FasTag: పేటీఎం ఫాస్టాగ్ వాడుతున్నారా? ప్రత్యామ్నాయాలు ఇవే..!
పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ జారీ చేసిన ఫాస్టాగ్లు త్వరలో చెల్లుబాటుకాకుండా పోనున్నాయి. దీంతో కొత్తవి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలు ఇవీ..
ఇంటర్నెట్ డెస్క్: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm payments bank) జారీ చేసిన ఫాస్టాగ్ (FasTag) వాడుతున్నారా? అయితే, త్వరలో మీరు కొత్తది కొనుగోలు చేయాల్సిందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఆ ఫాస్టాగ్లను మార్చి 15 తర్వాత రీఛార్జి చేయడానికి కుదరదు. అందులో నగదు పూర్తయ్యే వరకే వినియోగించే వెసులుబాటు ఉంది. ఇప్పటికే భారతీయ రహదారుల నిర్వహణ కంపెనీ (IHMCL).. ఫాస్టాగ్ జారీ చేసే అధీకృత బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (PPBL)ను తొలగించింది. కాబట్టి పేటీఎం ఫాస్టాగ్స్ను వాడుతున్నవారు.. కొత్త వాటికి మారాల్సి ఉంటుంది. కొత్త ఫాస్టాగ్కు తొలుత జాయినింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కొంత మొత్తం సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాలి. ఫాస్టాగ్ వద్దనుకున్నప్పుడు ఈ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. ఆపై ఫాస్టాగ్ను ఎప్పటికప్పుడు రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది.
ఎఫ్డీ కంటే అధిక వడ్డీ.. పైగా పన్ను మినహాయింపు.. VPF ప్రయోజనాలివే..!
ప్రత్యామ్నాయాలు ఇవీ..
- NHAI ఫాస్టాగ్: జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) స్వయంగా ఫాస్టాగ్లను జారీ చేస్తోంది. ఇది ప్రత్యేకంగా ఏ బ్యాంకుకూ అనుసంధానమై ఉండదు. టోల్ ప్లాజాలు, పెట్రోల్ పంపులు వద్ద వీటిని కొనుగోలు చేయొచ్చు. ‘మై ఫాస్టాగ్’ యాప్ ద్వారా లేదా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఇ-కామర్స్ సంస్థల నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు.
- ఎస్బీఐ ఫాస్టాగ్ : ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు (SBI) చెందిన ఫాస్టాగ్ను ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో తీసుకోవచ్చు. ఇందుకోసం వన్టైమ్ ఫీజు కింద రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. రూ.200 సెక్యూరిటీ డిపాజిట్ కింద చెల్లించాల్సి ఉంటుంది. రూ.100తో కనీస రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్ఠంగా రూ.లక్ష వరకు రీఛార్జి చేసుకోవచ్చు.
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫాస్టాగ్: ప్రైవేటు రంగానికి హెచ్డీఎఫ్ సైతం ఫాస్టాగ్లను జారీ చేస్తోంది. రూ.100 వన్టైమ్ ఫీజు కింద చెల్లించాలి. మరో రూ.100 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. రూ.100 నుంచి రూ.లక్ష వరకు ఎంతైనా రీఛార్జి చేసుకోవచ్చు. బ్యాంక్ వెబ్సైట్ లేదా దగ్గర్లోని బ్యాంక్ శాఖకు వెళ్లి పొందొచ్చు.
- ఐసీఐసీఐ బ్యాంక్ ఫాస్టాగ్: ఐసీఐసీఐ ఫాస్టాగ్ను బ్యాంక్ వెబ్సైట్ ద్వారా గానీ, బ్రాంచ్లో గానీ పొందొచ్చు. ఈ బ్యాంక్లో జాయినింగ్ ఫీజు రూ.100, సెక్యూరిటీ డిపాజిట్ రూ.200గా ఉంది.
- యాక్సిస్ బ్యాంక్ ఫాస్టాగ్: ఇతర బ్యాంకుల మాదిరిగానే ఫాస్టాగ్కు యాక్సిస్ బ్యాంక్లో తొలిసారి రూ.100 చెల్లించాలి. ఆపై సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.200 చెల్లించాలి. బ్యాంక్ వెబ్సైట్, బ్యాంక్ శాఖ వద్ద ఫాస్టాగ్ను పొందొచ్చు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ రూ.100 చెల్లిస్తే ఫాస్టాగ్ జారీ చేస్తుంది. సెక్యూరిటీ డిపాజిట్ రూ.150 చెల్లించాలి.
ఇవికాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, ఐడీబీఐ, కోటక్ మహీంద్రా, ఇండస్ ఇండ్, పంజాబ్ నేషనల్ వంటి కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఫాస్టాగ్లను జారీ చేస్తున్నాయి. ఆయా బ్యాంక్ వెబ్సైట్లలోకి వెళ్లి ఫాస్టాగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దాదాపు అన్ని బ్యాంకులూ ఇదే తరహా ఫీజును వసూలు చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్పత్తి రంగంపై విశ్వాసం ఉంటే....
ఉత్పత్తి రంగంలో అందివస్తున్న నూతన అవకాశాలను అందిపుచ్చుకోవటం ద్వారా అధిక లాభాలు ఆర్జించే లక్ష్యంతో మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్ కొత్తగా ‘మోతీలాల్ ఓస్వాల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫండ్’ అనే పథకాన్ని తీసుకువచ్చింది. -
ఈవీ ఈటీఎఫ్లలో..
గ్రో మ్యూచువల్ ఫండ్ ఒకేసారి రెండు ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్)లను ఆవిష్కరించింది. గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్, గ్రో నిఫ్టీ ఈవీ అండ్ న్యూఏజ్ ఆటోమోటివ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ (ఫండ్ ఆఫ్ ఫండ్) అనే రెండు కొత్త పథకాల ఎన్ఎఫ్ఓ వచ్చే నెల 2వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. -
మధ్యస్థాయి కంపెనీల్లో
కోటక్ మహీంద్రా మ్యూచువల్ ఫండ్ నుంచి ఒక కొత్త పథకం ‘కోటక్ నిఫ్టీ మిడ్క్యాప్ 50 ఇండెక్స్ ఫండ్’ అందుబాటులోకి వచ్చింది. -
రైళ్లలో 3A, 2A గురించి తెలుసు.. మరి ఈ 3E, EA మాటేంటి?
Travel Classes: రైళ్లలో ప్రయాణం చేసే వారు వాటిలో తరగతుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఆ వివరాలు తెలుసుకోండి.. -
కొత్తగా.. రిటర్నులు దాఖలు చేస్తున్నారా?
ఆదాయపు పన్ను రిటర్నులపై కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి అవగాహన తక్కువే ఉంటుంది. కాబట్టి, ముందుగా దీన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. -
ఈపీఎస్లో మార్పులు.. 6 నెలల సర్వీసు లేకున్నా విత్డ్రా ప్రయోజనాలు
EPS rule: ఈపీఎస్ విత్డ్రాకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేసింది. -
విద్యుత్ వాహన కంపెనీల్లో
విద్యుత్తు వాహనాల (ఈవీ) రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు లాభదాయకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం విద్యుత్తు వాహనాల వినియోగం శరవేగంగా పెరుగుతూ ఉండటమే -
ఈ-టికెట్ల బుకింగ్.. ఆ ప్రచారం అవాస్తవం: రైల్వేశాఖ ప్రకటన
రైల్వే ఈ-టికెట్ల బుకింగ్పై జరుగుతోన్న ప్రచారంపై రైల్వే మంత్రిత్వశాఖ స్పందించింది. -
ఐఆర్సీటీసీ.. వ్యక్తిగత ఐడీతో టికెట్ బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే చిక్కులే!
వ్యక్తిగత ఐడీతో రైలు టికెట్లు బుక్ చేసి ఇతరులకు విక్రయిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. -
ట్రైన్ టికెట్పై GNWL30/WL8 ఉంటే దానర్థం ఏమిటి?
రైలు టికెట్లను బుక్ చేసేటప్పుడు GNWL, WL అని టికెట్లను జారీ చేస్తుంటారు. ఇంతకీ దీనర్థం ఏమిటి? -
మ్యూచువల్ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?
దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. -
ఆదాయపు పన్ను ఫారం 16 సరిచూసుకున్నారా?
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సిన తరుణం వచ్చేసింది. ఇప్పటికే చాలామంది ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16ను అందించాయి. -
ఎస్బీఐ ఖాతా బ్యాలెన్స్.. సులువుగా తెలుసుకుందామిలా..
SBI Balance: ఎస్బీఐ తమ ఖాతాదారులకు పలు రకాల ఆన్లైన్ సేవలను అందిస్తోంది. అకౌంట్లో బ్యాలెన్స్ తెలుసుకోవడానికి పలు సులభమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.. -
ఆదాయపు పన్ను రిటర్నులకు వేళాయె
వేతనం ద్వారా ఆదాయం ఆర్జిస్తున్న వారు, ఆడిట్ పరిధిలోనికి రాని వారు గత ఆర్థిక సంవత్సరానికి గాను రిటర్నులను దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. జులై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. -
ఆధార్ ఉచిత అప్డేట్.. గడువు మరోసారి పొడిగింపు
Aadhaar Update: ఆధార్లో వివరాలు ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు విధించిన గడువు తేదీని మరోసారి పొడిగించింది. -
‘పీఎం కిసాన్’పై మోదీ సంతకం.. పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి..
PM Kisan: పీం- కిసాన్ నిధుల విడుదలపై ప్రధాని మోదీ సంతకం చేశారు. త్వరలో ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. -
ఆధార్ కేవైసీ ధ్రువీకరణ ఉంటే చెక్ అవసరం లేదు: ఈపీఎఫ్వో
ఈపీఎఫ్ క్లెయిమ్ల సత్వర పరిష్కారానికి ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) మార్గం సుగమమైంది. -
₹14 వేలకే దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం.. 22న సికింద్రాబాద్ నుంచి రైలు
IRCTC tour package: దక్షిణాదిలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా?అయితే ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి. -
క్లెయిమ్ల విషయంలో పారదర్శకత పాటించాలి
బీమా పాలసీదారులు, వారి నామినీల హక్కులను కాపాడేందుకు, క్లెయిమ్లను పారదర్శకంగా పరిశీలించేలా బీమా సంస్థలకు తగిన ఆదేశాలు జారీ చేయాలని ఐఆర్డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ)కి పంజాబ్ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సూచించింది -
ఆధార్తో పాన్ జత చేసుకున్నారా?
మీ ఆధార్, పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య)లను అనుసంధానించారా? లేకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం ఈ నెల 31 వరకు అవకాశం ఇచ్చింది. -
పాన్, ఆధార్ అనుసంధానం.. ట్యాక్స్పేయర్లకు మే 31 లాస్ట్డేట్
PAN Aadhaar Link: ఇప్పటికీ పాన్-ఆధార్ అనుసంధానం చేయనివారు 2024 మే 31లోపు పూర్తి చేయాలని ఆదాయ పన్ను విభాగం పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..