ఇద్దరు యువకులపై కేసు నమోదు 

దంపతుల వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి వారి నుంచి నగదు డిమాండ్‌ చేస్తున్న...

Published : 05 Mar 2020 00:36 IST

గుడివాడ: దంపతుల వ్యక్తిగత వీడియోలను చిత్రీకరించి వారి నుంచి నగదు డిమాండ్‌ చేస్తున్న ఇద్దరు యువకులపై కృష్ణా జిల్లా గుడివాడ ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడకు చెందిన దంపతుల పడకగది దృశ్యాలను అట్లూరి రఘు, షేక్‌ అన్వర్‌లు రహస్యంగా చిత్రీకరించారు. ఇటీవల వాటిని బయట పెడతామని వారిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో నగదు డిమాండ్‌ చేయడంతో బాధితులు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబును ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని