Chocolate: గోదాంలోకి చొరబడి చాక్లెట్లను ఎత్తుకెళ్లిన దొంగలు.. ధర రూ.17లక్షలు!

ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ఓ గోదాంలోకి చొరబడిన దొంగలు రూ.17లక్షల విలువైన క్యాడ్బరీ చాక్లెట్లను ఎత్తుకెళ్లారు........

Published : 18 Aug 2022 02:03 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజధాని లఖ్‌నవూలో ఓ గోదాంలోకి చొరబడిన దొంగలు రూ.17లక్షల విలువైన క్యాడ్బరీ చాక్లెట్లను ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిన్హత్‌ ప్రాంతంలో నివాసముండే రాజేంద్ర సింగ్ సిద్ధు చాక్లెట్ల డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. ఇందుకోసం తనకు చెందిన ఓ ఇంటిని గోదాంగా వినియోగిస్తున్నాడు.

అయితే సోమవారం, మంగళవారం రాత్రి ఆ గోదాంలోకి చొరబడిన కొందరు దొంగలు అందులోకి మొత్తం చాక్లెట్లను లూటీ చేశారు. వాటి విలువ రూ.17లక్షల ఉంటుందని ఆ పంపిణీదారు పేర్కొన్నాడు. చాక్లెట్లే కాదు అక్కడి సీసీ కెమెరాలు, ఇతర పరికరాలను సైతం చోరీ చేశారు. బుధవారం ఉదయం గోదాం తలుపులు తెరిచి ఉండటాన్ని గుర్తించిన కొందరు యజమాని సిద్ధుకి సమాచారం అందించారు. అతడు వెళ్లి చూడగా.. గోదాం మొత్తం ఖాళీగా కనిపించింది. దీంతో చోరీపై చిన్హుత్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమీప సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. చోరీ గురించి ఎవరికైనా తెలుసుంటే, తమకు చెప్పాలని ప్రజలను కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని