AP News: ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి
కర్నూలు జిల్లాలో దైవదర్శనానికి వెళ్తుండగా అదుపుతప్పి ఆటో బోల్తా పడి ఇద్దరు బాలురు
అమరావతి: కర్నూలు జిల్లాలో దైవదర్శనానికి వెళ్తుండగా అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడగా.. ఇద్దరు బాలురు మృతి చెందారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన రాజశేఖర్, హనుమంతు కుటుంబాలు శ్రీశైలం దర్శనానికి ఆటోలో బయలుదేరారు. ప్యాపిలి మండలం ఎస్.రంగాపురం వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పవన్, దినేష్ అనే ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. విగత జీవులుగా పడి ఉన్న చిన్నారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్