Finance Ministry: ‘కనీస బ్యాలెన్స్’ ఛార్జీలు.. రూ.21వేల కోట్లు
Finance Ministry: కనీస బ్యాలెన్స్ ఉంచకపోవటంతో పాటూ ఏటీఎం లావాదేవీలు, ఎస్సెమ్మెస్ సేవలకు గానూ బ్యాంకులు వసూళ్ల వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
దిల్లీ: ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచని వినియోగదారులపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. దీంతో పాటు ఏటీఎం (ATM) లావాదేవీ ఛార్జీలు, ఎస్సెమ్మెస్ (SMS) ఛార్జీలు కూడా ఉంటాయి. ఇలా వసూలు చేసిన ఛార్జీల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో లిఖితపూర్వకంగా తెలిపింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఐదు ప్రధాన ప్రైవేట్ బ్యాంకులు కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్ము వివరాలను వెల్లడించింది. 2018 నుంచి ఇప్పటి వరకు రూ.35,000 కోట్లకు పైగా ఛార్జీలు వసూలు చేసినట్లు అందులో తెలిపింది.
ప్రభుత్వ బ్యాంకులతో పాటు యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (HDFC Bank), ఇండస్ఇండ్ బ్యాంక్ (IndusInd Bank), ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), ఐడీబీఐ బ్యాంకు (IDBI Bank) ల నుంచి కనీస బ్యాలెన్స్ ఉంచని కారణంగా రూ.21,000 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఏటీఎం లావాదేవీల కోసం రూ.8,000 కోట్లు, ఎస్సెమ్మెస్ సేవలు అందిస్తున్నందుకు రూ.6,000 కోట్లు సేకరించినట్లు అందులో తెలిపింది. కొన్ని రకాల ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ఉంచకపోతే వాటిపై బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. అయితే, ఈ ఛార్జీలు ప్రాంతాల వారీగా మారుతుంటాయి.
నెలవారీ సగటు బ్యాలెన్స్ (AMB) మెట్రో నగరాల్లో రూ.3,000 నుంచి రూ.10,000 వరకు ఉంటుంది. చిన్న నగరాల్లో రూ.2,000 నుంచి రూ.5,000 వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.500 నుంచి రూ.1,000 వరకు ఉంటుంది. అయితే, ఈ ఛార్జీలు బ్యాంకుల బట్టి మారుతూ ఉంటాయి. అయితే, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (Pradhan Mantri Jan Dhan Yojna) కింద తెరిచిన ఖాతాల్లో, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ ఉంచాల్సిన అవసరం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాక్ మార్కెట్... పెట్టుబడులు.. కాస్త అప్రమత్తంగా
ఎన్నికలు.. ఇతర కారణాలతో స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. ఒకవైపు అంతర్జాతీయ మదుపరులు మన మార్కెట్లపై నిరాశావాద దృక్పథంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణం అంటూ సానుకూల మాటలు.. -
జీవిత బీమా పన్ను ఆదాకు మించి
ఆదాయపు పన్ను మినహాయింపు గురించి ఆలోచించే వారు ముందుగా చూసేది బీమా పాలసీలనే. పన్ను ప్రణాళికలను ప్రారంభించాల్సిన సమయం కావడంతో బీమా సంస్థలూ ఇప్పుడు పలు కొత్త పాలసీలతో ముందుకు వస్తుంటాయి. -
సూపర్ టాపప్ తీసుకోవచ్చా?
నా వయసు 57. నాకు బృంద ఆరోగ్య బీమా ఉంది. దీనికి అదనంగా వ్యక్తిగతంగా మరో పాలసీ తీసుకుంటే బాగుంటుందా? లేదా సూపర్ టాపప్ను ఎంచుకోవాలా? -
కార్డు బాకీ తీర్చలేకపోతే
చేతిలో డబ్బులు లేకపోయినా వస్తువులను కొనుగోలు చేసేందుకు క్రెడిట్ కార్డులు వెసులుబాటును అందిస్తాయి. ఈ సౌలభ్యం కొన్నిసార్లు అధిక ఖర్చుకూ దారి తీస్తుంది. చివరకు గడువులోపు బిల్లు చెల్లించలేని పరిస్థితి వస్తుంది. -
కారు రుణం ముందే తీర్చేస్తే
అప్పు చేసి కారు కొంటాం.. మన దగ్గర అనుకోకుండా డబ్బు వచ్చి, ఈ రుణం తీర్చేయాలని అనుకున్నాం అనుకోండి.. అప్పుడు ఏం చేయాలో చూద్దామా.. -
దీర్ఘకాలంలో అధిక రాబడి
బజాజ్ ఫిన్సర్వ్ మ్యూచువల్ ఫండ్ ఒక కొత్త మ్యూచువల్ ఫండ్ పథకాన్ని తీసుకొచ్చింది. ‘బజాజ్ ఫిన్సర్వ్ మల్టీ అస్సెట్ అలకేషన్ ఫండ్’ అనే ఈ పథకం ఎన్ఎఫ్ఓ ఈ నెల 27వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!
PIN: పుట్టిన రోజు, ఫోన్ నంబర్, ‘‘1234’’, ‘‘0000’’.. ఇలా సులభమైన పిన్లను సెట్ చేసుకుంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్లే.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
-
ఆషికా ‘ఐస్ క్రీమ్ స్టోరీ’.. శ్రద్ధాదాస్ విహార యాత్ర
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
-
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
-
ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్లో ఛాన్స్.. వైష్ణవీ చైతన్య ఏమన్నారంటే?
-
వన్ టూ త్రీ ఫోర్.. ఇప్పటికీ అవే నాలుగంకెల పిన్స్!