AP News: ఆటో బోల్తా.. ఇద్దరు చిన్నారులు మృతి

కర్నూలు జిల్లాలో దైవదర్శనానికి వెళ్తుండగా అదుపుతప్పి ఆటో బోల్తా పడి ఇద్దరు బాలురు

Published : 06 Jul 2021 01:03 IST

అమరావతి: కర్నూలు జిల్లాలో దైవదర్శనానికి వెళ్తుండగా అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఏడుగురు గాయపడగా.. ఇద్దరు బాలురు మృతి చెందారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన రాజశేఖర్, హనుమంతు కుటుంబాలు శ్రీశైలం దర్శనానికి ఆటోలో బయలుదేరారు. ప్యాపిలి మండలం ఎస్‌.రంగాపురం వద్ద అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పవన్, దినేష్ అనే ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. విగత జీవులుగా పడి ఉన్న చిన్నారుల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని