Swiggy: ఉద్యోగులకు స్విగ్గీ గుడ్న్యూస్.. స్టాక్ ఆప్షన్ల బైబ్యాక్
ఆహార పంపిణీ సంస్థ స్విగ్గీ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్ కింద కేటాయించిన షేర్లను బైబ్యాక్ చేస్తున్నట్లు వెల్లడించింది.
ఇంటర్నెట్డెస్క్: ఆహారం, నిత్యావసరాల సరఫరా సంస్థ స్విగ్గీ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. తమ ఉద్యోగుల వద్ద ఉన్న 50 మిలియన్ డాలర్లు (రూ.409 కోట్లు) విలువైన ఈఎస్ఓపీ (ఎంప్లాయిస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్) వాటాలను కొనుగోలు చేయనుంది. భారత స్టార్టప్లలో ఫండింగ్ మందగించడంతో చాలా సంస్థలు నిధుల ఆదా.. లేదా నిధుల అవకాశాలను పెంచుకొంటున్న వేళ స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకొంది. స్విగ్గీ వద్ద ఉన్న మొత్తం 5,000 మందిలో 2,000 మంది నుంచి ఈ స్టాక్స్ను కొనుగోలు చేస్తున్నారు. వీరిలో డైన్ఔట్ నుంచి వచ్చిన ఉద్యోగులు కూడా ఉన్నారు.
2021లో ఈఎస్ఓపీ షేర్లను కొనుగోలు చేస్తామని స్విగ్గీ ప్రకటించింది. 2021, 2022లో ఉద్యోగుల పనితీరుకు నజరానాగా ఈ నిర్ణయం తీసుకొంటామని పేర్కొంది. 2018 నుంచి మొత్తం నాలుగు సార్లు ఈఎస్ఓపీలను బైబ్యాక్ చేసింది. ప్రతిసారి ఈ బైబ్యాక్ మొత్తాన్ని పెంచుకొంటూ వస్తోంది. 2018లో 4 మిలియన్ డాలర్లు విలువైన షేర్లను కొనుగోలు చేయగా.. ఆ తర్వాత సంవత్సరంలో 9 మిలియన్ డాలర్లను బైబ్యాక్ చేసింది. ఇక 2022లో 23 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసింది. తాజాగా ఈ మొత్తం 50 మిలియన్ డాలర్లకు చేరింది.
ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.15శాతం.. కేంద్రం ఓకే
‘‘మా బృందమే అత్యంత విలువైన ఆస్తి. మా ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంది. ఈ విజయాన్ని పంచుకొనేలా.. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకొంటున్నాం’’ అని స్విగ్గీ మానవ వనరుల విభాగం అధిపతి గిరీష్ మేనన్ వెల్లడించారు. ఎంత రేటు వద్ద స్విగ్గీ ఈ షేర్లను కొనుగోలు చేస్తోందో మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం స్విగ్గీ మార్కెట్ విలువ జొమాటో విలువతో సమానంగా ఉంటుందని మార్కెట్ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. గతేడాది ఫండ్స్ సమీకరణ సమయంలో స్విగ్గీ విలువ 10.7 బిలియన్ డాలర్లుగా అంచనావేశారు. కానీ, ఆ తర్వాత పలు కారణాలతో ఈ సంస్థ విలువను తగ్గించారు. మరో వైపు కంపెనీ సీఈవో శ్రీహర్ష మాజేటీ మాట్లాడుతూ కంపెనీ ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉందన్నారు. డైన్ఔట్, ఇన్స్టామార్ట్ వంటివి నిలకడగా అభివృద్ధి చెందుతున్నాయని వెల్లడించారు.
ఈ నిర్ణయంతో తమ ఉద్యోగులకు రివార్డులు అందించిన స్టార్టప్ల జాబితాలో స్విగ్గీ కూడా చేరింది. ఈ నెల మొదట్లో ప్రముఖ ఆన్లైన్ మార్కెటింగ్ సంస్థ ఫ్లిప్కార్ట్ 19,000 మంది ఉద్యోగులకు దాదాపు 700 మిలియన్ డాలర్లను చెల్లించింది. ఫోన్పే నుంచి విడిపోయిన వెంటనే ఈ నిర్ణయం తీసుకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నష్టాల నుంచి లాభాల్లోకి.. 900 పాయింట్లు పుంజుకున్న సెన్సెక్స్
Stock market: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 111 పాయింట్లు, నిఫ్టీ 48 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. -
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 400 పాయింట్లు కుంగిన సెన్సెక్స్
Stock Market Opening bell: ఉదయం 9:31 గంటల సమయంలో సెన్సెక్స్ 404 పాయింట్ల నష్టంతో 72,260 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 105 పాయింట్లు కుంగి 21,949 దగ్గర కొనసాగుతోంది. -
ఇంధన కంపెనీలకు లాభాలే లాభాలు!
ప్రభుత్వ రంగ ఇంధన రిటైల్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)లు 2023-24 పూర్తి ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.81,000 కోట్ల భారీ లాభాలు ఆర్జించాయి. -
2024-25లో అదానీ ఎంటర్ప్రైజెస్
అదానీ ఎంటర్ప్రైజెస్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.80,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కంపెనీ డిప్యూటీ ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్ఓ) సౌరభ్ షా వెల్లడించారు. -
లాభాలు రావొచ్చు కానీ..
గత వారంలో కొద్ది రోజుల పాటు నష్టపోయిన సూచీలు ఈ వారం తిరిగి పుంజుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల ఫలితాల ముందు అప్రమత్తతతో పాటు విదేశీ మదుపర్లు స్థిరంగా విక్రయాలు జరుపుతుండడం వల్ల లాభాలు పరిమితంగానే కనిపించొచ్చని అంటున్నారు. -
పసుపు ప్రతికూలమే!
పసిడి జూన్ కాంట్రాక్టు ఈవారం సానుకూల ధోరణిలో చలిస్తే రూ.73,460 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.74,193, రూ.75,499 వరకు రాణించే అవకాశం ఉంటుంది. -
71,816 దిగువన దిద్దుబాటు!
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ గత వారం మన మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అంచనాలపై అనిశ్చితి, కంపెనీలు ప్రకటించిన ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపర్చడం ఇందుకు కారణమయ్యాయి. -
నియామకాల్లో 85% ఇంజినీరింగ్ పట్టభద్రులకే
ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో దేశీయ అతి పెద్ద బ్యాంక్ ఎస్బీఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)లో చేరబోయే 12,000 మంది తాజా ఉత్తీర్ణుల్లో 85 శాతం మంది ఇంజినీరింగ్ పట్టభద్రులే ఉంటారని బ్యాంక్ ఛైర్మన్ దినేశ్ ఖరా వెల్లడించారు. -
భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యంలో అమెరికాను వెనక్కినెట్టిన చైనా
గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో భారత్కు చైనా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. తద్వారా ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న అమెరికాను వెనక్కినెట్టింది. -
సీఎన్జీ కార్ల అమ్మకాలు 30 శాతానికి పైగా పెరగొచ్చు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) తమ సీఎన్జీ కార్ల అమ్మకాలు 30 శాతానికి పైగా పెరిగి 6 లక్షల వాహనాలుగా నమోదయ్యే అవకాశం ఉందని మారుతీ సుజుకీ అంచనా వేస్తోంది. -
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమాన సేవల పునరుద్ధరణ
టాటా గ్రూప్నకు చెందిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తన విమాన సేవలను క్రమంగా పునరుద్ధరిస్తోంది. రద్దయిన విమానాల సంఖ్య ఆదివారం నాటికి 20కి తగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీయా.. ఉసేన్ బోల్టా..? మైదానంలో విరాట్ సంబరాలే వేరు..
-
ప్రపంచంలో అతడొక్కడే.. హిరోషిమా, నాగసాకి అణుదాడులకు గురై జీవించిన వ్యక్తి..!
-
కిమ్ రాజ్యంలో రెడ్ లిప్స్టిక్పై నిషేధం.. ఎందుకంటే?
-
వేసవి రద్దీ.. విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
-
స్వాతీమాలీవాల్పై దాడి..! దిల్లీ సీఎం నివాసం బాక్సింగ్ రింగ్లా మారిందన్న భాజపా
-
‘దుమ్మురేపిన’ గాలివాన.. ముంబయిలో మెట్రో, సబ్అర్బన్ సర్వీసులకు అంతరాయం