Krishna: రూ.500 కోసం వివాదం.. దంపతుల బలవన్మరణం

కృష్ణా జిల్లా గుడివాడ వాసవీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. రూ.500 కోసం దంపతులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను కలచివేసింది.

Updated : 20 Jan 2024 20:44 IST

గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ వాసవీనగర్‌లో విషాదం చోటు చేసుకుంది. రూ.500 కోసం దంపతులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికులను కలచివేసింది. కొలుసు రాంబాబు .. భార్య కనకదుర్గ, కుటుంబ సభ్యులతో కలిసి వాసవీనగర్‌లో నివసిస్తున్నాడు. మద్యానికి బానిసైన అతను పలుచోట్ల ఉద్యోగం కోల్పోయాడు. ప్రస్తుతం ఏలూరులోని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌లో బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మెకానిక్‌గా పనిచేస్తున్న కుమారుడు గౌతమ్‌కు రాంబాబు రూ.4వేలు పోన్‌ పే ద్వారా పంపాడు. ఆ తర్వాత రెండు విడతలుగా కుమారుడి వద్ద వెయ్యి రూపాయలు తీసుకున్నాడు. మళ్లీ రూ.500 కావాలని భార్యను అడగడంతో ఇద్దరి మధ్య స్వల్ప వివాదం జరిగింది. 

భార్యతో గొడవపడిన రాంబాబు ఇంట్లో ఉరి వేసుకోగా... కుటుంబ సభ్యులు హుటాహుటిన గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తండ్రి మరణించిన విషయాన్ని తల్లి కనకదుర్గకు కుమారుడు ఫోన్‌ చేసి చెప్పాడు. భర్త మరణవార్త విని మనస్తాపానికి గురైన భార్య ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి కనకదుర్గ ఉరితాడుకు వేలాడుతూ కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. రోజూ కళ్ల ముందు తిరిగే దంపతులు స్వల్ప విషయానికే ఆత్మహత్యకు పాల్పడటంతో వాసవీనగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. క్షణికావేశంలో జరిగిన ఈ ఘటనను కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు