కీసర మాజీ తహసీల్దార్‌ కేసు:ఐదుగురు అరెస్ట్‌

మేడ్చల్‌ జిల్లా కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో మరో ఐదుగురిని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)అధికారులు అరెస్ట్‌ చేశారు.

Published : 30 Sep 2020 01:36 IST

కీసర: మేడ్చల్‌ జిల్లా కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు లంచం కేసులో మరో ఐదుగురిని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ)అధికారులు అరెస్ట్‌ చేశారు. కీసర తహసీల్దార్‌ కార్యాలయ కంప్యూటర్‌ ఆపరేటర్‌ వెంకటేశ్‌తో పాటు స్థిరాస్తి వ్యాపారులు శ్రీకాంత్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, జగదీశ్వర్‌రావు, భాస్కర్‌రావులను అరెస్ట్‌ చేశారు. దీంతో పాటు నకిలీ పాసుపుస్తకాలు జారీ చేసిన కేసులో నాగరాజుపై మరో కేసు నమోదైంది. 

గత నెలలో రూ.కోట్ల విలువైన భూమిని నిబంధనలకు విరుద్ధంగా స్థిరాస్తి వ్యాపారుల పేరు మీద మార్చడానికి మాజీ తహశీల్దార్‌ నాగరాజు రూ.రెండు కోట్లు లంచం డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్‌ కలిసి నాగరాజుకు రూ.1.10కోట్ల లంచం ఇస్తుండగా పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని