలను సర్వేలో భాగం చేశాయి. దాదాపు 554 కంపెనీలు దీంట్లో పాల్గొన్నాయి. ఇవి సుమారు 2.67 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిస్థాయి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే పూర్తిగా ఇంటి నుంచి పనిచేయడం (WFH) లేదా ఉద్యోగులకు వీలైనప్పుడు ఆఫీసుకు రావడం అనే విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఇలాంటి కంపెనీల విక్రయాలు 2020 నుంచి 2022 మధ్య 21 శాతం పెరిగినట్లు సర్వేలో తేలింది. అదే హైబ్రిడ్ లేదా పూర్తిస్థాయి ఆన్సైట్ విధానాన్ని అమలు చేస్తున్న సంస్థల్లో మాత్రం ఈ వృద్ధి 5 శాతంగానే నమోదైనట్లు వెల్లడైంది.
మరోవైపు పూర్తిగా ఆఫీసు నుంచే పనిచేయాలని ఉద్యోగులను ఆదేశించిన కంపెనీలతో పోలిస్తే కొన్ని రోజులైనా ఆఫీసుకు వచ్చే హైబ్రిడ్ విధానాన్ని (Hybrid Working) అమలు చేస్తున్న కంపెనీలు తమ ఆదాయాల్లో దాదాపు రెట్టింపు వృద్ధిని నమోదు చేసినట్లు సర్వే తెలిపింది. పూర్తిస్థాయి ఫ్లెక్సిబుల్ విధానాన్ని అమలు చేస్తున్న కంపెనీలు ఉద్యోగులను వేగంగా నియమించుకోగలుగుతున్నాయని పేర్కొంది. అలాగే సిబ్బంది అత్యధిక కాలం కంపెనీతోనే ఉంటున్నారని స్కూప్ సీఈఓ రాబ్ సాడో వెల్లడించారు. బహుశా ఈ కారణాల వల్లే ఆయా కంపెనీల ఆదాయం వేగంగా పెరుగుతోందని అభిప్రాయపడ్డారు.
వివిధ రకాల పని విధానాల ప్రభావాన్ని పోలుస్తూ ఈ మధ్య కాలంలో జరిగిన సర్వేల్లో ఇదే చాలా విస్తృతమైనది. గతంలో జరిగినప్పటికీ.. అవి కేవలం కొన్ని కంపెనీలకు లేదా కొన్ని రంగాలకే పరిమితమయ్యాయి. అమెరికాలో మెర్సర్ అనే సంస్థ నిర్వహించిన సర్వే కూడా ఇటీవల దాదాపు ఇలాంటి ఫలితాలనే వెల్లడించింది. వారంలో ఒకరోజు మాత్రమే ఆఫీసులో పనిచేస్తూ.. మిగిలిన రోజులు ఇంటి నుంచి వర్క్చేసే వారు అత్యంత స్ఫూర్తిమంతంగా ఉన్నారని పేర్కొంది. పైగా ఆ కంపెనీలతో ఉండడం వల్ల తమ కెరీర్ లక్ష్యాలను కూడా చేరుకుంటామని ఉద్యోగులు భావిస్తున్నట్లు తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. నోటీసులు, ఇంటిమేషన్లు తెలుసుకోవడం కోసం కొత్త ట్యాబ్ను ఐటీ శాఖ తీసుకొచ్చింది. -
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
యాపిల్ కంపెనీ ఐఓఎస్18తో కొత్తగా మార్కెట్లోకి తీసుకురానున్న ఐఫోన్లో ఏఐ సదుపాయాన్ని జోడించాలనుకుంటోంది. అందులో భాగంగా యాపిల్తో ఒప్పందం కుదుర్చుకోనుంది. -
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
Apple: ఐఫోన్ బ్యాటరీ లైఫ్ను మెరుగుపర్చేందుకు యాపిల్ కొన్ని టిప్స్ను అందించింది. వాటిపై ఓ లుక్కేయండి. -
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
భార్యను సుత్తితో కొట్టి.. పిల్లల్ని ఇంటి పైనుంచి తోసేసి..!
-
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!