Eluru Dist: బావిలో పడిన బైక్.. ఇద్దరు యువకుల మృతి
ద్విచక్రవాహనం అదుపుతప్పి బావిలో పడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు.
ఆగిరిపల్లి: ద్విచక్రవాహనం అదుపుతప్పి బావిలో పడిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కనసానపల్లి గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కనసానపల్లికి సమీపంలోని మామిడి తోటలో ముగ్గురు యువకులు డిసెంబర్ 31 అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకున్నారు. వేడుకలు ముగించుకుని ముగ్గురు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో బైక్ అదుపుతప్పి తోటలో ఉన్న బావిలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా... మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్