అంకుర సంస్థలు పదేళ్లలో 300రెట్లు పెరిగాయ్: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
2014లో కేవలం 350 మాత్రమే ఉన్న అంకుర సంస్థలు నేడు 300 రెట్లు పెరిగాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
దిల్లీ: పదేళ్ల క్రితం కేవలం 350గా మాత్రమే ఉన్న అంకుర సంస్థల సంఖ్య నేడు 300 రెట్లు పెరిగిందని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే ఇది సాధ్యమైందని చెప్పారు. భారత్ నేడు ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థను కలిగి ఉందని ‘పీటీఐ’ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న యూనికార్న్లకు నిలయంగా మారిందన్నారు.
‘‘కేవలం ప్రభుత్వ ఉద్యోగమే ఉపాధి కాదనే దిశగా యువతను జాగృతపరిచేందుకు చర్యలు తీసుకున్న ప్రధాని మోదీ.. దానికంటే మెరుగైన జీవనాన్ని అందించే సరికొత్త అవకాశాలను ప్రోత్సహించారు. అంతరిక్ష రంగంలో సరికొత్త అవకాశాలకు తెరతీశారు. గతేడాది చంద్రయాన్-3తో జాబిల్లి దక్షిణ ధృవంపై భారత్ కాలుమోపింది. అదే విధంగా ఆదిత్య ఎల్1 మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది. అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలకు స్థానం కల్పించడంతో కేవలం నాలుగేళ్లలోనే స్పేస్ స్టార్టప్ల సంఖ్య సింగిల్ డిజిట్ నుంచి నాలుగంకెలకు చేరింది’’ అని కేంద్ర మంత్రి మోదీని కొనియాడారు.
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
‘‘ మోదీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల అంతరిక్షం, రైల్వేలు, రోడ్లు, మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లతో సహా అనేక రంగాలు వృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. 11వ స్థానంలో ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఐదో స్థానికి ఎగబాకింది. త్వరలోనే మూడో స్థానానికి చేరుతుంది. 2047 నాటికి మొదటి స్థానంలో నిలుస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని సాధారణ పౌరులు సైతం విశ్వసిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 21,125
Stock Market Opening bell: ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 72,836 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 21,125 దగ్గర కొనసాగుతోంది. -
జూన్ 4న స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయ్: అమిత్షా
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక, మన స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తాయనేే అభిప్రాయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యక్తం చేశారు. అందువల్ల అంతకంటే ముందుగానే, ఎంపిక చేసుకున్న షేర్లను కొని పెట్టుకోవాల్సిందిగా మదుపర్లకు సూచించారు. -
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు బయోమెట్రిక్ ధ్రువీకరణ
జీఎస్టీ రిజిస్ట్రేషన్కు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధ్రువీకరణ ప్రక్రియ అమలు చేసేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేసినట్లు ఓ అధికారి తెలిపారు. -
కాకినాడ నుంచి అంతర్జాతీయ విపణికి అమ్మోనియా!
నార్వేలోని ఓస్లో కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న యారా క్లీన్ అమ్మోనియా అనే సంస్థ, గ్రీన్కో గ్రూపునకు చెందిన కాకినాడ యూనిట్ నుంచి రెన్యూవబుల్ అమ్మోనియా కొనుగోలు చేయనుంది. -
2030 కల్లా 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్
దేశంలోని 24 కోట్ల ఇళ్లకు బ్రాడ్బ్యాండ్ సేవలు అందించాలంటే, భారత్కు రూ.4.2 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
భారీ నష్టాల నుంచి లాభాల్లోకి
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ షేర్లకు కొనుగోళ్ల మద్దతుతో సూచీలు ఆఖర్లో పుంజుకుని లాభాల్లోకి వచ్చాయి. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి సెన్సెక్స్ 910 పాయింట్లు కోలుకుంది. -
‘ వార్షిక సమాచార నివేదిక’లో కొత్త వెసులుబాటు
వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్)లో ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం సరికొత్త వెసులుబాటును తీసుకొచ్చింది. ఇందులో సమాచార ధ్రువీకరణ ప్రక్రియ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునే వీలు కల్పించినట్లు తెలిపింది. -
ఎఫ్టీఏ దేశాల నుంచి భారత్కు దిగుమతులు 38% పెరిగాయ్
మనదేశంతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్టీఏ) ఉన్న యూఏఈ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశాల నుంచి భారత్కు దిగుమతులు 2018-19లో 136.20 బిలియన్ డాలర్లుగా ఉండేవి. -
ఎయిరిండియా, విస్తారా ఉద్యోగులకు జూన్ కల్లా ఫిట్మెంట్!
ఎయిరిండియా, విస్తారాకు చెందిన 7,000కు పైగా ఉద్యోగులకు జూన్లో ఫిట్మెంట్ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. టాటా గ్రూప్నకు చెందిన ఈ రెండు విమానయాన సంస్థల విలీన ప్రక్రియ నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. -
బుల్లెెట్ ఈవీపై తొందర లేదు
బుల్లెట్ బ్రాండ్పై మోటార్సైకిళ్లను విక్రయిస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ ఒక ‘అద్భుత’ విద్యుత్ వాహనాన్ని (ఈవీ) తీసుకు రావాలని ఆశిస్తోంది. అందువల్ల ఈవీల్లోకి ప్రవేశించేందుకు తొందరపాటుతో వ్యవహరించడం లేదని చెబుతోంది. -
జొమాటో లాభం రూ.175 కోట్లు
ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని, ఆహారాన్ని సరఫరా చేసే సంస్థ జొమాటో, జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.175 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. 2022-23 ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.188 కోట్ల నష్టాన్ని చవిచూసింది. -
రాజ్ వట్టికూటి సంస్థలో వాటా కోసం పోటీలో అంతర్జాతీయ పీఈ సంస్థలు
అమెరికన్-భారతీయ ఔత్సాహిక పారిశ్రామికవేత్త అయిన రాజ్ వట్టికూటికి చెందిన ప్యూర్-ప్లే డిజిటల్ సేవల కంపెనీ అల్టిమెట్రిక్లో మెజారిటీ వాటా కోసం అంతర్జాతీయ ప్రైవేటు ఈక్విటీ(పీఈ) సంస్థలు పోటీలో ఉన్నాయి. -
భారత్లో మరిన్ని ఎస్యూవీ మోడళ్లు తీసుకొస్తాం: సుజుకీ
కార్ల విభాగంలో తాము కోల్పోయిన మార్కెట్ వాటాను తిరిగి పొందేందుకు భారత్లో స్పోర్ట్ వినియోగ వాహన (ఎస్యూవీ) మోడళ్ల సంఖ్యను పెంచుకుంటామని జపాన్కు చెందిన సుజుకీ మోటార్ కార్పొరేషన్ వెల్లడించింది. -
సంక్షిప్త వార్తలు(7)
డ్రోన్ల తయారీ సంస్థ దక్ష అన్మ్యాన్డ్ సిస్టమ్స్లో కోరమాండల్ ఇంటర్నేషనల్ తన వాటా పెంచుకుంది. ఈ సంస్థలో ఇప్పటికే రెండు దఫాలుగా కోరమాండల్ ఇంటర్నేషనల్ పెట్టుబడి పెట్టింది. -
రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఈవీ రాక ఆలస్యం? కారణం ఇదే..!
Royal Enfield: రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి విద్యుత్ ద్విచక్ర వాహనం రాక ఆలస్యం కానుంది. అందుకు గల కారణాలను ఆ కంపెనీ ఎండీ వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు
-
టీ20 వరల్డ్కప్.. హార్దిక్ను ఎంపిక చేయడం రోహిత్కు ఇష్టం లేదా..?
-
సీఎం ఇంట్లో ఎంపీపై దాడి: ఎవరీ బిభవ్ కుమార్..?
-
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
-
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
-
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ‘మహా’తలపోటు