AP News: రసాయన పరిశ్రమలో ప్రమాదం.. ఒకరి మృతి

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారవ సమీపంలోని రసాయన పరిశ్రమలో విషవాయువులు లీకయ్యాయి.

Updated : 08 Jan 2022 13:06 IST

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నారవ సమీపంలోని రసాయన పరిశ్రమలో విషవాయువులు లీకయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా.. మరో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని విజయనగరంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. నిన్న సాయంత్రం 5.30గంటల సమయంలో ఘటన జరిగింది. మృతుడిని పార్వతీపురం వాసి బోగి ప్రసాదరావుగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని