Indian Rupee: రూపాయి.. పడిపోయింది
వరుసగా నాలుగో రోజూ రూపాయి క్షీణించింది. అంతే కాదు.. జీవన కాల కనిష్ఠానికి చేరింది. గురువారం ట్రేడింగ్లో డాలరుతో పోలిస్తే 10 పైసలు కోల్పోయి 83.23 వద్ద ముగిసింది.
ఆల్టైం కనిష్ఠానికి మన కరెన్సీ
డాలరు, చమురు ప్రభావంతోనే
వరుసగా నాలుగో రోజూ రూపాయి క్షీణించింది. అంతే కాదు.. జీవన కాల కనిష్ఠానికి చేరింది. గురువారం ట్రేడింగ్లో డాలరుతో పోలిస్తే 10 పైసలు కోల్పోయి 83.23 వద్ద ముగిసింది. దేశం నుంచి విదేశీ మూలధన పెట్టుబడులు బయటకు వెళ్లడం, అంతర్జాతీయంగా అమెరికన్ కరెన్సీ బలోపేతం కావడం ఇందుకు కారణాలుగా నిలిచాయి. అన్నిటికంటే మించి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం సెంటిమెంటును దెబ్బతీసిందని ఫారెక్స్ ట్రేడర్లు చెబుతున్నారు.
దేశీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల ధోరణి కనిపించడంతో రూపాయికి కొంత మేరైనా బలం దక్కిందని ఫారెక్స్ ట్రేడర్లు అంటున్నారు. చైనా నుంచి నిరుత్సాహకర వాణిజ్య గణాంకాలు వెలువడడం వల్ల కూడా రూపాయి ఒత్తిడికి లోనైంది. గతేడాది కనిష్ఠ స్థాయికి పడ్డ చైనీస్ యువాన్లో తాజా బలహీనతలు మన రూపాయి బలహీనపడేలా చేశాయి. మరో వైపు, స్టాక్మార్కెట్లలో విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్ఐఐలు) గురువారం నికర విక్రేతలుగా మారి రూ.758.55 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. చమురు తయారీ దేశాలు (ఒపెక్ ప్లస్ దేశాలు) డిసెంబరు వరకూ సరఫరా కోతను కొనసాగించాలని నిర్ణయించిన నేపథ్యంలో చమురు ధర పీపాకు 90 డాలర్లను అధిగమించిన సంగతి తెలిసిందే. వీటి ప్రభావంతో గురువారం ఇంటర్బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్లో మన దేశీయ కరెన్సీ డాలరుతో పోలిస్తే 83.15 వద్ద ప్రారంభమైంది. 83.12-83.23 మధ్య ఊగిసలాడింది. చివరకు ఆల్టైం కనిష్ఠమైన 83.23 వద్ద ముగిసింది. అంతక్రితం రోజు రూపాయి 9 పైసలు కోల్పోయి 83.13 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 21న సైతం ఇదే స్థాయి వద్ద భారతీయ కరెన్సీ ముగిసిన విషయం విదితమే.
ప్రతికూల ధోరణి కొనసాగొచ్చు
సోమవారం నుంచి గురువారం వరకు దేశీయ యూనిట్ 61 పైసలు కోల్పోయింది. ఈ నాలుగు రోజుల్లో వరుసగా 9, 33, 9, 10 పైసల చొప్పున క్షీణించింది. ఐరోపా గణాంకాలు డాలరుకు మరింత మద్దతును పలకవచ్చని విశ్లేషకులు అంటున్నారు. దీనికి తోడు అమెరికా ట్రెజరీ ప్రతిఫలాలు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు కూడా రూపాయిపై ఒత్తిడి పెంచొచ్చు. ఈ నేపథ్యంలో రూపాయి ప్రతికూల ధోరణిలోనే కొనసాగొచ్చని అంచనా వేస్తున్నారు.
ప్రభావం ఇలా..
రూపాయి బలహీనతల వల్ల దేశ దిగుమతి బిల్లులు (ముఖ్యంగా చమురుకు) పెరుగుతాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం పెరిగేందుకూ కారణంగా నిలవవచ్చు. ఆర్బీఐ వద్ద భారీ స్థాయిలో డాలరు నిల్వలుండడం ఊటరనిచ్చే అంశం. ఎక్స్ఛేంజీ మార్కెట్లో అమెరికా కరెన్సీని విక్రయించి రూపాయికి మద్దతును పలకవచ్చు. అయితే ఈ జోక్యం వల్ల ఊగిసలాటలు తగ్గుతాయి అంతే తప్ప విలువను నిర్ణయించలేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వెజ్ థాలీ ధర పెరిగింది.. నాన్ వెజ్ తగ్గింది.. ఎందుకిలా?
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో శాకాహారం ధర పెరిగింది. మాంసాహారం ధర తగ్గింది. ఎందుకిలా..? -
జాబ్ మార్కెట్ పైకి ఏఐ ‘సునామీ’.. IMF చీఫ్ వ్యాఖ్యలు!
IMF Chief on AI: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఐఎంఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాబ్ మార్కెట్పై సునామీలా విరుచుకుపడబోతోందన్నారు. -
మూడో రోజూ లాభాల్లో సూచీలు.. 22,200 ఎగువకు నిఫ్టీ
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 328 పాయింట్లు, నిఫ్టీ 113 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. -
టాటా ప్లేతో అమెజాన్ జట్టు.. ఇక DTHలోనూ ప్రైమ్ వీడియో
Tata Play: డీటీహెచ్ కస్టమర్లకు సైతం ఓటీటీ ప్రయోజనాలను అందించేందుకు టాటా ప్లే సిద్ధమైంది. అందుకోసం అమెజాన్ ప్రైమ్తో చేతులు కలిపింది. -
రికార్డు లాభాల్లో ప్రభుత్వ బ్యాంకులు.. 2023-24లో ₹1.4 లక్షల కోట్లు
ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు లాభాలను నమోదు చేశాయి. కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. -
టీవీఎస్ ఐక్యూబ్లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్ మోడల్
TVS iQube: టీవీఎస్ ఐక్యూబ్లో మరో రెండు కొత్త వేరియంట్లు వచ్చాయి. ఇప్పుడు బేస్ వేరియంట్ రూ.95 వేలకే లభించనుంది. -
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
GPT-4o: ఓపెన్ఏఐ కొత్త చాట్జీపీటీ వెర్షన్ను విడుదల చేసింది. దీంట్లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. గూగుల్ తమ జెమిని కొత్త వెర్షన్ను ప్రకటించనున్న తరుణంలో ఓపెన్ఏఐ దీన్ని తీసుకురావడం గమనార్హం. -
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 21,125
Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 72,836 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 21,125 దగ్గర కొనసాగుతోంది. -
జూన్ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయ్: అమిత్షా
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక, మన స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయనేే అభిప్రాయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు. అందువల్ల అంతకంటే ముందుగానే, ఎంపిక చేసుకున్న షేర్లను కొని పెట్టుకోవాల్సిందిగా మదుపర్లకు సూచించారు. -
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు బయోమెట్రిక్ ధ్రువీకరణ
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియ అమలు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
కాకినాడ నుంచి అంతర్జాతీయ విపణికి అమ్మోనియా!
నార్వేలోని ఓస్లో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యారా క్లీన్ అమ్మోనియా అనే సంస్థ, గ్రీన్కో గ్రూపునకు చెందిన కాకినాడ యూనిట్ నుంచి రెన్యూవబుల్ అమ్మోనియా కొనుగోలు చేయనుంది. -
2030 కల్లా 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్
దేశంలోని 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలంటే, భారత్కు రూ.4.2 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భారీ నష్టాల నుంచి లాభాల్లోకి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఆఖర్లో పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్ 910 పాయింట్లు కోలుకుంది. -
‘ వార్షిక సమాచార నివేదిక’లో కొత్త వెసులుబాటు
వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం సరికొత్త వెసులుబాటును తీసుకొచ్చింది. ఇందులో సమాచార ధ్రువీకరణ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునే వీలు కల్పించినట్లు తెలిపింది. -
ఎఫ్టీఏ దేశాల నుంచి భారత్కు దిగుమతులు 38% పెరిగాయ్
మనదేశంతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఉన్న యూఏఈ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి భారత్కు దిగుమతులు 2018-19లో 136.20 బిలియన్ డాలర్లుగా ఉండేవి. -
ఎయిరిండియా, విస్తారా ఉద్యోగులకు జూన్ కల్లా ఫిట్మెంట్!
ఎయిరిండియా, విస్తారాకు చెందిన 7,000కు పైగా ఉద్యోగులకు జూన్లో ఫిట్మెంట్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్నకు చెందిన ఈ రెండు విమానయాన సంస్థల విలీన ప్రక్రియ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. -
బుల్లెెట్ ఈవీపై తొందర లేదు
బుల్లెట్ బ్రాండ్పై మోటార్సైకిళ్లను విక్రయిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ‘అద్భుత’ విద్యుత్ వాహనాన్ని (ఈవీ) తీసుకు రావాలని ఆశిస్తోంది. అందువల్ల ఈవీల్లోకి ప్రవేశించేందుకు తొందరపాటుతో వ్యవహరించడం లేదని చెబుతోంది. -
జొమాటో లాభం రూ.175 కోట్లు
ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే సంస్థ జొమాటో, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.175 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.188 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
రాజ్ వట్టికూటి సంస్థలో వాటా కోసం పోటీలో అంతర్జాతీయ పీఈ సంస్థలు
అమెరికన్-భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయిన రాజ్ వట్టికూటికి చెందిన ప్యూర్-ప్లే డిజిటల్ సేవల కంపెనీ అల్టిమెట్రిక్లో మెజారిటీ వాటా కోసం అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థలు పోటీలో ఉన్నాయి. -
భారత్లో మరిన్ని ఎస్యూవీ మోడళ్లు తీసుకొస్తాం: సుజుకీ
కార్ల విభాగంలో తాము కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు భారత్లో స్పోర్ట్ వినియోగ వాహన (ఎస్యూవీ) మోడళ్ల సంఖ్యను పెంచుకుంటామని జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
డ్రోన్ల తయారీ సంస్థ దక్ష అన్మ్యాన్డ్ సిస్టమ్స్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ తన వాటా పెంచుకుంది. ఈ సంస్థలో ఇప్పటికే రెండు దఫాలుగా కోరమాండల్ ఇంటర్నేషనల్ పెట్టుబడి పెట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
వెజ్ థాలీ ధర పెరిగింది.. నాన్ వెజ్ తగ్గింది.. ఎందుకిలా?
-
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
-
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ
-
సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్’ డ్రోన్ల కలకలం!
-
అదే ఐపీఎల్ను మార్చేసింది..: రవిశాస్త్రి