RBI Rates: కీలక వడ్డీరేట్లు యథాతథమే
వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లలో ఆర్బీఐ (RBI) ఎలాంటి మార్పులు చేయలేదు. రెపోరేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు
ముంబయి: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమావేశ నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు. రెపోరేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి.
గత జూన్ సమావేశంలోనూ రెపో రేటు (Repo rate)ను ఎలాంటి మార్పు చేయకుండా 6.5 శాతంగా కొనసాగించారు. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం వరుసగా ఇది మూడోసారి. అంతకుముందు ద్రవ్యోల్బణాన్ని (Inflation) నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్ పాయింట్ల మేర ఆర్బీఐ పెంచింది.
ఈ సందర్భంగా గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు తెలిపారు. సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణను కొనసాగించాలని పరపతి విధాన కమిటీ నిర్ణయించినట్లు శక్తికాంత దాస్ తెలిపారు. ద్రవ్యోల్బణంపై ఎంపీసీ దృష్టి సారించిందని, అయితే ప్రస్తుతం ద్రవ్యోల్బణం ఆర్బీఐ లక్ష్యిత పరిధి అయిన 4 శాతం ఎగువనే ఉందని తెలిపారు. కీలక రేట్లపై నిర్ణయాన్ని తీసుకునేందుకు రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. జూన్లో రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త పెరిగి 4.81శాతంగా నమోదైంది.
వృద్ధి రేటు 6.5శాతం..
ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటును గత అంచనాలను అనుగుణంగా 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించినట్లు దాస్ తెలిపారు. వాణిజ్య రంగంలో వనరుల ప్రవాహం గతేడాది రూ.5.7లక్షల కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది అది రూ.7.5లక్షల కోట్లకు పెరిగిందని వెల్లడించారు. ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లుగా మారుతున్నాయని చెప్పారు. అయినప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగేందుకు వృద్ధి పథంలోనే పయనిస్తోందని ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.
ద్రవ్యోల్బణ అంచనాలు..
టమాటాలు, పప్పుధాన్యాల ధరలు విపరీతరంగా పెరగడంతో ఈ ఏడాది రిటైల్ ద్రవ్యల్బోణ అంచనాలను ఆర్బీఐ సవరించింది. గతంలో ఈ అంచనాలు 5.1శాతంగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 5.4శాతానికి పెంచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6.2శాతం, మూడో త్రైమాసికంలో 5.7శాతం, నాలుగో త్రైమాసికంలో 5.2శాతం ఉండనున్నట్లు అంచనా వేసింది.
ఎంపీసీ సమావేశంలో ఇతర కీలకాంశాలు..
- రూ.2వేల నోట్ల ఉపసంహరణ, కేంద్రానికి డివిడెంట్తో మిగులు ద్రవ్యం పెరిగింది.
- దేశ ఆర్థిక రంగం స్థిరంగా కోలుకుంటోంది. సవాళ్ల నుంచి ఈ రంగాన్ని కాపాడేందుకు ఆర్బీఐ కృతనిశ్చయంతో ఉంది.
- ఈ ఏడాది ఏప్రిల్- మే కాలంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) 5.5 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. గతేడాది ఇదే కాలంలో ఈ ఎఫ్డీఐలు 10.6 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
- ఈ ఏడాది జనవరి నుంచి రూపాయి విలువ స్థిరంగా కొనసాగుతోంది. విదేశీ మారక నిల్వలు 600 బిలియన్ డాలర్లను దాటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
Amazon: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేసింది. మే 2 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుందని ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వెల్లడించింది. -
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
మారుతీ సుజుకీ త్వరలోనే అందుబాటు ధరలో హైబ్రిడ్ కార్లను తీసుకురావడంపై పని చేస్తోంది. -
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య నానాటికీ తగ్గుతోంది. గత ఆర్థిక సంవత్సరంలో టాప్-5 ఐటీ సంస్థల్లోనే ఉద్యోగుల సంఖ్య 69 వేల వరకు తగ్గింది. -
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
గూగుల్లో ఉద్యోగం మొదలుపెట్టి 20 ఏళ్లు అయిందని సీఈఓ సుందర్ పిచాయ్ (Sundar Pichai) వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టు పెట్టారు. -
మహిళా ఆవిష్కర్తలు పెరగాలి
మనదేశంలో మహిళా ఆవిష్కర్తల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని, ఈ అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. -
వరుస లాభాలకు విరామం
సూచీల అయిదు రోజుల లాభాల ర్యాలీకి కళ్లెం పడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించారు. -
2047 నాటికి ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
తెలంగాణ 2047 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల (రూ.85 లక్షల కోట్ల) ఆర్థిక వ్యవస్థగా మారేందుకు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తన వంతు పాత్ర పోషిస్తుందని సీఐఐ తెలంగాణ ఛైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి డి ప్రసాద్ అన్నారు. -
హార్లిక్స్ ‘హెల్త్ డ్రింక్’ కాదు
హిందుస్థాన్ యునిలీవర్(హెచ్యూఎల్) తన బ్రాండ్ హార్లిక్స్ లేబుల్పై కీలక మార్పులు చేసింది. గతంలో ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరిలో ఉన్న హార్లిక్స్ను ‘ఫంక్షనల్ న్యూట్రిషనల్ డ్రింక్స్’ కేటగిరిలోకి మార్చింది. -
రిలయన్స్కు రేటింగ్ సంస్థల ‘జై’
2024 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బలమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్కు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు ఎస్ అండ్ పీ, ఫిచ్ జై కొట్టాయి. -
భారత జీడీపీ వృద్ధి 6.6 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25)లో భారత జీడీపీ వృద్ధి 6.6 శాతంగా నమోదుకావొచ్చని డెలాయిట్ ఇండియా అంచనా వేసింది. -
మారుతీకి విక్రయాల జోష్
జనవరి-మార్చి త్రైమాసికంలో మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం 47.8 శాతం పెరిగి రూ.3,877.70 కోట్లుగా నమోదైంది. -
హెచ్సీఎల్ టెక్ లాభం రూ.3,986 కోట్లు
దేశంలో మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్ జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.3,986 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ.3,983 కోట్లుగా ఉంది. -
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు ఎస్ఎఫ్బీల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
పూర్తి స్థాయి బ్యాంకులుగా మారేందుకు నిర్దేశిత అర్హతలను కలిగి ఉన్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల (ఎస్ఎఫ్బీ) నుంచి దరఖాస్తులను ఆహ్వానించినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. -
సంక్షిప్త వార్తలు(6)
అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (ఏహెచ్ఈఎల్) అనుబంధ సంస్థ అపోలో హెల్త్కో లిమిటెడ్(అపోలో 24/7)కు రూ.2,475 కోట్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చాయి. -
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
Flipkart: ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య కలచివేసింది: సీవీ ఆనంద్
-
డ్రగ్ తయారీ మాఫియా గుట్టురట్టు.. 300 కేజీలు స్వాధీనం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పోరాడి ఓడిన ముంబయి.. దిల్లీ ఖాతాలో ఐదో విజయం
-
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
-
లోన్ యాప్ వేధింపులకు బీటెక్ విద్యార్థి బలి