Nilekani: ఐఐటీ బాంబేకి నందన్ నీలేకని భూరి విరాళం
Nandan Nilekani- IIT Bombay: ఐఐటీ బాంబేకు నందన్ నీలేకని రూ.315 కోట్ల భూరి విరాళం ఇచ్చారు. ఐఐటీ-బితో తనకున్న అనుబంధం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విరాళం సమర్పించారు.
ముంబయి: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, ఛైర్మన్, ఆధార్ రూపకర్త నందన్ నీలేకని (Nandan Nilekani) పెద్ద మనసు చాటుకున్నారు. ప్రఖ్యాత విద్యా సంస్థ ఐఐటీ బాంబేకు (IIT Bombay) రూ.315 కోట్ల భూరి విరాళం సమర్పించారు. ఈ నిధులను ఐఐటీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు, ఇంజినీరింగ్, టెక్నాలజీలో పరిశోధనలు వంటి వాటికి వినియోగించనున్నారు. దేశంలో ఒక పూర్వ విద్యార్థి ఇంతమొత్తంలో విరాళం సమర్పించడం ఇదే ప్రథమం. గతంలోనూ ఐఐటీ బాంబేకు నందన్ నీలేకని రూ.85 కోట్లు విరాళం ఇచ్చారు.
ఐఐటీ బాంబే నుంచి 1973లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న నీలేకని.. ఐఐటీ బాంబేతో 50 ఏళ్లుగా తన అనుబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. 1999 నుంచి ఐఐటీ-బాంబే హెరిటేజ్ ఫౌండేషన్ బోర్డులో దశాబ్దం పాటు కొనసాగారు. 2005 నుంచి 2011 మధ్య గవర్నర్ల బోర్డులో ఒకరిగా ఉన్నారు. గతంలో కొత్త హాస్టల్ భవన నిర్మాణం, యూనివర్సిటీ ఇంక్యుబేటర్ నిర్మాణానికి రూ.85 కోట్లు నిధులు సమకూర్చారు. 1999లో ఐఐటీ బాంబే నుంచి అలుమ్నస్ అవార్డు, 2019లో గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు.
నాకెంతో ఇచ్చింది
‘‘ఐఐటీ-బాంబే నా జీవితంలో కీలక మలుపు. నా జీవితానికి ఇక్కడే పునాది పడింది. నన్ను ఎంతో తీర్చిదిద్దింది. ఈ విద్యా సంస్థతో నాది 50 ఏళ్ల అనుబంధం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో ఈ విరాళం ఇస్తున్నా’’ అని నీలేకని పేర్కొన్నారు. గ్లోబల్గా ఐఐటీ-బి ఎదగడానికి ఈ విరాళం ఎంతగానో ఉపయోగపడుతుందని ఐఐటీ బాంబే డైరెక్టర్ ప్రొఫెసర్ సుభాశిస్ చౌధురి పేర్కొన్నారు. దేశంలోని విశ్వవిద్యాలయాలలో పరిశోధన, అభివృద్ధికి దాతృత్వ సహకారం అందించడానికి నీలేకని సహకారం స్ఫూర్తిగా నిలవనుందని తెలిపారు. ఐఐటీ-బాంబే 1958లో స్థాపితమైంది. దేశంలో ఏర్పాటైన రెండో ఐఐటీ ఇదే. సుమారు 62,500 మంది ఇంజినీర్లు, సైంటిస్టులు ఈ సంస్థ నుంచి ఇప్పటివరకు గ్రాడ్యుయేట్లుగా పట్టాలు పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. నోటీసులు, ఇంటిమేషన్లు తెలుసుకోవడం కోసం కొత్త ట్యాబ్ను ఐటీ శాఖ తీసుకొచ్చింది. -
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
యాపిల్ కంపెనీ ఐఓఎస్18తో కొత్తగా మార్కెట్లోకి తీసుకురానున్న ఐఫోన్లో ఏఐ సదుపాయాన్ని జోడించాలనుకుంటోంది. అందులో భాగంగా యాపిల్తో ఒప్పందం కుదుర్చుకోనుంది. -
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
Apple: ఐఫోన్ బ్యాటరీ లైఫ్ను మెరుగుపర్చేందుకు యాపిల్ కొన్ని టిప్స్ను అందించింది. వాటిపై ఓ లుక్కేయండి. -
టాటా మోటార్స్ లాభం మూడింతలు
టాటా మోటార్స్, జనవరి- మార్చి త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.17,528.59 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే కాల లాభం రూ.5,496.04 కోట్లతో పోలిస్తే ఇది మూడు రెట్లకు పైగా ఎక్కువ. -
ఇక వెండి వంతు?
బంగారం ధర కొంతకాలంగా భారీగా పెరిగింది. రెండేళ్ల క్రితం బంగారంపై పెట్టుబడి పెట్టిన వారికి ఆకర్షణీయ లాభాలు వచ్చాయి. -
అక్షయ తృతీయ వేళ పెరిగిన బంగారం ధర
దేశీయంగా, అంతర్జాతీయంగా గిరాకీ కనిపించడంతో అక్షయ తృతీయ వేళ బంగారం ధర పెరిగింది. -
రాణించిన పారిశ్రామికం
దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. -
వరుస నష్టాల నుంచి ఉపశమనం
మూడు రోజుల వరుస నష్టాల నుంచి సూచీలు శుక్రవారం కోలుకున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, ఎయిర్టెల్ షేర్లు మార్కెట్లను ముందుండి నడిపించాయి. -
బ్యాంక్ ఆఫ్ బరోడా లాభం రూ.4,886 కోట్లు
జనవరి- మార్చి త్రైమాసికంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నికర లాభం స్టాండలోన్ ప్రాతిపదికన 2.3% పెరిగి రూ.4,886 కోట్లకు చేరింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.4,775 కోట్లుగా ఉంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ మరో 75 విమానాల రద్దు!
క్యాబిన్ సిబ్బంది కొరత కారణంగా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్ శుక్రవారం 75 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఆదివారానికల్లా కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోగలవని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. -
ఒక్క నెలలో రూ.12,384 కోట్లు
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఏప్రిల్లో రూ.12,384 కోట్ల ప్రీమియాన్ని వసూలు చేసినట్లు శుక్రవారం వెల్లడించింది. -
రూ.888కే జియో నుంచి 15 ఓటీటీలతో బ్రాడ్బ్యాండ్ ప్లాన్
నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లైట్, డిస్నీ+ హాట్స్టార్ వంటి 15 యాప్ల ప్రాథమిక సబ్స్క్రిప్షన్తో పాటు 30 ఎమ్బీపీఎస్ బ్రాడ్బ్యాండ్ను నెలకు రూ.888కు అందించే ఒక పథకాన్ని జియో ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు(7)
బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీఓఐ), గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రూ.1,439 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. -
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా (Harsh Goenka) నెట్టింట మరో ఫన్నీ పోస్టు పెట్టారు. అలాగే ఆయన షేర్ చేసిన చిత్రం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. -
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు
Reliance Jio: జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్ యూజర్ల కోసం జియో కొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.888 ప్లాన్తో 15 ఓటీటీలు కూడా లభిస్తాయి.
తాజా వార్తలు (Latest News)
-
భార్యను సుత్తితో కొట్టి.. పిల్లల్ని ఇంటి పైనుంచి తోసేసి..!
-
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!