Kidnap: వేములవాడ రాజన్న ఆలయం వద్ద శిశువు కిడ్నాప్‌.. వరంగల్‌లో ఆచూకీ లభ్యం

సిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయం వద్ద అపహరణకు గురైన శిశువు ఆచూకీ లభ్యమైంది. వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో చిన్నారిని పోలీసులు గుర్తించారు. కరీంనగర్‌కు చెందిన లావణ్య అనే మహిళను భర్తను వదిలేయడంతో నాలుగు రోజులుగా ఆమె తన

Updated : 16 May 2022 14:56 IST

వేములవాడ: సిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయం వద్ద అపహరణకు గురైన శిశువు ఆచూకీ లభ్యమైంది. వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో చిన్నారిని పోలీసులు గుర్తించారు. కరీంనగర్‌కు చెందిన లావణ్య అనే మహిళను భర్తను వదిలేయడంతో నాలుగు రోజులుగా ఆమె తన ఇద్దరు పిల్లలతో వేములవాడ ఆలయం మెట్ల వద్ద ఉంటున్నారు. రాత్రి లావణ్యకు మద్యం తాగించి దుండగులు శిశువును అపహరించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు శిశువు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో ఆచూకీ కనుగొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని