అమెరికా పౌరురాలిపై అత్యాచారం

అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఓ మహిళ(37) ఇంట్లోకి చొరబడిన వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు...

Updated : 09 Oct 2020 12:08 IST

రిషికేశ్‌: అగ్రరాజ్యం అమెరికాకు చెందిన ఓ మహిళ(37) ఇంట్లోకి చొరబడిన వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అమెరికాకు చెందిన ఓ మహిళ ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో నివశిస్తూ యోగా నేర్చుకొంటోంది.  ఆమెకు అభినవ్ రాయ్‌ అనే వ్యక్తితో పరిచయం ఉంది. అతను పలుమార్లు ఆ మహిళను ఫ్లాట్‌కు పిలిపించుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. ఈనేపథ్యంలోనే అక్టోబర్‌ 5వ తేదీన మహిళ ఇంట్లోకి చొరబడి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో ఆమె పోలీస్‌ స్టేషన్‌లో కేసుపెట్టింది. ఆ కేసును ఉపసంహరించుకోవాలంటూ నిందితుడి తండ్రి తనను బెదిరించినట్లు బాధితురాలు పోలీసులకు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని