దెయ్యాలు ఆవహించాయని నవ వధువుపై అత్యాచారం.. నకిలీ బాబా అరెస్టు
భూత వైద్యం పేరుతో నవ వధువుపై అత్యాచారం చేసిన నిందితుడిని బండ్లగూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్: భూత వైద్యం పేరుతో నవ వధువుపై అత్యాచారం చేసిన నిందితుడిని బండ్లగూడ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నకిలీ బాబాను పట్టుకోవడం కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు కొన్నిరోజులుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్ వద్ద పట్టుకున్నారు. నిందితుడిని కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారిస్తామని ఏసీపీ మనోజ్ కుమార్ వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..?
హుస్సేనిఆలం ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థినికి తలాబ్కట్ట భవానీనగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తితో 3 నెలల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అత్తారింటికి వచ్చిన కొద్ది రోజులకు ఆమె ఆరోగ్యం క్షీణించింది. దుష్టశక్తులు ఆవహించాయన్న అనుమానంతో తల్లి సూచన మేరకు భర్త ఆమెను మొదట బర్కత్పురలోని ఓ బాబా వద్దకు తీసుకెళ్లి పూజలు చేయించారు. అయినా ఫలితం లేకపోవడంతో జులై మొదటివారంలో పాతబస్తీ బండ్లగూడ రహ్మత్నగర్లోని తాంత్రికుడు మజహర్ఖాన్ (30) వద్దకు తీసుకెళ్లారు. ఆమెను 5 దెయ్యాలు ఆవహించాయని, వదిలించేందుకు పూజలు చేయాలని చెప్పాడు. మొదట తలాబ్కట్టకు వచ్చి బాధితురాలి ఇంటిని పరిశీలించాడు.
వివస్త్రను చేసి నూనే రాస్తూ..
రెండు రోజుల తరువాత తన ఇంటికి రావాలని కోరాడు. బాధితురాలు తన భర్తతో కలిసి బండ్లగూడలోని నకిలీ బాబా ఇంటికొచ్చింది. ఆమె నడుము చుట్టూ దారం కట్టాలని, కళ్లకు గుడ్డ కట్టాలని భర్తకు చెప్పాడు. అలా చేసి పూజలంటూ భర్తను బయటకు పంపాడు. బాధితురాలిని పడుకోబెట్టి నూనె వేసి మర్దనం చేశాడు. తరువాత వివస్త్రను చేసి శరీరం అంతా నూనె రాస్తూ, అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక దాడికి పాల్పడ్డాడు. తరువాత పాలతో శరీరం కడిగి నూతన వస్త్రాలు ధరించాలని చెప్పాడు. ఇక్కడ జరిగిన పూజ విషయాలు ఎవరికీ చెప్పొద్దని, అలా చెబితే అనర్థాలు జరుగుతాయని భయపెట్టాడు.
సీఐ బదిలీ కావడంతో..
ఇంటికి వెళ్లిన బాధితురాలు మొత్తం చెప్పేసి ఠాణాలో ఫిర్యాదు చేద్దామంటే వద్దంటూ ఆమెను కుటుంబసభ్యులు ఓ గదిలో బంధించారు. 10 రోజుల తరువాత ఇంటికి వచ్చిన సోదరికి విషయం చెప్పి ఠాణాలో ఆగస్టు 19న ఫిర్యాదు చేసింది. అప్పటి ఇన్స్పెక్టర్ అమ్జద్అలీ వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మజహర్ఖాన్ మహారాష్ట్రకు పరారయ్యాడు. సీఐ బదిలీ కావడంతో కేసులో పురోగతి లేదు. బాధితురాలి ఒత్తిడితో భవానీనగర్ పోలీసులు ఆగస్టు 22న కేసును బండ్లగూడ ఠాణాకు బదిలీ చేశారు. ఎట్టకేలకు నిందితుడిని ఇవాళ పట్టుకొని రిమాండ్కు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్లో గంజాయి, ఎంఎండీఏ స్వాధీనం
కూకట్పల్లి ఠాణా పరిధిలోని శేషాద్రినగర్లో స్థానిక పోలీసులతో కలిసి ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. -
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అబ్బరాజు పృథ్వీరాజ్(30) దుర్మరణం పాలయ్యారు. -
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల వ్యవహారం.. కామారెడ్డి డీఎంహెచ్వో అరెస్టు
మహిళా వైద్యాధికారులపై లైంగిక వేధింపుల కేసులో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్ గురువారం అరెస్టు అయ్యారు. ఈ వ్యవహారంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న శ్రీనివాస్నాయక్పై కూడా ఓ కేసు నమోదైంది. -
రూ.లక్ష... 50 వేలు... 30 వేలు!
రాష్ట్రంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో గురువారం ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. వారిలో ఒకరు వ్యవసాయ, ఇద్దరు విద్యుత్తు ఉద్యోగులు ఉన్నారు. -
దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరి మృతి
విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడగా.. మరొకరికి గాయాలైన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో చోటుచేసుకుంది. -
చెరువులో మునిగి ముగ్గురు అక్కాచెల్లెళ్ల మృతి
చెరువులో దీపాలు వదిలేందుకు వెళ్లి, ప్రమాదవశాత్తు అందులో పడి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. -
నలభై ఏళ్ల తర్వాత ఖైదీ పట్టివేత
నలభై ఏళ్ల నుంచి తప్పించుకొని తిరుగుతున్న ఓ ఖైదీని ఎట్టకేలకు పట్టుకున్నారు. జైలు అధికారులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్ మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్.వీరన్న మహబూబాబాద్లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. -
టెస్కాబ్ ఉన్నతాధికారిణిని నమ్మి అడ్డంగా మోసపోయారు!
రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్)లో ఒక ఉన్నతాధికారిణి మాటలు నమ్మి అందులో పనిచేస్తున్న పలువురు అధికారులు, ఉద్యోగులు మోసపోయారు. -
బాలికలతో బలవంతంగా వ్యభిచారం
అంతర్ రాష్ట్ర వ్యభిచార రాకెట్తో ప్రమేయం ఉందనే ఆరోపణలపై ప్రభుత్వ అధికారులు సహా 21 మందిని అరుణాచల్ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?