Siddipet: గొంతు కోసి, కాళ్లను శరీరం నుంచి వేరు చేసి.. మహిళ దారుణ హత్య

సిద్దిపేట జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను గొంతు కోసి, కాళ్లను శరీరం నుంచి దుండగులు వేరు చేశారు.

Updated : 24 Aug 2023 11:05 IST

ములుగు: సిద్దిపేట జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఆమె ఇంట్లోనే దుండగులు గొంతు కోసి కాళ్లను శరీరం నుంచి వేరు చేశారు. ములుగు మండలం బండమైలారంలో ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలిని గజ్వేల్‌ ఏసీపీ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మృతి చెందిన మహిళను వెంకటమ్మ (40)గా గుర్తించారు. వెంకటమ్మ ప్లాస్టిక్‌ సామగ్రి అమ్ముతూ జీవనం కొనసాగిస్తుండగా.. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వెంకటమ్మ భర్త గతంలో మృతి చెందారు. కాగా, వెంకటమ్మను హత్య చేసిందెవరు? హత్యకు గల కారణాలేంటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు