Kotak Mahindra: కోటక్ మహీంద్రా బ్యాంక్కు కొత్త బాస్.. ఎవరీ అశోక్ వాస్వానీ?
Kotak Mahindra Bank New CEO Ashok Vaswan: కోటక్ మహీంద్రా బ్యాంక్ కొత్త సీఈఓగా అశోక్ వాస్వానీ నియమితులయ్యారు. ఆర్బీఐ ఇందుకు ఆమోదం తెలిపింది.
Kotak Mahindra | దిల్లీ: ప్రైవేటు రంగ ప్రముఖ బ్యాంక్ కోటక్ మహీంద్రాకు (Kotak Mahindra) కొత్త సీఈఓ, ఎండీగా ఇంటర్నేషనల్ బ్యాంకర్ అశోక్ వాస్వానీ (Ashok Vaswani) నియమితులయ్యారు. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు. ఈ నియామకానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదం తెలిపింది. కోటక్ బ్యాంక్ ఎండీగా ఉదయ్ కోటక్ వైదొలిగిన నేపథ్యంలో తాజా నియామకం చోటుచేసుకుంది. నియామకానికి షేర్ హోల్డర్లు ఆమోదం తెలపాల్సి ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ ఓ ప్రకటనలో పేర్కొంది. జనవరి 1లోగా అశోక్ వాస్వానీ బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎవరీ అశోక్ వాస్వానీ..?
అశోక్ వాస్వానీకి బ్యాంకింగ్ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. గతంలో అంతర్జాతీయ బ్యాంక్ సిటీ గ్రూప్లో పనిచేశారు. చివరగా బార్క్లేస్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గానూ వ్యవహరించారు. ప్రస్తుతం యూఎస్-ఇజ్రాయెల్ ఏఐ ఫిన్టెక్ పగాయా టెక్నాలజీస్ లిమిటెడ్కు ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ గ్రూప్, ఎస్పీ జైన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్మెంట్ (యూకే) బోర్డు సభ్యులుగానూ ఉన్నారు. ప్రథమ్, లెండ్ హ్యాండ్ వంటి దాతృత్వ సంస్థల్లో డైరెక్టర్గానూ వ్యవహరిస్తున్నారు. బాంబే యూనివర్సిటీ నుంచి కామర్స్, ఎకనమిక్స్, అకౌంటెన్సీలో బ్యాచిలర్ డిగ్రీ పొందిన వాస్వానీ.. సీఏ, సీఎస్ పూర్తి చేశారు. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ పూర్తి చేశారు.
ఇన్స్టా యూజర్లకు కొత్త ఫీచర్.. కామెంట్ సెక్షన్లో పోల్స్
సొంతింటికి వచ్చినట్లుంది: వాస్వానీ
కోటక్ బ్యాంక్ సీఈఓ, ఎండీగా నియమితులు కావడం పట్ల వాస్వానీ సంతోషం వ్యక్తంచేశారు. స్వదేశానికి తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాబోయే ఐదేళ్లలో ప్రపంచంలోని అగ్రశ్రేణి 3 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా భారత్ను నిలిపే ప్రయాణంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ తనవంతు పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రపంచస్థాయి బ్యాంకర్ అయిన అశోక్.. కోటక్ బ్యాంక్ను అద్భుతంగా తీర్చిదిద్దగలరని ఉదయ్ కోటక్ విశ్వాసం వ్యక్తంచేశారు. కోటక్ బ్యాంక్ను ఖాతాదారులకు అనుకూల సంస్థగా మార్చేందుకు అశోక్ అనుభవం అక్కరకొస్తుందని తాత్కాలిక ఎండీ, సీఈఓ దీపక్ గుప్తా పేర్కొన్నారు.
ఇదీ నేపథ్యం..
యెస్ బ్యాంక్ ఉదంతం నేపథ్యంలో ప్రైవేటు సెక్టార్ బ్యాంకుల మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల పదవీ కాలం 15 ఏళ్లు మించకూడదని ఆర్బీఐ పరిమితి విధించింది. ఈ నేపథ్యంలో ఉదయ్ కోటక్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న తన పదవికి రాజీనామా చేశారు. వాస్తవంగా డిసెంబర్ 31 వరకు ఆయన పదవీకాలం ఉన్నప్పటికీ.. ముందుగానే వైదొలిగారు. జాయింట్ ఎండీ దీపక్ గుప్తా తాత్కాలిక ఎండీగా నియమితులయ్యారు. సీఈఓగా బాధ్యతల నుంచి తప్పుకున్నా.. బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్యుడిగా ఉదయ్ కోటక్ కొనసాగుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది. -
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
Travel Classes: రైళ్లలో ప్రయాణం చేసే వారు వాటిలో తరగతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోండి.. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్