Andhra News: చంద్రగిరిలో రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

Updated : 18 Feb 2022 22:16 IST

చంద్రగిరి : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. విశాఖపట్నం గాజువాకకు చెందిన స్వాతి తన చిన్నకుమార్తె చాముండేశ్వరి (చాము) తలనీలాలు ఇవ్వడం కోసం తిరుమలకు వచ్చారు. శ్రీవారి దర్శనం శనివారం ఉండటంతో శుక్రవారం తమిళనాడు రాష్ట్రం వేలూరులోని గోల్డెన్‌ టెంపుల్‌ను దర్శించుకునేందుకు వెళుతున్నారు.  

ఈ క్రమంలో ఐతేపల్లి వద్దకు రాగానే వీరి కారు  అదుపుతప్పి ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో స్వాతి, ఆమె కుమార్తె , ఆమె తమ్ముడు ప్రేమ్ కుమార్‌లతో పాటు మరొక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న డ్రైవర్ ఖాదర్ బాషా పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి తిరుపతి పశ్చిమ విభాగం డీఎస్పీ, సీఐ చేరుకుని మృత దేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని